బొప్పాయి పండు వీరు తినకూడదు, ఎందుకంటే?

బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది అయినప్పటికీ, కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తినకపోవడం లేదా పరిమితంగా తినడం మంచిది. బొప్పాయి తినకూడని వారు ఎలాంటి వారో తెలుసుకుందాము.

credit: social media and webdunia

గర్భిణీ స్త్రీలు పండని లేదా సగం పండిన బొప్పాయిని అస్సలు తినకూడదు. ఇందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ గర్భాశయ సంకోచాలకు కారణమై అబార్షన్‌కు దారితీయవచ్చు.

బొప్పాయిలోని కొన్ని రసాయనాలు తల్లి పాల ద్వారా శిశువులోకి చేరి వారికి కొన్ని ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు.

బొప్పాయిలో ఫైబర్ అధికం. ఇది జీర్ణక్రియకు మంచిదే కానీ, అధిక మొత్తంలో తీసుకుంటే కొందరిలో విరేచనాలు, డీహైడ్రేషన్, కడుపులో మంట, మలబద్ధకం వంటి సమస్యలను పెంచవచ్చు.

బొప్పాయి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గించగలదు. కాబట్టి తక్కువ రక్త చక్కెర సమస్య ఉన్నవారు బొప్పాయి తింటే వారి రక్తంలోని చక్కెర స్థాయిలు మరింత పడిపోయే అవకాశం ఉంది.

రక్తపోటు తగ్గడానికి మందులు వాడుతున్నవారు బొప్పాయిని తినకూడదు. బొప్పాయి రక్తపోటును మరింత తగ్గించి సమస్య తీవ్రతరం అయ్యేలా చేస్తుంది.

కొంతమందికి బొప్పాయి పడకపోవచ్చు, అలర్జీని కలిగించవచ్చు. అలాంటివారు బొప్పాయికి దూరంగా ఉండాలి.

క్రమరహిత గుండె స్పందనలు ఉన్నవారు బొప్పాయిని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

పురుషులు బొప్పాయి విత్తనాలను తినకూడదు. అవి వీర్యాన్ని నాశనం చేస్తాయని చెబుతారు.

ఏ సమస్య లేనివారు రోజుకి ఒక కప్పు మించకుండా బొప్పాయిని పరిమితంగా తీసుకోవడం మంచిది.

ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే బొప్పాయిని తినే ముందు వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి విరుగుడు

Follow Us on :-