హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో సింగర్, నటి దియా అందించిన ‘అరెరే.. అరెరే..’ (Arere.. Arere..) మ్యూజిక్ వీడియో ఆల్బమ్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. బటర్ఫ్లై మ్యూజిక్ బ్యానర్పై రూపొందిన ఈ మ్యూజిక్ వీడియో విడుదల వేడుకకు సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
రాక్స్టార్ అనిరుధ్ XV – 15 ఇయర్స్ విత్ యు.. టూర్లోని తొలి అంచెలో భాగంగా రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ లైవ్ ప్రదర్శన ఇవ్వడంతో హైదరాబాద్ ఒక మరపురాని రాత్రికి సాక్ష్యంగా నిలిచింది. గత రాత్రి గచ్చిబౌలి అవుట్డోర్ స్టేడియం అభిమానులతో నిండిపోయి, ఉత్సాహభరితమైన, శక్తివంతమైన వాతావరణాన్ని సృష్టించింది.
అకాడమీ అవార్డు తో సంగీత దర్శకుడిగా ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడుతున్న ఎ.ఆర్. రెహ్మాన్ భారతీయ సంగీతాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. ఇది భారతదేశంలో సంగీత సంస్కృతిని అభివృద్ధి చేయాలనే యమహా మ్యూజిక్ ఇండియా సంకల్పానికి అనుగుణంగా ఉంది. ఈ భాగస్వామ్యం యమహా మ్యూజిక్ ఇండియా యొక్క దీర్ఘకాలిక కట్టుబాటుకు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది.
కథానాయకుడు శర్వా, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్పై రూపొందిన రేసింగ్ డ్రామా 'బైకర్'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా రూపొందుతున్న బైకర్ ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX వంటి ప్రీమియం ఫార్మాట్లలో ఈ చిత్రాన్ని ఘనంగా విడుదల కానుంది. దీంతో ఈ యాక్షన్-ప్యాక్డ్ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ప్స్లు, పాటలు, ఇతర ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ను సృష్టించాయు. గత రాత్రి మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ను లాంచ్ చేశారు.
రాష్ట్రంలోనే అతిపెద్దదైన అనంతపురం బత్తాయి మార్కెట్లో ధరలు భారీగా పడిపోయాయి. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణల కారణంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతుల్లో అంతరాయం ఏర్పడటంతో, రైతులు తమ పంటకు కనీస మద్దతు ధరను కూడా పొందలేకపోతున్నారు. ఎగుమతులు దెబ్బతినడంతో, వ్యాపారులు పూర్తిగా స్థానిక మార్కెట్లపైనే ఆధారపడాల్సి వచ్చింది. అంతేకాకుండా, రాయలసీమ ప్రాంతానికి చెందిన బత్తాయి రైతులు ఉత్తరాది మార్కెట్లలో మహారాష్ట్ర నుండి వచ్చే పండ్లతో పోటీపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం, చిరుజల్లులు కురిసి, పెరుగుతున్న వేసవి తాపం నుండి తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించాయి. నగర ఉత్తర భాగాల్లోని కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, హకీంపేట, మల్కాజిగిరి, సికింద్రాబాద్తో సహా పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు నమోదయ్యాయి. రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంది. హైదరాబాద్తో సహా రాష్ట్రవ్యాప్తంగా రాబోయే రెండు రోజుల పాటు, ముఖ్యంగా సోమవారం, మంగళవారం నాడు పొడి వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇరాన్తో ప్రపంచానికి ముప్పు పొంచివుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెజిమిన్ నెతన్యాహు ఆరోపించారు. ఐరోపాలోనికి చొచ్చుకుపోయే సామర్థ్యం ఇరాన్కు ఉందని, ప్రపంచాన్ని ఆ దేశం ప్రమాదంలో పడేస్తోందనడానికి ఇదే సాక్ష్యమన్నారు. ఇజ్రాయెల్లోని అరాద్ నగరంలో ఇరాన్ క్షిపణి దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో అన్ని దేశాల తరపున అమెరికా, ఇజ్రాయెల్లు కలిసి పోరాడుతున్నాయన్నారు.
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదంఅన్ని విధాలా కలిసివచ్చే సమయం. కార్యం సిద్ధిస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. ఆత్మీయులతో సంభాషిస్తారు. కొత్తపరిచయాలేర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. మితంగా సంభాషించండి. సంతానం దూకుడు అదుపు చేయండి.
పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చమురు, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో భారత్తో సహా అనేక దేశాల్లో ఇంధన, ఎల్పీజీ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత్కు పాక్షికంగా ఉపశమనం కల్పించేందుకు వీలుగా అమెరికా, రష్యా దేశాలకు చెందిన నౌకలు భారత్కు మళ్లించారు. ఇందులోభాగంగా, అమెరికాలోని టెక్సాస్ నుంచి బయలుదేరిన ఫయనీర్ నౌక కర్నాటక రాష్ట్రంలోని మంగళూరు పోర్టుకు సురక్షితంగా చేరుకుంది. ఇది భారత్లో కొంతమేరకు ఎల్పీజీ సరఫరాకు ఊరట ఇవ్వనుంది.
ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రకటించారు. తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనని ఆయన జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలకు లేఖ రాశారు. అందులే ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు అందులో పేర్కొన్నారు.
పశ్చిమాసియాలో కొనసాగుతోన్న ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ రాయబారి అబ్దుల్ బాసిత్ భారత్ను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ అణు కార్యక్రమం లక్ష్యంగా అమెరికా దాడులు చేస్తే.. భారత్లోని దిల్లీ, ముంబై వంటి నగరాలపై బాంబులు వేస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరికొత్త రికార్డును నెలకొల్పారు. సుధీర్ఘకాలం ప్రభుత్వాధినేతగా నరేంద్ర మోడీ ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవీ కాలాలను కలుపుకుంటే ఆయన అత్యధిక కాలం అంటే 8,931 రోజుల పాటు ప్రభుత్వ అధినేతగా పని చేసిన వ్యక్తిగా నిలిచారు. దీంతో ఇప్పటివరకు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న ఈ రికార్డును ప్రధాని మోడీ అధిగమించారు. చామ్లింగ్ సిక్కిం ప్రభుత్వ అధిపతి (ముఖ్యమంత్రి)గా 8,930 రోజులు పనిచేశారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమైపోయారు. దీంతో ఆయనను బుజ్జగించేందుకు మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్లు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం లేకుండా పోయింది. దీంతో జీవన్ రెడ్డి పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 25వ తేదీన ఆయన బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
జిల్లా కేంద్రమైన గుంటూరు నగర నడిబొడ్డున స్టూడియోస్ 81 అనే పేరుతో సినిమా థియేటర్లు ప్రారంభమయ్యాయి. 4 కే లేజర్ ప్రొటెక్షన్, యాక్సిడెంట్ యాక్స సి సిల్వర్ స్క్రీన్లతో అధునాతమైన హంగులతో గుంటూరు నడిబొడ్డున ఉగాది పండుగ సందర్భంగా స్టూడియో 81 నూతన థియేటర్ ప్రారంభమైంది.
తండ్రీకూతుళ్లైన అర్జున్ సర్జా, ఐశ్వర్య అర్జున్ల అద్భుతమైన కలయికతో రూపొందిన 'సీతా పయనం' చిత్రం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో ఈ చిత్రం, పండుగ సీజన్కు సరిగ్గా సరిపోయే భావోద్వేగభరితమైన, ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించే చిత్రం ‘సీతా పయనం’.
పంజాబ్ రాష్ట్రంలో ఓ ప్రభుత్వ అధికారి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆ రాష్ట్ర మంత్రిపై కేసు నమోదైంది.. తన ఆత్మహత్యకు మంత్రి లాల్షిత్ సింగ్ భుల్లర్ కారణమంటూ ఆ ప్రభుత్వ ఆధికారి ఓ వీడియో రికార్డు చేసి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ జోక్యం చేసుకుని మంత్రితో రాజీనామా చేయించారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే భల్లర్తో పాటు ఆయన తండ్రిపైనా కేసు నమోదు చేశారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కన్నతల్లిపై జరిగిన లైంగిక దాడిని జీర్ణించుకోలేని 17 యేళ్ల మైనర్ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణం రాష్ట్రంలోని దేవాస్ జిల్లా ఉదయ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భికుపురా గ్రామంలో జరిగింది. అయితే, ఈ దారుణంపై పోలీసులు సైతం సకాలంలో స్పందించలేదు. దీంతో పోలీసుల నిర్లక్ష్యాన్ని ఆరోపిస్తూ గ్రామస్తులంతా ఆందోళనకు దిగారు.
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. తమపై జరుగుతున్న దాడులకు ప్రతీకారం తీర్చుకునే దిశగా ఇరాన్ అమెరికా మిత్రదేశాల్లోని చమురు నిక్షేపాలు, ప్లాంట్లపై మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు చేస్తోంది. దీనికితోడు చమురు రవాణాకు ప్రధాన జలమార్గమైన హర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు రవాణాకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా అనేక దేశాల్లో పెట్రోలియం, డీజిల్ కొరత ఉత్పన్నమైంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ నిండుకుంది. దీంతో నగరంలోని అనేక పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి.
ఐపీఎల్ 2026 సీజన్ త్వరలో ప్రారంభంకానుంది. ఈ సీజన్ ప్రారంభానికి ముందు భారత స్టార్ క్రికెటర్, సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 42 బంతుల్లో 94 రన్స్ చేసి విధ్వంసం సృష్టించాడు. శనివారం జరిగిన ఫ్రాంచేజీ అంతర్గత ప్రాక్టీస్ మ్యాచ్లో యువ ఓపెనర్ రెచ్చిపోయి, ప్రత్యర్థి జట్లకు హెచ్చరిక పంపాడు.
భారత మాజీ క్రికెటర్, మాజీ కోచ్ సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్ జెండర్ సర్జరీ చేయించుకున్నారు. ఈ విషయంలో కుమార్తెకు తండ్రి అండగా నిలబడ్డారు. దీంతో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ జెండర్ సర్జరీ థాయ్లాండ్లో జరిగింది. జెండర్ ఆఫర్మింగ్ పేరుతో ఈ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం అనయ బంగర్ క్రికెటర్, ట్రాన్స్ హక్కుల కార్యకర్తగా దేశంలో మంచి గుర్తింపు పొందిన విషయం తెల్సిందే.
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇటీవల కవల సోదరీమణులను వివాహం చేసుకుని వార్తల్లో నిలిచిన కవల సోదరుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. వివాహమై నెల రోజులు గడవక ముందే ఈ విషాదం జరగడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇజ్రాయెల్లోని కీలకమైన డిమోనా అణు కేంద్రమే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో బీకర దాడి చేసింది. తమపై గతంలో జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్య చేపట్టినట్టు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడులు ధాటికి డిమోనా, ఆరాద్ పట్టణాల్లో వంద మదికిపైగా ప్రజలు గాయపడినట్టు సమాచారం.
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ ఈ రోజు ఒబెడా బ్రాండ్ పేరిట తమ ఇంజెక్టబుల్ సెమాగ్లుటైడ్ను విడుదల చేసినట్లు వెల్లడించింది. భారతదేశంలో టైప్ 2 మధుమేహ నిర్వహణ కోసం, అధునాతన జిఎల్ పి -1 రిసెప్టర్ అగోనిస్ట్ ఆధారిత చికిత్స లభ్యతను విస్తరించడంలో ఇది ఒక కీలకమైన ముందడుగును సూచిస్తుంది. జెనరిక్ సెమాగ్లుటైడ్ కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డిజిసిఐ) ఆమోదం పొందిన మొట్టమొదటి భారతీయ కంపెనీ డాక్టర్ రెడ్డీస్.
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదంఅనుకూలతలు నెలకొంటాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ప్రకటనలు, ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు.వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలుకార్యసాధనకు నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఓర్పుతో యత్నాలు కొనసాగించండి. స్థిరాస్తి ధనం అందుతుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. దూరపు బంధువులను కలుసుకుంటారు.
ఇరాన్ గత నాలుగైదు రోజులుగా చూపిస్తున్న శక్తిని చూసి డొనాల్డ్ ట్రంపుతో పాటు నాటో దేశాలు కూడా ఉలిక్కిపడే పరిస్థితి తలెత్తింది. ఇరాన్ దేశం హిందూ మహాసముద్రంలో వున్న డియెగో గార్సియాపై రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అది హిందూ మహాసముద్రంలో చాలా చిన్న బ్రిటిష్-అమెరికన్ ప్రాంతం. చాలామంది దానిని ప్రపంచ పటంలో కూడా గుర్తించలేరు. సరిగ్గా అందుకే దీనికి అంత ప్రాముఖ్యత ఉంది.ఈ ప్రాంతం ఇరాన్ దేశానికి సుమారుగా 4,000 కిలోమీటర్లు. దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే, టెహ్రాన్ నుండి 4,000 కిలోమీటర్ల దూరంలో రోమ్, ఏథెన్స్, కైరో నగరాలు కూడా ఉన్నాయి.
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదంశుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. సోమవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ. వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. వ్యతిరేకులతో జాగ్రత్త, ఆచితూచి అడుగేయండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. దాంపత్యసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. పత్రాల రెన్యువల్లో జాగ్రత్త వహించండి. వస్త్ర, బంగారం వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. అనుకున్నట్లే మొక్కుబడులు తీర్చుకుంటారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోని నారాయణవనం వేదవల్లి తాయార్ సమేత వేద నారాయణ దేవాలయం ఉంది. కృత యుగంలో మహా విష్ణువు, మొదటి అవతారమైన మత్స్య అవతారంలో ఈ స్వామి దర్శనమిస్తారు. కృత యుగంలో మహావిష్ణువు మత్స్య అవతారం ద్వారా సోమకుడనే రాక్షసుడిని వధించి.. వేదాలు, సప్త రుషులను కాపాడినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఇంకా మత్స్య అవతారంలో సముద్రపు నీటిలోనే ఆయన యుద్ధం చేశాడని, ఆ సమయంలో తడిగా వున్న మహావిష్ణువు శరీరంపై సూర్యకిరణాలు ప్రసరింపజేసి.. ఆయనను పూజించినట్లు స్థల పురాణాలు చెప్తున్నాయి.
ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త, ఓ మాజీ డీజీపీ మనవరాలు దివ్యారెడ్డికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.1.20 కోట్లు టోకరా వేశారు. దివ్యారెడ్డి ఏకంగా 18 కంపెనీలకు డైరెక్టర్గా ఉన్నారు. సైబర్ నేరగాళ్లు ఆమెతో పాటు అకౌంటెంట్ను మోసం చేశారు. ఈ నెల 13న దివ్యారెడ్డి పేరు, ఫొటోతో ఉన్న వాట్సప్ ఖాతా నుంచి అకౌంటెంట్కు మెసేజ్ వచ్చింది. తాను మీటింగ్లో ఉన్నానని, తానుప్పిన ఖాతాకు రూ.1.20 కోట్లు పంపాలని అందులో ఉంది. దీంతో అకౌంటెంట్ ఆ డబ్బును పంపారు.
దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారని బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ అన్నారు. హాలీవుడ్లో ప్రముఖ నటుల కంటే దర్శకులకే ఎక్కువ పేరు, గౌరవం ఉంటాయని, కానీ బాలీవుడ్లో పరిస్థితి దానికి పూర్తిగా భిన్నంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తన భార్య ఎప్పుడూ వంట చేయదని ఆరోపిస్తూ భర్త విడాకుల కోసం దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు అతనికి షాక్ ఇచ్చింది. మారుతున్న సామాజిక కట్టుబాట్లు, అంచనాలతో విడాకుల భావన చాలా సాధారణమైపోయింది. స్త్రీపురుషులు, పురుషులు ఇద్దరూ అత్యంత అల్పమైన కారణాలకే విడాకులు కోరుతున్నారు. ఈ ప్రత్యేక కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. మీరు పనిమనిషిని పెళ్లి చేసుకోలేదు. ఆమెతో పనులు పంచుకోండి. కాలం మారింది. భర్తలు వంట, బట్టలు ఉతకడం, శుభ్రం చేయడం వంటి పనులను భార్యతో పంచుకోవాలని కోర్టు పేర్కొంది.
తిరుమల పవిత్రతకు భంగం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. శనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో బోర్డు సభ్యులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. "తిమ్మరాజుపల్లి టీవీ" చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ లో "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా గ్రాండ్ రివీల్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రస్తుతం యుద్ధం సరిహద్దులను దాటిందని అందువల్ల ప్రజలు దేశ రక్షణ కోసం సన్నద్ధంగా ఉండాలని కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సైనిక పాఠశాల ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి రోజుల్లో యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో జరిగే ఘర్షణ మాత్రమే కాదన్నారు. ప్రస్తుతం యుద్ధం సరిహద్దులను దాటిందని.. ఆర్థిక, డిజిటల్, ఇంధన, ఆహార భద్రతలు కూడా జాతీయ భద్రతలో భాగమయ్యాయన్నారు. వాటి ద్వారా ఒక దేశం మరో దేశాన్ని బలహీనపరిచే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి ప్రతి పౌరుడు అన్ని వేళలా దేశ రక్షణ కోసం సన్నద్ధమై ఉండాలని పిలుపునిచ్చారు.
తెలంగాణా ప్రభుత్వం తలపెట్టిన గద్దర్ అవార్డ్ లు 2025లో అవార్డు వచ్చిన వారికి సన్మానించడం వరకు బాగానే వుంది. కానీ ఆహ్వానితులుగా వచ్చినవారికి సరైన కుర్చీలు కూడా కొందరికీ లేవని వారు కినుక వహించినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో గద్దర్ అవార్డులు వేడుకలో సినీరంగానికి చెందిన ప్రముఖులు రాలేదనీ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి ఘాటుగానే స్పందించారు. అయితే ఈసారి వేడుకలలో ఆయన మచ్చుకైనా కానరాలేదు. అందుకు కారణం ఆయన సినిమా రంగంపైన చులకన భావంతో గతంలో మాట్లాడిన మాటలు కారణమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
రణవీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కలయికలో వచ్చిన ధురంధర్ విజయాన్ని సాధించడంతో సీక్వెల్ కూడా ధురంధర్ 2 గా విడుదలైంది. ఈ చిత్రం విడుదల తర్వాత బాలీవుడ్ లో సినిమా గతినే మార్చేసింది. తెలుగులోని టాప్ కథానాయకులు ఆ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. కానీ, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ వారిని సున్నితంగా విమర్శిస్తూ కామెంట్ చేశారు. సౌత్ వాళ్ళు పనిగట్టుకుని బాలీవుడ్ సినిమాను మోస్తుంటే ఒక్కసారైన వాళ్ళు మన సౌత్ సినిమాను మెచ్చుకున్నారా? అంటూ జస్ట్ పర్ ఆస్కింగ్ అంటూ తనదైన శైలిలో స్పందించారు.
కరీంనగర్ టూటౌన్ ఎస్సై చంద్రశేఖర్ గారు తన భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడిన విషయంపై గత 5 రోజులుగా తీవ్ర మనస్థాపం చెందారనీ, అందువల్లనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన సోదరుడు తమకు ఫిర్యాదు చేసినట్లు హుజారాబాద్ డిఎస్పీ మాధవి తెలియజేసారు. ఎస్సై ఆత్మహత్యకు ఇతర కారణాలు వున్నట్లు తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఆమె చెప్పారు.కాగా ఐదు రోజుల క్రితం... మంగళవారం నాడు ఎస్సై చంద్రశేఖర్ భార్య దివ్య గన్నేరు చెట్టు కాయలు కోసుకుని అందులో పప్పును తీసి మెత్తగా దంచి తినేసింది. అవి విషపూరితమైనవి కావడంతో అపస్మారకంలోకి వెళ్లిపోయింది. దీనితో ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు.
డాక్టర్ రాజేంద్రప్రసాద్, పథ్వీరాజ్, కేదార్ శంకర్, మణి చందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు మహేష్ చంద్ర రూపొందించిన చిత్రం ‘పిఠాపురంలో’. దీనికి ఉప శీర్షిక ‘అలా మొదలైంది’. మహేష్ చంద్ర సినిమా టీం బ్యానర్పై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈవెంట్కి ‘ప్రేయసి రావే’ టీం హీరో శ్రీకాంత్, పృథ్వీ, శివాజీ రాజా, ఎంఎం శ్రీలేఖ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
మధ్యాహ్న భోజన పథకంపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వ్యాఖ్యలు అంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. దీనిపై విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. నిరుపేదలకు ప్రయోజనాలు అందిస్తే, వారు "శోభనం పెళ్లికొడుకులు" అవుతారని ఆయన అన్నారు. ప్రభుత్వాలు భోజనం అందించాల్సిన అవసరం లేదని గరికపాటి అన్నారు.
గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, పరిశోధన ఆధారిత గ్లోబల్ ఔషధ సంస్థ, ఈ రోజు భారతదేశంలో టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ (T2DM) నిర్వహణ కోసం GLIPIQ(సెమాగ్లూటైడ్)ను ప్రారంభించినట్లు ప్రకటించింది, ఇది GLP-1 థెరపీకి అందుబాటులో ఉండే ధరలో కొత్త ప్రమాణాన్ని స్థాపిస్తూ, రోగులకు ఆధునిక డయాబెటిస్ చికిత్సకు ప్రాప్తిని విస్తరిస్తుంది.చాలామంది రోగుల కోసం, అధునాతన ఇంజెక్టబుల్ థెరపీని ప్రారంభించే నిర్ణయం ఖర్చు, సంక్లిష్టత కారణంగా తరచుగా ఆలస్యమవుతుంది. ధరలో గణనీయమైన మెరుగుదల ద్వారా, GLIPIQ GLP-1 థెరపీకి ప్రాప్తిని విస్తరించి, విస్తృత రోగి వర్గంలో ముందుగానే చికిత్స ప్రారంభించడానికి సహాయపడుతుంది.
అహ్మదాబాద్: ఆవిష్కరణల ఆధారిత గ్లోబల్ లైఫ్సైన్సెస్ కంపెనీ అయిన జైడస్ లైఫ్సైన్సెస్ లిమిటెడ్, భారతదేశంలో పేటెంట్ గడువు ముగిసిన తర్వాత సెమాగ్లిన్ టీఎం, మషెమా టీఎం మరియు ఆల్టర్మీ టీఎం బ్రాండ్ పేర్లతో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ను విడుదల చేసింది. భారత ఔషధ నియంత్రణ జనరల్ (డీసీజీఐ) గతంలోనే టైప్ 2 మధుమేహం, ఊబకాయం రెండింటి చికిత్స కోసం సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ను ఉత్పత్తి చేయడానికి, విక్రయించడానికి ఆమోదం తెలిపింది.
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 19వ తేదీన విడుదలైన 'ధురంధర్-2' చిత్రంపై ఆయన ప్రసంసల వర్షం కురిపించారు. ఈ చిత్రాన్ని ఒక బెంచ్ మార్క్గా పెట్టుకుని దర్శకులు తమ చిత్రాలను తీయాలని లేకపోతే, 'ధురంధర్' దావాగ్నిలో కాలిపోతారంటూ శాపనార్థాలు పెట్టారు. పైగా 'ధురంధర్-2' అనేది భారతీయ సినిమాకు ఓ రీసెట్ బటన్ వంటిదని పేర్కొన్నారు. 2026 మార్చి 19వ తేదీకి ముందు తీసిన సినిమాలన్నింటినీ మేకర్స్ మర్చిపోలేకపోతే అవివేకం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలుగు సినిమా వేదిక ప్రతీ ఏడాది నిర్వహించే ఉగాది నంది పురస్కారాలు ఉగాది మరుసటి రోజు మార్చ్ 20న హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. హర్యానా మాజీ గవర్నర్, బి జే పి నేత బండారు దత్తాత్రేయ, ఉప సభాపతి రామచంద్రులు నాయక్ ,సీనియర్ నటులు మురళి మోహన్ , నటుడు పృద్వీరాజ్, హీరో ఆదిత్య ఓం, ప్రముఖ దర్శకులు ఎస్ వి కృష్ణా రెడ్డి , దర్శకుల సంఘం అధ్యక్షులు వి ఎన్ ఆదిత్య, తెలుగు సినిమా నిర్మాతల మండలి అధ్యక్షులు దామోదర్ ప్రసాద్, నిర్మాతలు కే .అచ్చిరెడ్డి, విజయ్ కుమార్ వర్మ, నటుడు రాంకీ , పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ , భద్రాచలం ఎమ్ ఎల్ ఏ తెల్లం వెంకట్రావు, ఫిట్నెస్ గురు అనుప్రసాద్ లు హాజరైన ఈ వేడుకలో ఇటీవల గద్దర్ అవార్డు పొందిన 23 ఇరవైమూడు చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా ఉగాది నంది పురస్కారంతో సత్కరించారు.
తెలుగు తెరపై సరికొత్త కాన్సెప్ట్తో రూపొందిన ఎమోషనల్ రివెంజ్ డ్రామా ‘డైమండ్ డెకాయిట్’. పార్ధ గోపాల్ నిర్మాణంలో, దర్శకుడు సూర్య జి యాదవ్ దర్శకత్వంలో, పార్ధ గోపాల్ - మేఘన జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ప్రముఖ మ్యూజిక్ సంస్థ మధుర ఆడియో ద్వారా ఈ పాటలను ముఖ్య అతిథిగా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య పాల్గొని విడుదల చేశారు.
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ధురంధర్ - ది రివెంజ్'. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించారు. ఈ నెల 19వ తేదీన విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కనకవర్షం కురిపిస్తోంది. పెయిడ్ ప్రీమియర్స్తో కలిపి ఈ చిత్రం ఇప్పటివరకు అంటే విడుదలైన రెండు రోజుల్లోనే రూ.330 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్టు సినీ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
రక్తపోటు, రక్తంలో చక్కెరను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఎండుద్రాక్ష సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఎండుద్రాక్షలోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, ఇది గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. కిస్మిస్ పండ్లతో కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.ఎండుద్రాక్ష తింటుంటే రక్తపోటు, మధుమేహం అదుపులో వుంటాయి.ఎండుద్రాక్షలో వున్న పీచు పదార్థం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.గుండె ఆరోగ్యానికి మేలు చేయడంలో కిస్మిస్ అద్భుతంగా పనిచేస్తుంది.క్యాల్షియం అధికంగా వుండే కిస్మిస్లను పాలలో కలుపుకుని తింటే ఎముక పుష్టి కలుగుతుంది.ఎండుద్రాక్ష తినేవారి చర్మం ముడతలు పడకుండా కాంతివంతంగా వుంటుంది.రాత్రిపూట పది ఎండు ద్రాక్షలను నానబెట్టి ఉదయాన్నే వాటిని పరగడుపున తింటే రక్తహీనత తగ్గుతుంది.
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఓ ఘటన జరిగింది. బాణాసంచా లోడుతో వెళుతున్న లారీకి విద్యుత్ తీగలు తగలడంతో దగ్ధమైపోయింది. ఈ ఘటన జిల్లాలోని కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ శివారులో చోటుచేసుకుంది. లారీకి విద్యుత్ తీగలు తగలడంతోనే ఒక్కసారిగా భారీ శబ్దాలు వచ్చాయి. దీంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
ఇటీవలి కాలంలో ఇష్టం లేని పెళ్లిళ్లు పలుచోట్ల జరుగుతున్న ఘటలు వెలుగుచూస్తున్నాయి. యువతీయువకులు వారివారి తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు తమకు ఇష్టం లేకపోయినప్పటికీ వివాహాలు చేసుకుంటున్నారు. ఇలాంటి వివాహాలు చేసుకున్న జంటల్లో కొంతమంది రాజీపడి బ్రతుకుతుంటే మరికొందరు పెళ్లికి ముందే పెటాకులు చేసుకుంటున్నారు. ఇంకొందరు ఏకంగా పెళ్లి వేదిక మీదనే తమ అయిష్టాన్ని బహిరంగంగా తెలుపుతున్నారు. ఇలాంటి ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.పెళ్లయ్యాక వధూవరులు ఒకరి నోట్లో ఇంకొకరు రసగుల్లా పెట్టుకుని రుచి చూడాల్సి వుంది. ఈ క్రమంలో తొలుత పెళ్లి కుమార్తె తన చేతితో రసగుల్లను వరుడి నోట్లో పెట్టింది.
ఇరాన్ ఇప్పటికే ప్రపంచ ఇంధన సరఫరాకు గుండెకాయ లాంటి స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధిని దిగ్భంధించింది. ప్రస్తుతం అందరి దృష్టి సముద్ర గర్భంలో వున్న ఇంటర్నెట్ కేబుల్స్పై పడింది. టెహ్రాన్ తన నెక్ట్స్ ఈ గ్లోబల్ ఇంటర్నెట్ను కట్ చేయబోతుందని టాక్ వస్తోంది. అమెరికా-ఇరాన్ యుద్ధం మూడవ వారంలోకి ప్రవేశిస్తోంది. దాని ప్రభావం క్షిపణులు, చమురు, సైనిక లక్ష్యాలకు మించి చాలా దూరం విస్తరించవచ్చనే భయాలు ఉన్నాయి. సముద్ర ఉపరితలం కింద, మధ్యప్రాచ్యంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ఇంటర్నెట్ అందించే కేబుళ్లు ఉన్నాయి.
"జాదూ వర్సెస్ రాకీ" అంటూ ఒక ప్రత్యేక వీడియోలో హృతిక్ రోషన్ తన సూపర్ హిట్ సాంగ్ 'ఏక్ పల్ కా జీనా' ఐకానిక్ స్టెప్ను ఈ హాలీవుడ్ చిత్రంలోని ఏలియన్ క్యారెక్టర్ 'రాకీ'కి నేర్పిస్తున్నట్లు చూపించారు. హృతిక్, రాకీల మధ్య ఉన్న స్నేహాన్ని చూసి, 'కోయీ.. మిల్ గయా'లోని హృతిక్ పాత ఏలియన్ స్నేహితుడు 'జాదూ' క్యూట్గా రియాక్ట్ అవ్వడం ఈ వీడియోలో ప్రధాన ఆకర్షణ.
విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబోలో వచ్చిన ‘బిచ్చగాడు’ చిత్రంలో అమ్మ త్యాగాన్ని గుర్తుచేస్తూ పాడిన వంద దేవుళ్లు అనే పాట వుంటుంది. ఇప్పుడు దానిని టైటిల్ గా చేసుకుని సినిమా రాబోతోంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.