పాకిస్థాన్ దేశంలో ఉగ్రవాదాలు మరోమారు పెట్రేగిపోయారు. రైలు మార్గాన్ని లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. పట్టాలపై అమర్చిన ఐఈడీ బాంబు పేలడంతో జాఫర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ రైలుకు చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ విషయాన్ని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.
ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం తారా స్థాయికి చేరింది. దీంతో తమ దేశ పౌరులకు ఇరాన్ ఓ హెచ్చరిక చేసింది. తమ స్మార్ట్ ఫోన్ల నుంచి ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ను తక్షణం తొలగించాలని ఇరాన్ ప్రభుత్వం సంచలన సూచన చేసింది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని వాట్సాప్ నుంచి సేకరించి ఇజ్రాయెల్కు చేరవేస్తోందని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ద్వారా విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
కేంద్ర రోడ్డు రవాణా-రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం కార్ల కోసం రూ.3,000 ధరతో కూడిన ఫాస్ట్ట్యాగ్ ఆధారిత వార్షిక పాస్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సంవత్సరం ఆగస్టు 15 నుండి ఇది అమలులోకి వస్తుంది, దీనిని ఆయన "ఇబ్బందులు లేని హైవే ప్రయాణం వైపు పరివర్తనాత్మక అడుగు" అని అభివర్ణించారు.ఈ పాస్ యాక్టివేషన్ తేదీ నుండి ఒక సంవత్సరం లేదా 200 ట్రిప్పుల వరకు చెల్లుబాటు అవుతుందని మంత్రి చెప్పారు. ఏది ముందుగా వస్తే అది - ఈ పాస్ కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.
లక్ష్యం దన్నుగా, ప్రేమపూర్వకమైన మార్గదర్శకత్వంతో హామీలను నిలబెట్టుకోవడంలో ఒక తండ్రి ప్రస్థానాన్ని ప్రతిబింభించే ఎస్బీఐ లైఫ్ #PapaHaiNa చిత్రం. చాలా సందర్భాల్లో తండ్రులు నిశ్శబ్దంగా తమ కుటుంబానికి మొక్కవోని చిత్తశుద్ధితో శక్తి, స్థిరత్వాన్ని అందించే మూలస్తంభంగా నిలుస్తుంటారు. తమ కుటుంబ సభ్యుల సంక్షేమానికి, వారి భవిష్యత్తుకు ప్రాధాన్యతనిస్తూ తండ్రులు ఇటు వ్యక్తిగత, అటు వృత్తిగత బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ ఉంటారు. ఈ ఫాదర్స్ డే సందర్భంగా, తండ్రి అందించే శక్తిని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో వారు చూపే చిత్తశుద్ధిని హృదయానికి హత్తుకునే విధంగా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ తమ #PapaHainNa డిజిటల్ ప్రాపర్టీ కింద 'పాపా భూల్తే నహీ' అనే డీవీసీని రూపొందించింది.
చాంద్రమాన క్యాలెండర్లోని ఎనిమిదవ రోజు, "అష్టమి" అని పిలువబడుతుంది. అదీ బుధవారం అష్టమి వచ్చిందంటే.. ఆ రోజును బుద్ధాష్టమి అని పిలుస్తారు. భక్తులు ఈ రోజున శివుడిని, పార్వతి దేవిని పూజిస్తారు. బుద్ధ అష్టమి నాడు ఉపవాసం ఉంటే, వారు మరణించిన తర్వాత నరకానికి వెళ్లరని పురాణాలు చెబుతున్నాయి. తమ జీవితాల్లో సంపద, శ్రేయస్సు కోసం భక్తులు బుద్ధ అష్టమి వ్రతాన్ని ఆచరిస్తారు.
మనమంతా జగనన్న సైన్యం, టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వంట్లో భయం పుట్టేలా చేద్దామని వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏపీ మద్యం స్కామ్లో ఏపీ పోలీసులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఆయన శ్రీలంకకు పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటగా, నాటకీయ ఫక్కీలో ఆయనను బెంగుళూరు విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన పార్టీ కార్యకర్తలకు, నేతలకు ఒక వాయిస్ మెసేజ్ పంపించారు.
బెల్లం టీ. ఈ టీలో జింక్, సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. బెల్లం టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.బెల్లం టీ తాగితే జలుబు, దగ్గు నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది.ఆస్తమా, బ్రాంకటిస్ వంటి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.బెల్లం టీలోని పొటాషియం రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.బెల్లం టీ జీర్ణ ఎంజైమ్లను ప్రేరేపిస్తుంది, మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది.బెల్లం టీ ఐరన్ యొక్క అద్భుతమైన మూలం, ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.
తూర్పు ఇండోనేషియాలోని లెవోటోబి లకి లకి అగ్నిపర్వతం బద్ధలైంది. దానికి సమీపంలోని బాలికి వెళ్లే ఎయిరిండియా విమానం వెనక్కి మళ్లింది. అక్కడి నుంచి తిరుగపయనమైన విమానం బుధవారం ఢిల్లీకి సురక్షితంగా చేరుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. దీంతో భారత్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి బాలికి వచ్చే పలు అంతర్జాతీయ విమానాలను రద్దు చేసిననట్టు తెలిపారు. అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తూర్పు ఇండోనేషియాలోని సుసా టెంగారా ప్రావిన్స్లోని విమానాశ్రయాన్ని మూసివేసిట్టు వెల్లడించారు.
తన భర్త తీసుకున్న అప్పును చెల్లించలేకపోయిన మహిళను చెట్టు కట్టేసి దాడి చేసిన ఘటన కుప్పంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. తల్లిని అలా చెట్టుకు కట్టికొడుతుంటే రాయిపై కూర్చుని ఆమె కుమారుడు ఏడుస్తూ వుండటం చూసిన నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఈ వీడియో కాస్త ఏపీ సర్కారు దృష్టికి వెళ్లింది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు మహిళపై దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసారు. ఆ మహిళ పేరు శిరీష అని, రూ.80,000 చెల్లించకుండా ఎగవేసినందుకు రుణదాత ఆమెను వేధిస్తున్నాడని తరువాత తేలింది.
అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను పలు విధాలుగా చిత్రహింసలకు గురిచేయడంతో పాటు ఆమెతో చేసే శృంగారాన్ని భర్త ఆన్లైన్ ఆఫర్ చేశాడు. అతనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. నిందితుడిపై అత్యాచారం, గ్యాంగ్ రేప్, లైంగిక వేధింపులు, క్రూరమైన ప్రవర్తన, విశ్వాసాన్ని భంగపరచడం వంటి అభియోగాలు ఎఫ్ఐఆర్లో ఉన్నాయి. ఇది సాధారణ వైవాహిక వేధింపులు కేసు లాంటిది కాదని జస్టిస్ గిరీశ్ కథాపాలియా వ్యాఖ్యానిస్తూ, నిందితుడుకి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు.
భారతదేశపు అత్యంత పరిశుభ్రమైన బ్రాండ్లలో ఒకటి డెట్టాల్, తాము ఎంతగానో ఇష్టపడే కోలోన్ ఫ్రెష్, లైఫ్ ఫ్రెష్ సోప్ రకాలలో 12 గంటల తాజాజనం పరిచయం చేసి తమ వ్యక్తిగత సంరక్షణ వాగ్థానాన్ని నిలుపుకుంది. ఈ ఆఫరింగ్ పెరుగుతున్న వినియోగదారుల అవసరాన్ని తీర్చడానికి రూపొందించబడింది. మీరు రక్షణను కలిగి ఉన్నారు, పూర్తి రోజంతా తాజాదనం కలిగి ఉన్నారని తెలుసుకోవడం నుండి ఆత్మవిశ్వాసం వచ్చింది.
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర మాజీమంత్రి కేటీఆర్కు ఆ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అల్టిమేటం జారీచేసింది. ఫోన్, ల్యాప్టాప్ ఇవ్వాల్సిందేనని ఏసీబీ అధికారులు తేల్చి చెప్పారు. ఇందుకోసం బుధవారం సాయంత్రం వరకు గడువు విధించారు. మరోవైపు, కేటీఆర్ కూడా ఏసీబీ ఇచ్చిన అల్టిమేటం, గడువుపై న్యాయ నిపుణుల అభిప్రాయాలను తీసుకున్నారు.
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో సినీ నటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంత్పై దాడి జరిగింది. ఈ దాడిపై ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసున మోదు చేసి విచారణ జరుపుతున్నారు. గచ్చిబౌలి ప్రధాన రహదారిని ఆనుకుని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లే ఔట్లో సంధ్యా కన్వెన్షన్ ఆక్రమణలను నెల రోజుల క్రితం హైడ్రా తొలగించింది. అనుమతి లేకుండా నిర్మించిన మినీ హాల్, పలు గదులు, 2 షెడ్లను నేలమట్టం చేసింది.
ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆయనను అరెస్టు చేసింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో సంచలనం సృష్టించిన ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి 38వ నిందితుడు. అరెస్టు సమయంలో చెవిరెడ్డితో పాటు ఆయన బినామీ సహచరుడు వెంకటేష్ నాయుడు (34) కూడా ఉన్నారు.చెవిరెడ్డి సిట్ నిఘాలో ఉన్నారు, నాటకీయ పరిణామాల నేపథ్యంలో, ఆయన, వెంకటేష్ నాయుడు శ్రీలంకకు విమానం ఎక్కే కొద్ది క్షణాల ముందు అరెస్టు చేయబడ్డారు.
మాజీమంత్రి వైసీపీ నేత కొడాలి నానిపై పలు కేసులు వున్నాయి. లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు కోల్కత్తా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కోల్కతా నుంచి కొలంబో వెళ్తుండగా ఆయనను ఎయిర్పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వైసీపీ హయాంలో కోడాలి నాని అక్రమాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులు ఉన్నాయి. కూటమి అధికారం లోకి వచ్చిన తరువాత కొడాలి నాని పైన కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఆ తరువాత అనారోగ్య సమస్యలతో కొడాలి నాని ఆస్పత్రిలో చేరారు.
తమిళంలో "దాదా" పేరుతో విడుదలై అక్కడ దాదాపు 40 కోట్లు వసూలు చేసిన చిత్రాన్ని తెలుగులో "పాపా" పేరుతో అనువదించి థియేటర్లలో విడుదల చేశారు. ఎన్నారై శ్రీమతి నీరజ కోట ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈ చిత్రం తమిళంలో క్రియేట్ చేసిన మ్యాజిక్ తెలుగులోనూ రిక్రియేట్ చేయగలుగుతుందా లేదా అనేది తెలుసుకుందాం.
మేఘాలయ రాష్ట్రానికి హనీమూన్ కోసం వెళ్లిన నవ దంపతుల్లో వరుడు హత్యకు గురైన కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ హత్య కేసులో మృతుడు భార్య, నవ వధువు సోనమ్ రఘువంశీ, ఆమె ప్రియుడే ప్రధాన సూత్రధారులుగా తేలింది. అయితే, తన కళ్లముందు కిరాయి ముఠా సభ్యులు వేటకొడవలితో నరుకుతుంటే భార్య సోనమ్ అక్కడ నుంచి పారిపోయింది. తన ప్రియుడు రాజ్ కుష్వాహా, మరో ముగ్గురు కిరాయి హంతకులతో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు తేల్చారు. అదేసమయంలో మేఘాలయలో పోలీసులు ఈ హత్యలో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చసారు. అలాగే, ఈ హత్యకు వాడిన రెండో వేట కొడవలిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చిరంజీవి సరసన కథానాయికగా నటిస్తున్న నయనతార ఈరోజు ముస్సోరీలో షూటింగ్ లో జాయిన్ అయ్యారు. కథా పరంగా, తన పాత్రపై ఎంతో ఆనందంగా వున్న నయనతార, సినిమా ప్రమోషన్ల్లో చురుకుగా పాల్గొనాలని నిశ్చయించుకున్నారు. ఇటీవలే ఆమె ఒక ప్రత్యేక ప్రమోషనల్ వీడియో చేశారు. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రాబోయే ప్రచార కార్యక్రమాల్లో నయనతార అదరగొట్టబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో పోలీసులకు, సీపీఐ (మావోయిస్ట్) పార్టీ కార్యకర్తలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక కేంద్ర కమిటీ సభ్యుడు సహా ముగ్గురు మావోయిస్టులు బుధవారం మృతి చెందారు.ఈ ఎన్కౌంటర్లో మరణించిన ముగ్గురు నక్సల్స్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్ర ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ బిరుసు, ఏఓబీ సభ్యుడు వెంకట రవి లక్ష్మీ చైతన్య అలియాస్ అరుణ ఉన్నారు. మరో నక్సల్ను ఇంకా గుర్తించలేదు.
గోదావరి-బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ (PFR)ను తిరస్కరించాలని కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ప్రాజెక్టును సమర్థించింది. దీనివల్ల ఎగువ రాష్ట్రాల ప్రయోజనాలకు ఎటువంటి హాని జరగదని వాదించింది. రాష్ట్ర జలవనరుల అభివృద్ధి మంత్రి నిమ్మల రామానాయుడు విలేకరుల సమావేశంలో ఈ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రతి సంవత్సరం గోదావరి నది నుండి 3,000 టీఎంసీ నీరు సముద్రంలోకి వృధాగా పోతుందని ఎత్తి చూపారు.
పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న పార్టీ కార్యకర్త కుటుంబాన్ని ఓదార్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ, వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదార్చడానికి జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలోని రెంటపల్ల పర్యటనకు వెళతారు.
ప్రభుత్వ కార్యాలయాల్లోని అవినీతికి ఈ ఘటన అద్దం పడుతోంది. జీహెచ్ఎంసీలోని కాప్రా సర్కిల్లో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్ స్వరూప.. రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని కాప్రా సర్కిల్, చర్లపల్లి డివిజన్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ స్వరూప లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదంకార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొందరి వ్యాఖ్యలు నీరుగారుస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. ఆచితూచి అడుగేయండి. అనాలోచిత నిర్ణయం నష్టం కలిగిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలుమనోధైర్యంతో మెలగండి. సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది. చేస్తున్న పనులు మధ్యలో నిలిపివేయవద్దు. దంపతుల మధ్య సఖ్యత లోపం. చిన్న విషయానికే చికాకుపడతారు. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ కొనసాగుతోంది. తెలంగాణలో 2023 ఎన్నికలకు రెండు నెలల ముందు ఈ సంఖ్యలు భారీగా ఉన్నాయని సిట్ సమాచారం సేకరించింది. ఇప్పటివరకు, 600 మంది ఫోన్ ట్యాపింగ్ బాధితులుగా తేలిందని సిట్ తెలిపింది. బాధితుల్లో జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నారు. బాధితులు జూబ్లీహిల్స్ పీఎస్కు వచ్చి తమ స్టేట్మెంట్లను ఇస్తున్నారు.
వైసీపీ విధానాలపై దివ్వెల మాధురి ఫైర్ అయ్యారు. వైకాపా విధానాలు లీడర్, లీడర్కు మారుతుందా అని ప్రశ్నించారు. వైకాపా గాలి పార్టీ అని దివ్వెల మాధురి ఏకి పారేశారు. దువ్వాడ శ్రీనివాస్- దివ్వెల మాధురి రీల్స్ చేయడం వల్లే వైసీపీ నుంచి సస్పెండ్ చేశారని వస్తున్న వార్తలపై దివ్వెల మాధురి స్పందిస్తూ.. జగన్మోహన్ రెడ్డిని ఇన్ డైరెక్ట్గా ప్రశ్నించారు.
చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. భార్య సబ్బును వాడిన పాపానికి అతడు జైలు పాలయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో జరిగింది. తన అనుమతి లేకుండా తన సబ్బును ఉపయోగించాడనే కారణంగా సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ వింత సంఘటనకు కేంద్ర బిందువుగా ఉన్న ప్రవీణ్ కుమార్ తన భార్య వ్యక్తిగత సబ్బును ఉపయోగించానని, దీనితో వివాదం చెలరేగిందని ఆరోపించారు. భార్య పోలీసులను సంప్రదించడంతో ఇంట్లో చిన్న గొడవ పెరిగి పెద్దదైంది.
హనీమూన్ పేరుతో తీసుకెళ్లిన భర్తను అతి కిరాతకంగా భర్త చంపించేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా యూపీలో పెళ్లి అయిన పది రోజులకే నవ వధువు ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్లో కనిపించింది. వివరాల్లోకి వెళితే.. యూపీలోని బదౌన్కు చెందిన సునీల్కు ఇటీవల వివాహం జరిగింది. పెళ్లైన పదిరోజులకే ప్రియుడితో నవ వధువు పారిపోయింది. తర్వాత పోలీసులను ఆశ్రయించింది.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి కొత్త విషయాలు బయటపడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ షర్మిల ఫోన్ కూడా ట్యాప్ చేయబడిందని బయటపడింది. ఆమె ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకున్న తర్వాత, ఆ వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేయబడ్డాయని తాజా సమాచారం. వివిధ రాజకీయ నాయకులు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయబడినట్లు టాక్. తాజా వార్త ఏంటంటే.. ఏపీ పీసీసీ చీఫ్ ఫోన్ ట్యాప్ చేయబడింది అనేదే. వైఎస్ఆర్సీపీ పాలనలో జగన్ సోదరి షర్మిల సెల్ ఫోన్ను అత్యంత రహస్యంగా ట్యాప్ చేశారని బయటపడింది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గత ప్రభుత్వం హయాంలో ఫోన్ ట్యాపింగ్లో పాల్గొన్న వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. తమ రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేయాలని ఆదేశించిన అప్పటి అధికార పార్టీ నాయకులను, ఆదేశాలను పాటించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను శిక్షించాలని ఆయన అన్నారు.
కొత్తగా స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులకు సరికొత్త డిజిటల్ అనుభవాన్ని అందించేందుకు రిలయన్స్ జియో స్టార్టర్ ప్యాక్ను ప్రారంభించింది. కేవలం రూ.349తో కస్టమర్లు జియో స్టార్టర్ ప్యాక్ను పొందవచ్చు. కొత్త మొబైల్ పరికరాన్ని కొనుగోలు చేసే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ ప్యాక్ డిజిటల్ యుటిలిటీ మరియు అనుభవాన్ని పెంచే లక్ష్యంతో శక్తివంతమైన ప్రయోజనాలను అందిస్తుంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన '8 వసంతాలు' చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. అనంతిక సునీల్కుమార్ లీడ్ రోల్ పోషించారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన 8 వసంతాలు సోల్ఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం జూన్ 20న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి సినిమా విశేషాలు పంచుకున్నారు.
పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న తన అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ను ప్రారంభించనున్నారు. హై-ఆక్టేన్ కథలకు పాపులరైన పూరి, తన సిగ్నేచర్ మాస్, కమర్షియల్ స్టయిల్ ని విజయ్ సేతుపతి మాగ్నెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్తో బ్లెండ్ చేసి ఒక యూనిక్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తారు. అన్ని ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీలు పూర్తయ్యాయి.
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ "తమ్ముడు". ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న "తమ్ముడు" సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
మాస్ మహారాజ్ రవితేజ తాజా సినిమా ‘మాస్ జాతర’. ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు కొత్త సినిమాకుశ్రీకారం చుట్టారు. తన 76వ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. దానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ శివార్లో ప్రారంభమైంది. అందులో రవితేజ ఎంట్రీ ఇచ్చారు. కిషోర్ తిరుమల డైరెక్షన్లో రవితేజ చేస్తున్న ఈ సినిమా గురించి తాజా అప్ డేట్ తో ఫొటో విడుదలచేసింది చిత్ర టీమ్.
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'ఓ భామ అయ్యో రామ'. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
శ్రీలీల తన తల్లిదండ్రులతో ఆమె సన్నిహిత ప్రీ-బర్త్డే వేడుకలో మిహీక పాల్గొంది, అంతేకాక ఆమె ఆ మధురమైన జ్ఞాపకాలను హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలుతో పాటు పోస్ట్ చేసింది. ఇద్దరు మహిళలు ప్రకాశవంతంగా కనిపిస్తూ, వెచ్చని క్షణాలను పంచుకుంటున్న చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
భారతదేశంలోని అగ్రశ్రేణి టెక్ కంపెనీలలో ఒకటైన టీసీఎస్, బెంచ్ పీరియడ్కు సంబంధించి కొత్త ఆదేశాలను జారీ చేసింది. జూన్ 12 నుండి కొత్త విధానం అమలులోకి వస్తోంది. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా 225 బిల్ చేయబడిన పని దినాలు పనిచేయాలని నిర్ణయించింది. బెంచ్లోని రోజులు 35 రోజులకు పరిమితం చేయబడ్డాయి. ఉద్యోగులు పని చేయని సమయాన్ని తగ్గించడానికి, శ్రామిక శక్తిని గరిష్టంగా ఉపయోగించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రస్తావించబడింది. ఒక ఐటీ సంస్థలో, బిల్ చేయబడిన రోజులు అంటే ఉద్యోగి క్లయింట్, ప్రాజెక్ట్లో పనిచేసే రోజులు. దీని అర్థం ఉద్యోగి ఏదైనా ప్రాజెక్ట్లో 225 రోజులు పని చేయాల్సి ఉంటుంది.
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ రఫ్ నోట్ ప్రొడక్షన్ నిర్మాణంలో, ప్రముఖ దర్శకుడు మరియు సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో ఇప్పటికే పలువురు తారలు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. రాజ్తరుణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రేమిస్తే భరత్, సునీల్, పాలడబ్బా తదితరులు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు వీరి జాబితాలో ప్రముఖ తమిళ నటి అమ్ము అభిరామ్ చేరారు.
ఐక్యరాజ్యసమితి, వాణిజ్య ట్రక్కులు ఆహారంతో భూభాగంలోకి ప్రవేశించడానికి గాజా స్ట్రిప్లోకి ప్రవేశించినప్పుడు దాడి జరిగింది. కనీసం 45 మంది పాలస్తీనియన్లు మరణించారు. హత్యలకు సంబంధించిన సరైన పరిస్థితులు వెంటనే స్పష్టంగా తెలియలేదు.గత నెలలో కేంద్రాలు ప్రారంభించినప్పటి నుండి, ప్రత్యేక అమెరికా, ఇజ్రాయెల్ మద్దతుగల సహాయ బృందం నిర్వహిస్తున్న ఆహార పంపిణీ కేంద్రాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న జనంపై ఇజ్రాయెల్ దళాలు పదేపదే కాల్పులు జరిపాయని పాలస్తీనియన్లు చెబుతున్నారు.
అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్కు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం గుర్తించిన తర్వాత, దానిని రద్దు చేశారు. టేకాఫ్కు ముందు చివరి గంటల్లో సాంకేతిక సమస్యల గురించి సమాచారం అందిన తర్వాత, షెడ్యూల్ చేయబడిన అహ్మదాబాద్-లండన్ విమానాన్ని రద్దు చేయాలని విమానం నిర్ణయించింది.ఎయిర్ ఇండియా విమానం AI 159 టేకాఫ్కు నిమిషాల ముందు రద్దు చేయబడింది. 200 మందికి పైగా ప్రయాణికులతో ఉన్న విమానం మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు బయలుదేరాల్సి ఉంది.
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజక వర్గం కుప్పంలో అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేశాడు వడ్డీ వ్యాపారి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. మునికన్నప్ప వద్ద రూ.80 వేలు అప్పు చేసాడు శిరీష భర్త తిమ్మరాయప్ప. అయితే ఆ అప్పు తీర్చలేక భార్య, బిడ్డలను వదిలేసి వెళ్లాడు తిమ్మరాయప్ప. దీంతో అప్పు తీర్చాలంటూ శిరీషకు వేధింపులు మొదలయ్యాయి. కూలీ పని చేస్తూ అప్పు కడుతోంది.
సినీ లెజెండ్ కమల్ హాసన్ కన్నడ భాష గురించి చేసిన వ్యాఖ్యలపై ఆయన సినిమా "థగ్ లైఫ్" విడుదలను అడ్డుకున్నందుకు కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మంగళవారం తీవ్రంగా విమర్శించింది. కర్ణాటక ఫిల్మ్ చాంబర్ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, కర్ణాటక హైకోర్టు ఆదేశించినప్పటికీ, క్షమాపణ చెప్పడానికి నటుడు నిరాకరించారు. "థగ్ లైఫ్" జూన్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలైనప్పటికీ, వివాదం కారణంగా కర్ణాటకలో ప్రదర్శించబడలేదు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ, కర్ణాటకలో నిషేధం కమల్ హాసన్ రాష్ట్రంలో విలువైన ప్రారంభ ఆదాయాన్ని కోల్పోయింది.
ప్రముఖ కిడ్నాప్ కేసులో మంగళవారం తమిళనాడు ప్రభుత్వం అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) హెచ్ఎమ్ జయరామ్ను సస్పెండ్ చేసింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు తిరువళ్లూరు జిల్లా పోలీసులు ఆయనను అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత ఆయనను తమిళనాడు ప్రభుత్వం సస్పెండ్ చేసింది.ఒక జంటను బలవంతంగా విడదీసే ముఠాకు తన అధికారిక వాహనాన్ని అందించారని ఆరోపిస్తూ మైనర్ బాలుడి అపహరణకు దోహదపడ్డారనే ఆరోపణలపై సీనియర్ ఐపీఎస్ అధికారిపై ఆరోపణలు ఉన్నాయి.
గత వారం ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన 274 మందిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎంఎస్సీ పూర్తి చేసిన 23 ఏళ్ల క్రికెటర్ దిర్ధ్ పటేల్ కూడా ఉన్నాడు. గత వారం ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన 274 మందిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎంఎస్సీ పూర్తి చేసిన 23 ఏళ్ల క్రికెటర్ దిర్ధ్ పటేల్ కూడా ఉన్నాడు. బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 విమానాల సముదాయానికి చెందిన AI 171 గురువారం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్ది సెకన్లకే కూలిపోయింది. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో విమానం టేకాఫ్ అయిన వెంటనే ఎత్తును కోల్పోయిందని అధికారులు తెలిపారు.
వాట్సాప్ మెసేజింగ్ సర్వీస్ను బిలియన్ల మంది వ్యక్తులను ఉపయోగించడం ద్వారా కొత్త ఆదాయ మార్గాన్ని పెంపొందించుకోవడానికి మెటా చర్యలు తీసుకుంటుంది. ఇకపై వాట్సాప్లో యాడ్స్ రానున్నాయి. అంతే వాట్సాప్ యాప్లోని కొన్ని భాగాలలో వినియోగదారులు యాడ్స్ చూడటం ప్రారంభిస్తారని వాట్సాప్ తెలిపింది.యాప్ అప్డేట్ల ట్యాబ్లో మాత్రమే ప్రకటనలు చూపబడతాయి. దీనిని ప్రతిరోజూ 1.5 బిలియన్ల మంది ఉపయోగిస్తున్నారు. అయితే, వ్యక్తిగత చాట్లు ఉన్న చోట అవి కనిపించవని డెవలపర్లు తెలిపారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ప్రకటించిన తర్వాత, ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయినందుకు నిరాశకు గురైన 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నస్పూర్ మండల కేంద్రంలోని జయశంకర్ కాలనీకి చెందిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అక్షయ, తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరుమలను సందర్శించాలనుకునే భక్తుల కోసం ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. సెప్టెంబర్ నెలకు తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్ల విడుదల తేదీలు, గదుల కేటాయింపులను టీటీడీ వివరించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోసం సెప్టెంబర్ కోటా జూన్ 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచబడుతుంది.
ఐపీఎల్ సీజన్లో వైజాగ్ రెండు మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది ప్రధానంగా నారా లోకేష్, ఐసీసీ అధ్యక్షుడు జై షా మధ్య ఉన్న అవగాహన, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీని కలిగి ఉన్న జీఎంఆర్ గ్రూప్తో సన్నిహిత చర్చలు కారణంగా జరిగింది. వారు వైజాగ్లో రెండు మ్యాచ్లు ఆడటానికి సిద్ధంగా ఉన్నారు.ఐపీఎల్ తర్వాత, ఇప్పుడు క్రికెట్ ప్రపంచ కప్ వైజాగ్కు వచ్చే వంతు వచ్చింది. నారా లోకేష్ కూడా అదే విషయాన్ని ధృవీకరించారు. రాబోయే మహిళా క్రికెట్ ప్రపంచ కప్ 2025 సీజన్లో వైజాగ్ ఐదు మ్యాచ్లను నిర్వహిస్తుందని ఆయన ధృవీకరించారు.
ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ గద్దర్ అవార్డులో కొందరు హాజరైనా పూర్తిస్థాయిలో ప్రముఖ హీరోలు హాజరుకాలేకపోయారు. అందుకు కారకులెరు? తప్పిదం ఎవరిది? దిల్ రాజు అట్టర్ ప్లాప్… స్టార్లను రప్పించడంలో ఘోర వైఫల్యం అంటూ ఫిలింనగర్ లో కథనాలు, సోషల్ మీడియాలో కూడా తెలంగాణ సినిమా కార్మికులు విమర్శిస్తున్నారు. అందుకు తగినట్లే దిల్ రాజు మాట్లాడుతూ, అవార్డ్ సక్సెస్ చేశాం. కానీ కొంత లోపం జరిగిందంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు.
పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) సిబిన్ సి సోమవారం లూథియానా (పశ్చిమ) అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. ఇందులో 84,825 మంది మహిళలు, 10 మంది థర్డ్-జెండర్ ఓటర్లు ఉన్నారు. జూన్ 19న తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.66 ప్రదేశాలలో మొత్తం 194 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయబడతాయి. వీటిలో 10 మోడల్ పోలింగ్ బూత్లు, ఒక పూర్తి మహిళా, ఒక పర్యావరణ అనుకూలమైన, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ) సిబ్బంది నిర్వహించే ఒక బూత్ ఉన్నాయి. అదనంగా, 13 బూత్లను కీలకమైనవిగా ప్రకటించారు.