Shorts

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. తమపై జరుగుతున్న దాడులకు ప్రతీకారం తీర్చుకునే దిశగా ఇరాన్ అమెరికా మిత్రదేశాల్లోని చమురు నిక్షేపాలు, ప్లాంట్లపై మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు చేస్తోంది. దీనికితోడు చమురు రవాణాకు ప్రధాన జలమార్గమైన హర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు రవాణాకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా అనేక దేశాల్లో పెట్రోలియం, డీజిల్ కొరత ఉత్పన్నమైంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ నిండుకుంది. దీంతో నగరంలోని అనేక పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి.

మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదంశుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. సోమవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ. వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. వ్యతిరేకులతో జాగ్రత్త, ఆచితూచి అడుగేయండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. దాంపత్యసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. పత్రాల రెన్యువల్‌లో జాగ్రత్త వహించండి. వస్త్ర, బంగారం వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. అనుకున్నట్లే మొక్కుబడులు తీర్చుకుంటారు.

ప్రస్తుతం యుద్ధం సరిహద్దులను దాటిందని అందువల్ల ప్రజలు దేశ రక్షణ కోసం సన్నద్ధంగా ఉండాలని కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సైనిక పాఠశాల ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి రోజుల్లో యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో జరిగే ఘర్షణ మాత్రమే కాదన్నారు. ప్రస్తుతం యుద్ధం సరిహద్దులను దాటిందని.. ఆర్థిక, డిజిటల్, ఇంధన, ఆహార భద్రతలు కూడా జాతీయ భద్రతలో భాగమయ్యాయన్నారు. వాటి ద్వారా ఒక దేశం మరో దేశాన్ని బలహీనపరిచే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి ప్రతి పౌరుడు అన్ని వేళలా దేశ రక్షణ కోసం సన్నద్ధమై ఉండాలని పిలుపునిచ్చారు.

గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, పరిశోధన ఆధారిత గ్లోబల్ ఔషధ సంస్థ, ఈ రోజు భారతదేశంలో టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ (T2DM) నిర్వహణ కోసం GLIPIQ(సెమాగ్లూటైడ్)ను ప్రారంభించినట్లు ప్రకటించింది, ఇది GLP-1 థెరపీకి అందుబాటులో ఉండే ధరలో కొత్త ప్రమాణాన్ని స్థాపిస్తూ, రోగులకు ఆధునిక డయాబెటిస్ చికిత్సకు ప్రాప్తిని విస్తరిస్తుంది.చాలామంది రోగుల కోసం, అధునాతన ఇంజెక్టబుల్ థెరపీని ప్రారంభించే నిర్ణయం ఖర్చు, సంక్లిష్టత కారణంగా తరచుగా ఆలస్యమవుతుంది. ధరలో గణనీయమైన మెరుగుదల ద్వారా, GLIPIQ GLP-1 థెరపీకి ప్రాప్తిని విస్తరించి, విస్తృత రోగి వర్గంలో ముందుగానే చికిత్స ప్రారంభించడానికి సహాయపడుతుంది.

తెలుగు సినిమా వేదిక ప్రతీ ఏడాది నిర్వహించే ఉగాది నంది పురస్కారాలు ఉగాది మరుసటి రోజు మార్చ్ 20న హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. హర్యానా మాజీ గవర్నర్, బి జే పి నేత బండారు దత్తాత్రేయ, ఉప సభాపతి రామచంద్రులు నాయక్ ,సీనియర్ నటులు మురళి మోహన్ , నటుడు పృద్వీరాజ్, హీరో ఆదిత్య ఓం, ప్రముఖ దర్శకులు ఎస్ వి కృష్ణా రెడ్డి , దర్శకుల సంఘం అధ్యక్షులు వి ఎన్ ఆదిత్య, తెలుగు సినిమా నిర్మాతల మండలి అధ్యక్షులు దామోదర్ ప్రసాద్, నిర్మాతలు కే .అచ్చిరెడ్డి, విజయ్ కుమార్ వర్మ, నటుడు రాంకీ , పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ , భద్రాచలం ఎమ్ ఎల్ ఏ తెల్లం వెంకట్రావు, ఫిట్నెస్ గురు అనుప్రసాద్ లు హాజరైన ఈ వేడుకలో ఇటీవల గద్దర్ అవార్డు పొందిన 23 ఇరవైమూడు చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా ఉగాది నంది పురస్కారంతో సత్కరించారు.

రక్తపోటు, రక్తంలో చక్కెరను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఎండుద్రాక్ష సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఎండుద్రాక్షలోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, ఇది గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. కిస్మిస్ పండ్లతో కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.ఎండుద్రాక్ష తింటుంటే రక్తపోటు, మధుమేహం అదుపులో వుంటాయి.ఎండుద్రాక్షలో వున్న పీచు పదార్థం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.గుండె ఆరోగ్యానికి మేలు చేయడంలో కిస్మిస్ అద్భుతంగా పనిచేస్తుంది.క్యాల్షియం అధికంగా వుండే కిస్మిస్‌లను పాలలో కలుపుకుని తింటే ఎముక పుష్టి కలుగుతుంది.ఎండుద్రాక్ష తినేవారి చర్మం ముడతలు పడకుండా కాంతివంతంగా వుంటుంది.రాత్రిపూట పది ఎండు ద్రాక్షలను నానబెట్టి ఉదయాన్నే వాటిని పరగడుపున తింటే రక్తహీనత తగ్గుతుంది.

ఇటీవలి కాలంలో ఇష్టం లేని పెళ్లిళ్లు పలుచోట్ల జరుగుతున్న ఘటలు వెలుగుచూస్తున్నాయి. యువతీయువకులు వారివారి తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు తమకు ఇష్టం లేకపోయినప్పటికీ వివాహాలు చేసుకుంటున్నారు. ఇలాంటి వివాహాలు చేసుకున్న జంటల్లో కొంతమంది రాజీపడి బ్రతుకుతుంటే మరికొందరు పెళ్లికి ముందే పెటాకులు చేసుకుంటున్నారు. ఇంకొందరు ఏకంగా పెళ్లి వేదిక మీదనే తమ అయిష్టాన్ని బహిరంగంగా తెలుపుతున్నారు. ఇలాంటి ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.పెళ్లయ్యాక వధూవరులు ఒకరి నోట్లో ఇంకొకరు రసగుల్లా పెట్టుకుని రుచి చూడాల్సి వుంది. ఈ క్రమంలో తొలుత పెళ్లి కుమార్తె తన చేతితో రసగుల్లను వరుడి నోట్లో పెట్టింది.