తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలో ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా, ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. మొత్తం 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 8, బీఆర్ఎస్ 7, బీఎస్పీ ఒక స్థానంలో విజయం సాధించగా, ఏడో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన గాదె వెంకటేశ్ విజయం సాధించారు.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో సంచలనాలు నమోదవుతున్నాయి. క్రికెట్ పసికూనలు మెటి జట్లకు ముచ్చెమటలు పోయిస్తున్నాయి. ఇంగ్లండ్ జట్టును ఆప్ఘనిస్థాన్ జట్టు ఓడించినంత పనిచేసింది. తాజాగా ఆస్ట్రేలియా జట్టును జింబాబ్వే చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో రాణించడంతో ఆ జట్టు విజయభేరీ మోగించింది.
కొత్తవారిని ఎంకరేజ్ చేసేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు 'దిల్ రాజు డ్రీమ్స్' అనే బ్యానర్ స్థాపించారు. ఈ బ్యానర్ లో తొలి ప్రయత్నంగా యంగ్ హీరో విక్రాంత్ తో "మార్కండేయ" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతాన ప్రాప్తిరస్తు సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ కెరీర్ కు దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ నిర్మిస్తున్న తొలి చిత్రంలో హీరోగా నటిస్తుండటం మంచి అడ్వాంటేజ్ కానుంది. ఈ సినిమాను మైథలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సిస్ట్లా వీఎంకే రూపొందిస్తున్నారు. హైదరాబాద్ లో "మార్కండేయ" మూవీ టైటిల్ గ్లింప్స్ గ్రాండ్ గా రిలీజ్ చేశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు ఇటీవల కవల పిల్లలకు జన్మనిచ్చారు. తాజాగా ఆ కవల పిల్లలకు పేర్లు పెట్టారు. కుమారుడికి శివరామ్, కుమార్తెకు అన్వీరా దేవి అంటూ నామకరణం చేసి, బారసాల కూడా పూర్తి చేశారు. ఈ ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
నటుడిగా మెగాస్టార్ చిరంజీవిని స్పూర్తిగా తీసుకుని హీరోతోపాటు దర్శకుడిగా, రచయితగా కూడా అనుభవం సంపాదించిన సౌమిత్ రావు నిలవే చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. శ్రేయాసి సేన్ నాయికగా నటించింది. అందరూ కొత్తవాళ్లతో చేసిన ఈ సినిమా ప్రేమకథలో కె.జి.ఎప్. లాంటిదని స్టేట్ మెంట్ ఇచ్చారు. మరి ఈ సినిమా నేడే విడుదలైంది. ఎలా వుందో చూద్దాం.
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన ఆరోపణలు చేస్తున్న బాధిత మహిళ వీణ మరో వీడియోను విడుదల చేసింది. అందులో ఆమె మాట్లాడుతూ... నేను ఎక్కడో దాక్కున్నానని కొంతమంది రాస్తున్నారు. నేను ఎక్కడా దాక్కోలేదు. నేను న్యాయపోరాటం చేస్తున్నాను. నాకు న్యాయం జరిగే వరకూ చేస్తూనే వుంటాను. జనసేన విచారణ కమిటీ నుంచి నాకు ఎలాంటి పిలుపు రాలేదు.ఐతే మీడియాలో వార్తల ప్రకారం, కమిటీ నన్ను పిలిచిందనీ, నేను రాలేదని ప్రచారం జరుగుతోంది. నన్ను ఏ కమిటీ ఇంతవరకూ సంప్రదించలేదు. పిలిచినా నేను వెళ్లలేదంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దాన్ని ఆపండి.
ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి సభలో ప్రజా సమస్యలను లేవనెత్తడం పట్ల ఏమైనా నిబద్ధత ఉందా అని హెచ్ఆర్ అండ్ ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ సభ్యులు కౌన్సిల్ నుండి వాకౌట్ చేసి, విరామం తీసుకుని, టీ తాగి, తిరిగి సభకు వచ్చినప్పుడు దానిని ఫ్యాషన్ లేదా ప్యాషన్ అని పిలవాలా అని తనకు తెలియట్లేదని నారా లోకేష్ అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు ఇది ఒక ఆనవాయితీగా మారిందని లోకేష్ మండిపడ్డారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, ఆమె పోటీదారులు వడ్డేపల్లిలో ఒక మున్సిపాలిటీ స్థానాన్ని గెలుచుకోగలిగారు. కవిత పార్టీని ప్రారంభించినట్లు చెప్పినప్పటికీ, ఆమె ఇంకా ఆ విషయంపై అస్పష్టంగానే ఉంది. తాను నిర్ణయం తీసుకునే ముందు మున్సిపల్ ఎన్నికలు జరిగినందున, కవిత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మద్దతు తీసుకొని వారి గుర్తుపై పోటీ చేశారు. ఇప్పుడు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గద్వాల్ జోగులాంబ జిల్లాలో ఒక మున్సిపాలిటీని గెలుచుకుంది.
విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `ఫంకీ`.ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. విడుదలకు ముందు ప్రమోషన్ లో అనుదీప్ తన గత చిత్రం జాతిరత్నాలుకు మించి వుంటుందని పోల్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కొద్దిమార్పులు చేసిన ఫంకీ ఎలా వుందో తెలుసుకుందాం.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా, పరకాల పురపాలక సంస్థకు జరిగిన ఎన్నిక్లలో కాంగ్రెస్ అభ్యర్థి కేవలం ఒకే ఒక్క ఓటుతో విజయం సాధించింది. ఈ మున్సిపాలిటీలోని 17వ వార్డు ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి బొచ్చు సుభద్రకు 369 ఓట్లు పోలవ్వగా, భారత రాష్ట్ర సమితి తరపున పోటీ చేసిన శనిగరపు రజినీకి 368 ఓట్లు వచ్చాయి. దీంతో రజినీ రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకోగా రెండోసారి కౌంటింగ్ చేసినప్పటికీ ఫలితంలో మాత్రం తేడా రాలేదు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి బొచ్చు సుభద్ర గెలుపొందినట్టుగా అధికారులు ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ విజయపథంలో దూసుకెళుతోంది. విపక్ష పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ పదుల సంఖ్యలో మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటోంది. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓట్ల లెక్కిస్తున్న పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులో ఓ లేఖ కనిపించింది. సూర్యాపేటలోని 47వ వార్డు బ్యాలెట్ బాక్స్ తెరవగా అందులో నుంచి ఓ లేఖ బయటపడింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విశ్రాంత ఉద్యోగి ఒకరు ఈ లేఖ రాశారు. అందులో ఏముందంటే...
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కలిసి మన శంకర వర ప్రసాద్ గారు సినిమా సూపర్ రికార్డును సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టి, ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా వసూలు చేసి చిరంజీవి కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవతరించింది. ప్రస్తుతం ఈ సినిమా డిజిటల్ రంగంలోనూ బాక్సాఫీసును షేక్ చేసింది. జీ5 ద్వారా ఓటీటీకి వచ్చిన ఈ సినిమా మొదటి 24 గంటల్లోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను సాధించింది. ఈ ఫీట్ ప్లాట్ఫామ్పై ఏ చిత్రానికి అయినా అతిపెద్ద ఓపెనింగ్గా నిలిచింది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో శుక్రవారం వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో జనసేన పార్టీ తొలిసారి బోణీ కొట్టింది. అలాగే, భారతీయ రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్కు గురైన తెలంగాణ జాగృతి నాయకురాలు కె.కవిత వర్గం ఎవరూ ఊహించని ఫలితాన్ని సాధించింది. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో తెలంగాణ జాగృతి నాయకురాలు ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.
నడిరోడ్డు మీద అంతా చూస్తుండగానే హీరోలు విజయ్, అజిత్ ఫైటింగ్ చేసుకుంటున్నారు. ఒకరికొకరు ముష్టిఘాతాలు ఇచ్చుకుంటున్నారు. విజయ్ కాళ్లతో అజిత్ ను తంతున్నాడు. ఓ గట్టి షాట్ దెబ్బకి అజిత్ పల్టీలు కొడుతూ రోడ్డు పైన తూలుతూ పడిపోయాడు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అసలు విషయం ఏంటంటే... ఈ వీడియో నిజమైనది కాదు. ఏఐ జనరేటెడ్. హీరోలిద్దరూ ఫైటింగ్ చేసుకుంటే ఎలా వుంటుందో చూపించేందుకు ఇలా చేసాడట ఓ క్రియేటర్. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ఇప్పుడు మన ఉద్యోగాలు ఊడుతున్నట్లే భవిష్యత్తులో హీరోలతే పనే లేకుండా సినిమాలు కూడా వచ్చేస్తాయి.
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ బోణీ కొట్టింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలోని 14వ వార్డులో పోటీ చేసిన జనసేన అభ్యర్థి తన సమీప ప్రత్యర్థిపై విజయం సాధించారు. ఈ విజయం పార్టీ శ్రేణుల్లో మంచి ఉత్సాహాన్నిచ్చింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ముఖ్యమైన మైలురాయిని నమోదు చేస్తూ, జిల్లాలోని చిట్యాల మునిసిపాలిటీలో వార్డు సభ్యుడిగా ఎన్నికైన మొదటి ట్రాన్స్జెండర్ వ్యక్తిగా నాగళ్ల సుధాకర్ నిలిచారు. వార్డు 1 నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుధాకర్, ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులను ఓడించి 100 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించారు. చిట్యాల మునిసిపాలిటీలోని 12 వార్డులలో, కాంగ్రెస్ తొమ్మిది వార్డులను గెలుచుకోగా, బీఆర్ఎస్ రెండు వార్డులను గెలుచుకుంది.
అల్లం ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. అందుకే వంటకాల్లో కాస్తంత అల్లం ముక్కను తురిమి వేస్తుంటారు. ఈ అల్లం ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో ఒకటి. పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ. అల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.మీ రోజువారీ మోతాదు విటమిన్ సి కోసం అల్లం టీ తాగితే సరిపోతుంది.అల్పాహారంలో కాస్తంత అల్లం జోడించడం వలన రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివి తగ్గుతాయి.కొద్దిపాటి అల్లం రసం తాగితే జీవక్రియను పెంచడంతో పాటు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించలేదు.వికారం, మార్నింగ్ సిక్నెస్ తో వున్నవారికి అల్లం మేలు చేస్తుంది.
గత 48 గంటల్లో పశ్చిమ గోదావరి జిల్లా తీరప్రాంతంలో 49 తాబేళ్లు చనిపోయాయని, ఇది తీరానికి దగ్గరగా జరుగుతున్న అక్రమ చేపల వేటపై ఆందోళన వ్యక్తం చేసింది. తీరప్రాంతం నుండి అనుమతించబడిన దూరానికి మించి వలలు వేయాల్సిన స్థానిక మత్స్యకారులకు చెందిన ఫిషింగ్ వలలలో తాబేళ్లు చిక్కుకుంటున్నాయని పశ్చిమ గోదావరి జిల్లా అటవీ అధికారి (డిఎఫ్ఓ) ఎఫ్ఎ కిరణ్ తెలిపారు.
తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బోణీ కొట్టింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మునిసిపాలిటీలోని 15 వార్డుల్లో ఒక వార్డులో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ 9 వార్డుల్లోనూ, బీఆర్ఎస్ 5 వార్డుల్లో విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మునిసిపాలిటీల పరిధిలోని 2586 వార్డులకు, 7 కార్పొరేషన్ల పరిధిలోని 414 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. శుక్రవారం నాడు కౌంటింగ్ ప్రారంభమైంది. లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ తన హవా సాగిస్తోంది.
సినీ స్టార్స్ మృణాల్ ఠాకూర్, ధనుష్ డేటింగ్ ప్రేమలో వున్నారని, ఫిబ్రవరి 14, 2026న వివాహం చేసుకోవాలని యోచిస్తున్నారని పుకార్లు వచ్చాయి. ఈ వార్తలపై మృణాల్ స్పందించింది. "ఈ పుకార్లు ఎక్కడి నుండి వ్యాపించాయో నాకు తెలియదు. అవి పూర్తిగా నిరాధారమైనవి" అని చెప్పింది. ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి గాసిప్లను నమ్మి వ్యాప్తి చేసే వారికి వాలెంటైన్స్ డే ఏప్రిల్ ఫూల్స్ డేగా మారుతుందని ఆమె కౌంటరిచ్చారు. ధనుష్తో వివాహం జరుగుతుందనే వార్తల్లో నిజం లేదని ఆమె గట్టిగా స్పష్టం చేసింది.
జ్యోతిషుడు చెప్పిన మాట నిజమని విశ్వసించిన ఓ వివాహిత తన కన్నతల్లినే హతమార్చిన ఘటన కర్నాటకలోని తుమ్కూరులో చోటుచేసుకున్నది. 55 ఏళ్ల పుష్పావతి తెల్లవారు జామును గుండెపోటు రావడంతో చనిపోయిందంటూ ఆమె కుమార్తె సుచిత్రం చెప్పడంతో ఇరుగుపొరుగువారు షాక్ తిన్నారు. పైగా తల్లి అంత్యక్రియలకు కుమార్తె తెగ ఆరాటపడుతూ, హైరానా పడుతూ కనిపించింది. రాత్రివరకూ బాగానే వున్న ఆమె ఎలా చనిపోయిందన్న అనుమానం కలగడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంత్యక్రియలు జరిపేందుకు త్వరపడుతున్న సుచిత్రను నిలువరించి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. రిపోర్టులో అసలు నిజయం బైటపడింది.
తెలంగాణకు చెందిన ఉదయ్ నాగరాజ్, బ్రిటిష్ పార్లమెంట్ ఎగువ సభ అయిన హౌస్ ఆఫ్ లార్డ్స్లో జీవితకాల సభ్యుడిగా లేదా జీవిత భాగస్వామిగా ప్రమాణ స్వీకారం చేశారు. బ్రిటన్ పార్లమెంట్ నిబంధనల ప్రకారం నాగరాజు ముదురు ఎరుపు రంగు గౌను ధరించి ప్రమాణ స్వీకారం చేశారు. 25 సంవత్సరాలుగా బ్రిటన్లో నివసిస్తున్న నాగరాజు భగవత్ గీతపై ప్రమాణ స్వీకారం చేశారు. నాగరాజు సిద్దిపేట జిల్లా కోహెడలోని సెనిగరం గ్రామానికి చెందినవాడు. 25 సంవత్సరాల క్రితం బ్రిటన్కు వెళ్లిన తర్వాత, ఆయన మహాత్మా గాంధీ ఫ్యూచర్ లీడర్స్ ప్రోగ్రామ్ను ప్రారంభించారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ గుర్తుపై జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే. సహజంగానే, ఫలితంపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలకు ముందు జిల్లాల్లో పర్యటిస్తున్నందున కాంగ్రెస్ కూడా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, ఐదు మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార కాంగ్రెస్ పెద్ద విజయం సాధించనుంది. మున్సిపాలిటీలలో, బిఆర్ఎస్ కాంగ్రెస్ తర్వాత నిలుస్తుందని, కార్పొరేషన్లలో బిజెపి ఆధిక్యంలో ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ ఇంకా చెప్పాయి.
మున్సిపల్ ఎన్నికలకు ముందు తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ఎక్సైజ్ శాఖ ప్రకారం ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 9 వరకు రూ.961 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ప్రతి రోజు సగటున రూ.100 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి. ఫిబ్రవరి ప్రారంభమైన 8 రోజుల్లో రూ.881 కోట్ల మద్యం కొనుగోలు జరిగింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.672 కోట్ల అమ్మకాలు జరిగాయి. అంటే అమ్మకాలలో 31శాతం పెరుగుదల. ఫిబ్రవరి మొదటి వారంలో పోటీదారుల జేబుల నుండి రూ.209 కోట్లు బదిలీ అయ్యాయి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మునిసిపాలిటీల పరిధిలోని 2586 వార్డులకు, 7 కార్పొరేషన్ల పరిధిలోని 414 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. శుక్రవారం నాడు కౌంటింగ్ ప్రారంభమైంది. లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ తన హవా సాగిస్తోంది. ఇప్పటివరకూ కాంగ్రెస్ 441 మునిసిపల్ వార్డులోలనూ, బీఆర్ఎస్ 236 స్థానాల్లోనూ, భాజపా 63 స్థానాల్లోనూ, ఇతరులు 75 స్థానాల్లో విజయం దిశగా సాగుతున్నారు.మొత్తమ్మీద పుర, నగర ప్రజలు రేవంత్ రెడ్డి సర్కారుకే మొగ్గు చూపినట్లు కనబడుతోంది. 116 మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ 13 స్థానాల్లోనూ, బీఆర్ఎస్ 4 స్థానాల్లో విజయం దిశగా సాగుతున్నాయి. మధ్యాహ్నానికి ఫలితాలు దాదాపు రావచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో అంబటి రాంబాబు అత్యంత దూకుడుగా, రెచ్చగొట్టే రాజకీయ నాయకులలో ఒకరు. ఈ విధానం వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబును దుర్భాషలాడి జైలుకు వెళ్లారు. ముఖ్యమంత్రి దుర్భాషలాడిన కేసులో, గుంటూరు ర్యాలీ కేసులో బెయిల్ పొందిన రాంబాబు విడుదల కావాల్సి ఉంది. కానీ అక్రమ లాటరీ కేసులో గుంటూరు పోలీసులు అంబటి పీటీ వారెంట్ పొందడంతో అంతా అనుకున్నట్లుగా జరగలేదు. ఆ తర్వాత, రాంబాబును గుంటూరు కోర్టులో హాజరుపరిచారు.
అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూస్తూ వున్న ఏటీఎం క్యాష్ డిపాజిట్ డ్రైవర్, కాస్త సమయం దొరకగానే వ్యానులో వున్న రూ. 60 లక్షల నగదుతో వుడాయించాడు. ఈ ఘటన రాయదుర్గంలోని గోపనపల్లిలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.ఏటీఎంల్లో నగదు నిర్వహణ చేసే సీఎంఎస్ సంస్థలో అజిత్ కుమార్ అనే వ్యక్తి వ్యాను డ్రైవరుగా పనిచేస్తున్నాడు. ప్రతిరోజూ నగదు డిపాజిట్ చేసేందుకు విధులు నిర్వహిస్తున్న అజిత్ కుమార్ డబ్బు దొంగిలించాలన్న దురాశ పుట్టింది. దీనితో అవకాశం కోసం వేచిచూస్తున్నాడు.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. చిత్తూరు నగర శివారులోని ఇరువారం కూడలిలో తిరుపతి నుంచి బెంగళూరు వైపు వెళుతున్న కారు అతివేగంగా వచ్చి రోడ్డు పక్కనే ఆగి వున్న కంటైనర్ ను ఢీకొట్టింది. ఈ వేగానికి కారు పూర్తిగా కంటైనర్ కిందకి చొచ్చుకుని వెళ్లి నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కారు ప్రమాదంలో మరణించినవారి వివరాలు తెలియాల్సి వుంది. కంటైనర్ కింద ఇరుక్కుపోయిన కారు నుంచి మృత దేహాలను బైటకు తీయడం కష్టతరంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2586 మునిసిపాలిటీల్ వార్డులకు, 414 కార్పొరేషన్ల వార్డులకు ఎన్నికలు జరిగాయి. శుక్రవారం నాడు కౌంటింగ్ ప్రారంభమైంది. లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ తన హవా సాగిస్తోంది. ఇప్పటివరకూ కాంగ్రెస్ 69 స్థానాల్లోనూ, బీఆర్ఎస్ 31 స్థానాల్లోనూ, భాజపా 12 స్థానాల్లోనూ, ఇతరులు 4 స్థానాల్లో విజయం దిశగా సాగుతున్నారు.మొత్తమ్మీద పుర, నగర ప్రజలు రేవంత్ రెడ్డి సర్కారుకే మొగ్గు చూపినట్లు కనబడుతోంది. కార్పొరేషన్లలో కూడా రెండింటిలో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తోంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో కనిపించారు. బాలకృష్ణ పవన్ కళ్యాణ్ను కలవడానికి ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా వారిద్దరూ అనేక అభివృద్ధి, రాజకీయ అంశాలపై విస్తృత చర్చలు జరిపారు.పంచాయితీ రాజ్ - అటవీ శాఖ మంత్రి కూడా అయిన కళ్యాణ్ నుండి బాలయ్య తగిన మద్దతు కోరినట్లు భావిస్తున్నారు. డిప్యూటీ సీఎం కార్యాలయంలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాల వల్ల సినిమా వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చే మహిళలు చీరకట్టులో వస్తున్నారంటూ సీనియర్ నటుడు నరేశ్ అన్నారు. కొన్ని నెలల క్రితం నటుడు శివాజీ ఓ సినిమా కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి నరేశ్ పై విధంగా కామెంట్స్ చేశారు.
టీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా గురువారం నాడు భారత్-నమీబియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ ఆటగాడు ఇషాన్ కిషన్ విధ్వంసకర బ్యాటింగుతో భారత్ 93 పరుగుల తేడాతో భారీ విజయాన్ని కైవసం చేసుకున్నది. తొలుత బ్యాటింగుకి దిగిన భారత జట్టు ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో 61 పరుగులు చేసాడు. ఆ తర్వాత వచ్చినవారు కూడా ధాటిగా ఆడారు.
వేసవి తాపం తగ్గించుకోవడానికి, వేసవిలో శరీరం కోల్పోయే నీటిని తిరిగి అందించడంలో కర్బూజపండు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పండు ముఖ్యంగా శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అధిక రక్తపోటుని తగ్గిస్తుంది. మరి ఈ పండులో ఉన్న పోషక విలువలేంటో తెలుసుకుందాం. కర్బూజ పండులో ఎక్కువ శాతం బీటాకెరోటిన్, విటమిన్ సి ఆరోగ్యానికి తోడ్పడి క్యాన్సర్ బారిన పడిన కణాలను తగ్గించి ప్రీ-రాడికల్స్ని తొలగిస్తుంది. దీనిలో ఉన్న విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు శరీరంలోని తెల్ల రక్త కణాలను వృద్ది చెందేలా చేసి రక్తంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని, క్రికెట్ దిగ్గజం, పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. ఇప్పటికే ఆయన కుడి కన్ను కంటి చూపు 85 శాతం మేరకు పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. జైలు గదిలో సుధీర్ఘకాలంగా ఒంటరిగా ఉంచడంతో ఆయన కంటి చూపు కోల్పోతున్నారని, ఆరోగ్య పరిస్థితి నానాటికీ క్షీణిస్తోందని సుప్రీంకోర్టు నియమించిన న్యాయవాది పరిశీలనలో వెల్లడైంది. ఈ పరిణామాలపై స్పందించిన కోర్టు.. వెంటనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.
తెలుగు ప్రజల ఆరాధ్యదైవం స్వర్గీయ ఎన్.టి.రామారావుకు భారత రత్న పురస్కారం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ ఒక జాతీయ నేత అని ఆయన కొనియాడారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలురు కేంద్ర మంత్రులను కలుసుకున్నారు.
పాకిస్తాన్ దేశంలో జరిగే రాజకీయ పరిణామాలు గురించి వేరే చెప్పక్కర్లేదు. అధికారంలో వున్నప్పుడు ఒక్కొక్కరు చెలరేగిపోతుంటారు. దిగిపోయాక గద్దెనెక్కినవారు అంతకుముందటి నాయకలపై కసి తీర్చుకుంటారు. ఇప్పుడు అదే పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వ్యవహారంలోనూ జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆడియాలో జైల్లో వున్న ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తున్నట్లు వుందని చెప్పుకుంటున్నారు. ఇమ్రాన్ కంటిచూపు క్రమంగా సన్నగిల్లుతోందట. కుడి కంటి చూపు దాదాపు 85 శాతం పోయిందనీ, కేవలం 15 శాతం మాత్రమే మిగిలి వున్నట్లు వైద్య నివేదికలు చెబుతున్నట్లు కోర్టు నియమించిన న్యాయవాది వెల్లడించారు.
సందీప్ ఖన్నా, మనీష్ సభర్వాల్ రాసిన మేడ్ ఇన్ ఇండియా, మూడు అద్భుతమైన ప్రయాణాలను మనకు సూచిస్తుంది. అందులో ఒకటి భారతదేశ ఫార్మా పరిశ్రమ పెరుగుదల, లుపిన్ ఆవిర్భావం మరియు పరిణామం, అలాగే లుపిన్ వ్యవస్థాపకుడు దేశ్ బంధు గుప్తా గారి యొక్క అసాధారణ జీవితం. ఈ మూడు ప్రయాణాలను మనం ఒక్కసారి కలిపి చూస్తే... ఒకప్పుడు ఔషధాలను దిగుమతి చేసుకోవడంపైనే ఆధారపడిన దేశం, ఇప్పుడు ప్రపంచ ఫార్మసీగా కేంద్రస్థానంగా ఎలా మారిందో మనకు చాటిచెప్తుంది.
ఓట్స్లో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా వున్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా అధిక బరువు తగ్గవచ్చు. ఇంకా వీటి ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.ఓట్స్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.ఓట్స్ పోషకాలతో నిండి వుంటాయి, శక్తివంతమైన ఫైబర్ బీటా-గ్లూకాన్తో సహా పిండి పదార్థాలు, ఫైబర్లు వుంటాయి.యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కనుక ఓట్స్ తింటుండాలి.ఓట్స్లో బీటా-గ్లూకాన్ అనే శక్తివంతమైన కరిగే ఫైబర్ ఉంటుంది.ఓట్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగలవు, మంచి కొలెస్ట్రాల్ను దెబ్బతినకుండా కాపాడతాయి.ఓట్స్ రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరుస్తుంది.
ముంబై మహానగరంలో ఆక్రమణలు ఇదే విధంగా కొనసాగిన పక్షంలో భవిష్యత్లో సైకిళ్లు, గుర్రాలపై ప్రయాణం చేయాల్సి వస్తుందేమో అని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. ముంబైలో ఆక్రమణల పరిస్థితి చాలా దారుణంగా ఉందని తెలిపింది. తమ పరిసరాల్లోని ఆక్రమణలపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ ఓ పాఠశాల దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తూ హైకోర్టు ఈమేరకు వ్యాఖ్యలు చేసింది.
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ తాను చేపట్టిన సంకల్ప యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. గత వైకాపా ప్రభుత్వంలో నాటి విపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసు బనాయించి, అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఈ కేసులో చంద్రబాబును గత వైకాపా ప్రభుత్వం ఏకంగా 52 రోజులకు పైగా రాజమండ్రి జైలులో బంధించింది. ఆ సమయంలో చంద్రబాబు క్షేమంగా, ఆరోగ్యంతో జైలు నుంచి విడుదల కావాలని బండ్ల గణేశ్ కోరుకుంటూ ఆ శ్రీవేంకటేశ్వర స్వామివారికి మొక్కుకున్నారు.
నేచురల్ స్టార్ నాని మ్యాసీవ్ పీరియడ్ యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం హాటెస్ట్ పాన్-ఇండియన్ రిలీజెస్ లో ఒకటిగా శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. హైదరాబాద్లో చిత్రీకరణ జోరుగా సాగుతుండగా, నిర్మాతలు ఇప్పుడు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.
కృత్రిమమేథతో వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు తప్పని మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ ముస్తాఫా సులేమాన్ అన్నారు. మరో యేడాది కాలంలో వైట్ కాలర్ ఉద్యోగాలు సింహ భాగం ఏఐతో భర్తీ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల్లో కొందరు కోడర్లు మాత్రమే కాకుండా, లాయర్లు, అకౌంటెంట్ ఉద్యోగాలపై కూడా ఏఐ కత్తి వేలాడుతోందని ఆయన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదంఅవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొందరి వ్యాఖ్యలు నీరుగారుస్తాయి. మొండిగా యత్నాలు సాగిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి.
సంతోష్ శోభన్ హీరోగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదలకాబోతోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సినిమా హైలైట్స్ తెలిపారు హీరోయిన్ మానస వారణాసి
వైకాపా నుంచి సస్పెండ్కు గురైన ఎమ్మెల్యీ దువ్వాడ శ్రీనివాస్ను వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పలుకరించారు. వాట్.. శీనూ ది గ్రేట్ అంటూ కితాబిచ్చారు. పైగా, ఫ్యామిలీ రచ్చ ఎందుకు చేసుకుంటున్నావ్ అంటూ అడిగారు.
సంక్రాంతి సంబరాలు లక్కీడ్రా కేసులో వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు ప్రిన్సిపల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను రాజమండ్రి కేంద్ర కారాగారానికి పోలీస్ బందోబస్తు మధ్య తరలించారు.
విరాట్ కర్ణ హీగా అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'నాగబంధం' ఈ వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 15న మహా శివరాత్రి శుభ సందర్భంగా ఉదయం 11:11 గంటలకు టీజర్ విడుదల కానుండగా, మేకర్స్ ఇప్పుడు ఎక్సయిటింగ్ అప్డేట్ ఇచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు టీజర్ను లాంచ్ చేస్తారని టీం అనౌన్స్ చేసింది. సూపర్ స్టార్ అసోసియేషన్ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న బజ్ను మరింత పెంచుతుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ సినీ రంగ ప్రవేశంపై ఊహాగానాలు మరింత జోరుగా వినిపిస్తున్నాయి. అకీరా నందన్ ఎంట్రీ ఎపుడు, ఎవరి దర్శకత్వంలో నటిస్తారనే చర్చ ఫిల్మ్ నగర్లో జోరుగా సాగుతోంది.
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద అర్జున్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీతో ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా స్పెషల్ పాత్ర లో కనిపించనున్నారు . ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర నిర్మాత, దర్శకుడు అర్జున్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులేంటో ఓ సారి చూద్దాం..
తెలుగు చిత్రపరిశ్రమలోని ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్లలో ఒకరు సుబ్బరాజు. 'బాహుబలి' చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన లేటు వయసులో గత యేడాది వివాహం చేసుకున్నారు. తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను లేటు వయసులో వివాహం చేసుకోవడాని గల కారణాలను వివరించారు.