Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 21 April 2025
webdunia

వ్యక్తిత్వ హననానికి పాల్పడే సైకోలను నడిరోడ్డుపై ఉరితీయాలి : వైఎస్ భారతి

Advertiesment
ys sharmila

ఠాగూర్

, శుక్రవారం, 11 ఏప్రియల్ 2025 (15:15 IST)
తన వదినమ్మ, వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిని ఉద్దేశించి ఐ-టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడే సైకోలను నడిరోడ్డుపై ఉరితీయాలని ఆమె డిమండ్ చేశారు. భారతి రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఇలాంటి నీచపు వ్యాఖ్యలు తీవ్రవాదంతో సమానమన్నారు. ఈ సైకో గాళ్ళను నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదన్నారు. తప్పుడు కూతలు కూసిన వెధవలను, రేటింగ్స్ కోసం ప్రోత్సహించే యూట్యూబ్ చానళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. 
 
కూటమి ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నాను. సమాజం ఇలాంటి మకిలి చేష్టలను హర్షించదన్నారు. ఏ పార్టీకి చెందిన వాళ్లయినా, వాళ్లు ఎంతటి వాళ్ళయినా శిక్ష పడాల్సిందే. వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది. ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైకాపా, టీడీపీలే. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి రెండు పార్టీలో ఆదర్శం.
 
అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఉచ్ఛం, నీచం, మానం మర్యాద లేకుండా ప్రవర్తించారు. రక్త సంబంధాన్ని మరిచారు. రాజకీయ కక్షతో కుటుంబాలను రోడ్డుమీదికి లాగారు. మనిషి పుట్టుకను అవమానించి రక్షసానందం పొందారు. అన్యం, పున్యం ఎరుగని పసిపిల్లలను సైతం లాగారు. అక్రమ సంబంధాలు అంటగట్టారు. మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇపుడు వ్యవస్థను భ్రష్టుపట్టించారు. ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలి" అని షర్మిల పిలుపునిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇలాంటి సైకోలను బహిరంగంగా ఉరితీస్తే తప్పు ఉండదు- వైఎస్ షర్మిల