నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంకుశ పాలనలో మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు జరిగాయని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు హింసాత్మక వ్యూహాలను ఖండిస్తూ, దాడులు, ప్రతీకార రాజకీయాల ద్వారా ప్రతిపక్షాల గొంతు నొక్కలేరని ఆయన అన్నారు.
మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లిలో మంగళవారం రాత్రి ఒక వ్యక్తి తన ఇంట్లో నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ అతని భార్య ఆమెను హత్య చేసింది.వివరాల్లోకి వెళితే.. రోజువారీ కూలీ అయిన షేక్ మహ్మద్ (55) మద్యానికి బానిసై తరచుగా తాగి ఇంటికి వచ్చి తన భార్య నసీమా బేగం, వారి పిల్లలతో గొడవ పడేవాడు.
విజయనగరం జిల్లాలోని జాదవారి కొత్తవలస అనే చిన్న గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి రాజపు సిద్ధు. పరిమిత వనరులతో, అపరిమిత సృజనాత్మకతతో, సిద్ధు స్వయంగా ఒక ఎలక్ట్రిక్ సైకిల్ను తయారు చేశాడు. కేవలం 3 గంటల ఛార్జింగ్తో 80 కిలోమీటర్లు పరిగెత్తగల దాని సామర్థ్యాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయిన తర్వాత అతని ఆవిష్కరణ సోషల్ మీడియాలో దృష్టిని ఆకర్షించింది.
దేశంలో కోట్లాది మంది బ్యాంకు ఖాతాదారులకు ఇది శుభవార్త. సేవింగ్స్ ఖాతాలలో కనీస నిల్వ లేకుంటే విధించే చార్జీలను పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు రద్దు చేశాయి. ఈ నిర్ణయంతో సాధారణ, మధ్య తరగతి ప్రజలపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా సహా మరిన్ని బ్యాంకులు ఈ జాబితాలో చేరాయి.
బెంగళూరులో భార్యభర్తల మధ్య జరిగిన చిన్న గొడవ భార్య హత్యకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని శ్రీనివాస్పూర్కు చెందిన హరీష్ కుమార్, పద్మజలు భార్యభర్తలు. ఇద్దరూ ఉన్నత చదువులు చదివారు. వీరిద్దరు ఇంజనీరింగ్ పూర్తి చేసి, బెంగళూర్లో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే చిన్నచిన్న విషయాలకే ఈ జంట తరుచూ గొడవపడేవారని, మంగళవారం రాత్రి కూడా ఇది మరింత తీవ్రంగా మారినట్లు పోలీసులు చెప్పారు.
తెలంగాణ వచ్చాక కేసీఆర్ పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కృష్ణలో నీళ్లు తెలంగాణలోకి వచ్చిన వెంటనే ఒడిసి పట్టాల్సింది. జూరాల నుంచే నీరు తీసుకుందామని చిన్నారెడ్డి ఆరోజు సూచన చేశారు. ఆ రోజే చిన్నారెడ్డి మాట కేసీఆర్ వినిఉంటే నీళ్ల దోపిడి జరిగేది కాదు. చిన్నారెడ్డి సౌమ్యుడు కాబట్టి ఏం మాట్లాడలేదు. ఈ ద్రోహానికి కేసీఆర్ను వంద కొరడా దెబ్బలు కొట్టాలి. మేం సరిదిద్దుతుంటే తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేసి మాపై నిందలు మోపుతున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
చియా సీడ్స్ తీసుకోవడం ద్వారా గుండెను పదిలం చేసుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే చియా సీడ్స్ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. నీరసం, అలసట సమస్యలతో బాధపడేవారికి ఇవి ఎనర్జీ బూస్టర్గా పనిచేస్తాయి. ఫైబర్ అధికంగా ఉండే చియా గింజలు జీర్ణక్రియకు సహాయపడతాయి. చియా విత్తనాలను తినేటప్పుడు పుష్కలంగా నీరు త్రాగటం ముఖ్యం.
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదంఖర్చులు అధికం. ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. పనులు ఒక పట్టాన సాగవు. పత్రాల రెన్యువల్లో మెళకువ వహించండి. గృహమార్పు అనివార్యం. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు అవసరమవుతాయి.
కేంద్ర మంత్రి హోం మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రకృతి వ్యవసాయం చేస్తానని వెల్లడించారు. ప్రజా జీవనం నుంచి వైదొలగిన అనంతరం భవిష్యత్ ప్రణాళికపై ఓ క్లారిటీ ఇచ్చారు. వేదాలు, ఉపనిషత్తులు చదవడంతో ప్రకృతి వ్యవసాయంపై దృష్టిపెడతానని చెప్పాు. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల సహకార సంఘాల మహిళలతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఆషాఢ పూర్ణిమ లేదా గురు పౌర్ణమి జూలై 10 అంటే గురువారం నాడు రాబోతుంది. పవిత్రమైన రోజున తమ జీవితానికి మార్గనిర్దేశం చేసిన గురువులను సత్కరించి వారి ఆశీస్సులు తీసుకుంటారు. ఇదే రోజున కొన్ని శుభ యాదృచ్ఛికాలు కూడా జరగనున్నాయి. అదే రోజు శక్తివంతమైన ఇంద్రయోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో మనం ఏ శుభకార్యం చేపట్టినా అది విజయవంతమవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అయిన ZEE5లో ఓ అచ్చమైన, స్వచ్చమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన సిరీస్ రాబోతోంది. ‘మోతెవరి లవ్ స్టోరీ’ అంటూ ప్రేమ, హాస్యం వంటి ప్రధాన అంశాలతో ఈ సిరీస్ను సహజంగా రూపొందించారు. అనిల్ జీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ను శివ కృష్ణ బుర్రా రూపొందించారు.
హైదరాబాదులో డ్రగ్స్ రాకెట్ను ఈగల్ టీమ్ బయటపెట్టింది. రెస్టారెంట్లు వేదికగా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. మల్నాడు, టేల్స్ ఆఫ్ తెలుగు రెస్టారెంట్ యజమాని సూర్య ఈ కేసులో కీలకంగా ఉన్నారని ఈగల్ టీం స్పష్టం చేసింది. ఈగల్ టీం ఆపరేషన్లో డ్రగ్స్ దందా బయటపడిందని వివరించింది.
హిరణ్యకశిపుడు బ్రహ్మ దేవుడి వరం కోసం ఘోర తపస్సు చేసే సీక్వెన్స్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది. విష్ణువుపై భక్తితో ప్రహ్లాదుడు, తన నాస్తిక తండ్రి హిరణ్యకశిపుడి నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటాడు. ప్రహ్లాదుడిని రక్షించడానికి దిగివచ్చిన విష్ణువు అవతారమైన మహావతార్ నరసింహుడి రాకతో ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించింది.
హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా " K-ర్యాంప్". కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 11వ చిత్రమిది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తోంది. " K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. స్పెషల్ గా వేసిన మ్యాసీవ్ సెట్ లో ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ సూపర్విజన్లో భారీ యాక్షన్ ఎపిసోడ్ను చిత్రీకరిస్తున్నారు. ఈ హై-ఐన్టెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్ కోసం రియల్ సతీష్ మాస్టర్తో పాటు ఫారిన్ స్టంట్ మాస్టర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో హైలెట్ గా ఉండనుంది.
5వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు నలందా విశ్వవిద్యాలయం బ్యాక్గ్రౌండ్లో భారతదేశంలో జరిగిన కొన్ని చరిత్ర లో రాని నిజజీవితాల కథనాలతో ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో వస్తున్న చిత్రం ‘గేమ్ అఫ్ చేంజ్’. జాతీయ, అంతర్జాతీయ నటి నటులతో సిద్ధార్థ్ రాజశేఖర్ ప్రొడక్షన్స్ బ్యానర్లో మలయాళ దర్శకుడు సిధిన్ దర్శకత్వంలో సిద్ధార్థ్ రాజశేఖర్, మీనా చాబ్రియా నిర్మించిన అంతర్జాతీయ చిత్రం ‘గేమ్ అఫ్ చేంజ్’.
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు బుధవారం దేశ వ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు. దీంతో దేశంలోని అన్ని సంఘాలకు చెందిన కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. అయితే, ఈ సమ్మెలో భాగంగా, కేరళ రాష్ట్రంలో ఓ వింత దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆందోళనకారుల దాడుల నుంచి తనను తాను రక్షించుకునేందుకు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఒక డ్రైవర్ హెల్మెట్ ధరించి బస్సు నడపడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రతి ఒక్కరూ తమ లవ్ ప్రపోజల్లు ప్రత్యేకంగా ఉండాలని, గుర్తుండిపోయేలా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం రకరకాలుగా ఆలోచిస్తారు. తాజాగా జమైకాలోని ఓచో రియోస్లోని డన్స్ నది జలపాతం పైన తన ప్రేయసికి ప్రపోజ్ చేయడానికి మోకరిల్లడం ద్వారా ఆమెను ఆశ్చర్యపరచాలని ఒక వ్యక్తి నిర్ణయించుకున్నాడు. కానీ అతను ఏమీ చెప్పకముందే, అతను జలపాతంపై నుండి జారిపోయాడు. దీంతో లవ్ ప్రపోజల్ కాస్త వేరేలా ముగిసింది. అయితే ఆ వ్యక్తి సురక్షితంగా రక్షించబడ్డాడని తెలుస్తోంది.
అమ్మా... భోజనానికి ఇంటికి వస్తున్నానని తల్లికి ఫోన్ చేసి చెప్పిన ఒక యువ వైద్యుడు అటల్ సేతు వంతెనపై నుంచి నీటిలోకి దూకిన ఘటన ముంబై నగరంలో తీవ్ర కలకలం రేపింది. ఆస్పత్రి నుంచి ఇంటికి బయలుదేరిన ఆయన మార్గమధ్యంలో ఈ తీవ్ర నిర్ణయం తీకసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
చిత్రపరిశ్రమలో వారసత్వం, నెపోటిజంపై ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చపై నటుడు మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ నేపథ్యం ఉన్నంత మాత్రాన విజయాలు వాతంతట అవేరావని పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు. యంగ్ హీరో సుహాస్ నటించిన "ఓ భామ అయ్యో రామ" చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు హాజరైన మనోజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
జీడిమెట్ల మార్కండేయ నగర్లోని ఓ ATM కేంద్రంలో దొంగలు పడ్డారు. బుధవారం తెల్లవారుజామున దొంగలు గ్యాస్ కట్టర్ ఉపయోగించి ఏటీఎంలో నగదును దొంగిలించారు. ఈ ప్రక్రియలో, వారు నగదు వెండింగ్ మెషీన్ను ధ్వంసం చేశారు. దొంగిలించబడిన మొత్తం ఇంకా అంచనా వేయబడలేదు.
పాకిస్థాన్కు చెందిన ప్రముఖ నటి, మోడల్ హుమైరా అస్కర్ అలీ (30) అనుమానాస్పదస్థిలో మృతి చెందారు. అమె కరాచీలోని డిఫెన్స్ ఏరియాలో నివసిస్తున్న ఫ్లాట్లో విగతజీవిగా పడివున్నారు. వివరాల్లోకి వెళితో హుమైరా అస్కర్ గత కొన్నేళ్లుగా ఒంటరిగా నివసిస్తున్నారు. అయితే, గత మూడు వారాలుగా ఆమె ఎవరికీ కనిపించలేదు. ఈ క్రమంలోనే ఆమె ఫ్లాట్ నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు.
ఇండిగో విమానానికి పెను ముప్పుతప్పింది. దీంతో ఆ విమానంలో ఉన్న 169 మంది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తప్పింది. ఈ విమానం పాట్నా నుంచి ఢిల్లీకి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
సుడిగాలి సుధీర్ అంటే యూత్ తోపాటు పెద్దలకు తెలిసిన పేరు. జబర్ దస్త్ నుంచి బాగా పాపులర్ అయిన సుదీర్... ధనరాజ్, వేణు మంచి స్నేహితులు. జబర్ దస్త్ కథలు రాసేటప్పుడు మొదట్లో ఏడు ఎపిసోడ్స్ అనుకున్న ప్రోగ్రామ్ కంటెన్యూగా సాగడానికి వారే కారణమట. ఈ విషయాన్ని ఇటీవలే బలగం వేణు కూడా చెప్పాడు. తాజాగా ధనరాజ్ భార్య శిరీష కూడా వెల్లడించింది. రూమ్ లో కథల చర్చల్లో వుండగా అరుపులు కేకలే. ఒక్కోసారి కొట్టుకునేంతగా మారతారు. చూసేవారికి కొట్టుకుంటున్నట్లుంటుంది. కానీ కాసేపటికి సరదాగా బయటకు వస్తారు.
రాజస్థాన్ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుది. యుద్ధ విమానం ఒకటి కుప్పకూలిపోయింది. రాజస్థాన్ రాష్ట్రంలోని చూరు జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పైలెట్ ప్రాణాలు కోల్పోయారు. చూరు జిల్లా పరిధిలోని ఓ ప్రాంతంలో భారత వాయుసేనకు చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ విమానం కూలిపోయినట్టు స్థానిక అధికారులకు సమాచారం అందింది.
విజయనగర రాజు ప్రౌఢదేవరాయలు కృష్ణానది ఉత్తరం వైపు ప్రవహించే శ్వేతశృంగాగిరిలోని తీర్థంలో స్నానం చేసిన తర్వాత కుష్టు వ్యాధి నుండి అద్భుతమైన వైద్యం పొందారని భారత పురావస్తు సర్వే (ASI) ఒక శాసనాన్ని కనుగొంది. పల్నాడు జిల్లాలోని అచ్చంపేట మండలం జడపల్లి తాండలోని నందులరేవు వద్ద కనుగొనబడిన ఒక స్లాబ్ రెండు వైపులా రాజు వైద్యం స్థానిక పురాణాన్ని వివరించే శాసనం చెక్కబడింది.
సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'ఓ భామ అయ్యో రామ'. మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ బ్యానర్పై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రిలక్ రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్లో ఘనంగా జరిగింది. మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో మంచు మనోజ్ బిగ్ టికెట్ను ఆవిష్కరించారు.
బీహార్ రాష్ట్రంలోని సుపాల్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. అత్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడుని పట్టుకుని చితకబాది, బలవంతపు పెళ్లి చేశారు. అడ్డొచ్చిన యువకుడి తల్లిదండ్రులపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు పరిస్థితి విషమంగా ఉంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం మండలంలో వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు ముందు భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. మామిడి రైతులను కలిసి వారి సమస్యలను వింటారు.భద్రత నేపథ్యంలో మామిడి యార్డ్ వేదిక వద్ద 500 మంది రైతులను మాత్రమే అనుమతిస్తామని, కఠినమైన ప్రవేశ ఆంక్షలు అమలులో ఉన్నాయని తెలిపారు. ఇటీవల పల్నాడు జిల్లాలోని రెంటపల్ల గ్రామాన్ని రెడ్డి సందర్శించిన సందర్భంగా, ఆయన కాన్వాయ్కి చెందిన వాహనం కింద పడి ఒక వైకాపా మద్దతుదారుడు మరణించగా, మరొకరు గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.
బుల్లితెరపై స్టార్ గా ఎదిగిన ఆర్.కె. సాగర్ సినిమారంగంపై మక్కువతో సినిమాలు చేశాడు. తాజాగా ది 100 సినిమా చేశాడు. పోలీసు పాత్రలో నటించాడు. ఓ ముగ్గురి అధికారుల జీవితాన్ని క్రోడీకరించి సినిమాగా మార్చామని చెబుతున్నాడు. ఈ సినిమా ఈనెల 11న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా పబ్లిసిటీ కోసం హైదరాబాద్ లోని మెట్రో స్టేషన్ల చుట్టూ టీమ్ తో తిరుగుతున్నాడు.
తెలంగాణ రాష్ట్రంలోని కోటపల్లి మండలంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలికల పట్ల అసభ్యంగా నడుచుకున్నాడు. దీంతో బాలికలు తమ తల్లిదండ్రులు, కుటుబ సభ్యులతో కలిసి హెచ్ఎంకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. పైగా, వేధింపుల విషయం బయటకు చెబితే టీసీ ఇచ్చి స్కూలు నుంచి పంపించే వేస్తామంటూ హెచ్ఎం బెదిరిస్తున్నారని బాధిత బాలికలు ఆరోపిస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
కోవిడ్ సమయంలో కేరళలో విదుర పోలీస్ స్టేషన్ లో యువతలో ధైర్యాన్ని నింపి, వారి కలలు, ఆశయాలు పునరుత్తేజం అయ్యేందుకు చేపట్టిన కౌన్సిలింగ్ కార్యక్రమాల స్పూర్తితో "సూత్రవాక్యం" తెరకెక్కింది. భారతదేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 14 దేశాల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈనెల 11న మలయాళ వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా "జినీవెర్స్ మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్" ద్వారా విడుదలవుతోంది. ఇదే సంస్థ "సూత్రవాక్యం" పేరుతోనే తెలుగులోనూ విడుదల చేస్తోంది.
పప్పు రుచిగా లేదనే చిన్న కారణంతో శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్.. ఆకాశవాణి ఎమ్మెల్యే క్యాంటీన్ ఆపరేటర్పై చేయి చేసుకున్నారు. ముందుగా చెంపలు వాయించి ఆపై ముఖం మీద పిడి గుద్దులు గుద్దారు. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డు అవ్వగా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా "రాజు గాని సవాల్". లెలిజాల కమల ప్రజాపతి సమర్పణలో లెలిజాల రవీందర్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 8న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. కాగా, సినిమా టీజర్ ను వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు రిలీజ్ చేశారు. అనంతరం ఫిల్మ్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
విజయ్ దేవరకొండ వృత్తిపరమైన, వ్యక్తిగత కారణాల వల్ల వార్తల్లో నిలుస్తున్నాడు. వృత్తిపరంగా, అతను తన రాబోయే చిత్రం కింగ్డమ్ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఇది జూలై 31న గ్రాండ్ థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నల మధ్య ప్రేమాయణం నడుస్తుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజా ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్గా చెప్పాడు. "నా వయసు 35 సంవత్సరాలు, నేను ఒంటరిగా లేను" అని విజయ్ దేవరకొండ తెలిపాడు.
టిల్లు పాత్రతో వినోదాన్ని పంచి, ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సిద్ధు జొన్నలగడ్డ.. ఇప్పుడు 'బ్యాడాస్'లో కొత్తగా కనిపించబోతున్నారు. నిర్మాతలు టైటిల్ తో కూడిన ఆకర్షణీయమైన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించారు. “If middle finger was a man” అనే బోల్డ్ స్టేట్మెంట్ తో ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది.
నటి సమంతా రూత్ ప్రభు కొంతకాలంగా చిత్రనిర్మాత రాజ్ నిడిమోరుతో ప్రేమలో వున్నట్లు పుకార్లు వస్తున్నాయి. వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన తర్వాత ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. ఇది వారి సంబంధాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఒక మార్గమని అభిమానులు నమ్మేలా చేసింది. మంగళవారం, సమంత తన డెట్రాయిట్, మిచిగాన్కు చేసిన పర్యటన నుండి అనేక ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ కుటుంబంలో గొడవ జరిగింది. ఇది విషాదాంతంగా ముగిసింది. ఇద్దరు కోడళ్ల మధ్య జరుగుతున్న పోట్లాటను ఆపేందుకు ప్రయత్నించిన అత్త, ఆ తోపులాటలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయ విదారక ఘటన బహదూరపుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఏదిపడితే అది చేసేయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. రీల్స్లో చాలామంది మహిళలు రకరకాలుగా చీరలు కడుతూ సోషల్ మీడియాలో పెడుతుంటారు. అయితే తాజాగా ఇన్ఫ్లుయెన్సర్ టర్కీలోని రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశంలో చీర కట్టుకోవడం, చర్చకు దారితీసింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ఇలా పబ్లిక్ వీడియోలు పోస్టు చేయడం సరికాదని వారు అంటున్నారు. అలాగే ఆమె అలా పబ్లిక్ ప్లేసులో చీరకట్టుకోవడం సరికాదని సెక్యూరిటీ గార్డు ఆమెను అక్కడ నుంచి వెళ్ళిపోవాలని కోరడం జరిగింది.
తనకు దక్కని ప్రియురాలు మరెవరికీ దక్కకూడదనే కక్షతో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. ప్రేమ వివాహానికి యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడం, కొద్ది రోజులుగా ఆమె తనను దూరం పెట్టడంతో రగిలిపోయి ప్రియురాలి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు యత్నించాడు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు.
చీరకట్టులో ఉన్న అందం.. ఏ డ్రెస్ వేసుకున్నా రాదు. చీర అంటే ఇష్టపడని అమ్మాయిలు ఉండరు. చీరను రకరకాల స్టైల్లో కట్టుకుని అందంగా రెడీ అవుతుంటారు చాలామంది మహిళలు. పండగైనా, ఫంక్షన్ అయినా, శుభకార్యం అయినా.. అందంగా, ప్రత్యేకంగా, సంప్రదాయంగా కనిపించాలంటే చీర కట్టాల్సిందే. చీరకట్టు భారతీయ సంస్కృతికి అద్దం పట్టే అలంకరణ. అయితే ఈ చీరకట్టుతో విదేశాల్లోనూ వావ్ అనిపించేలా చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లు చేసి వున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో నానాటికీ పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీకి వస్తే రెండు మూడు రోజులకు మించి ఉండబుద్ధి కావడం లేదన్నారు. ఫరీదాబాద్- నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ రోడ్డులో 'ఏక్ పెడ్ మా కే నామ్ 2.0' పేరుతో నిర్వహించిన మొక్కల పెంపకం డ్రైవ్లో ఆయన పాల్గొన్నారు.
గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో బుధవారం వంతెన కూలిపోవడంతో కనీసం ముగ్గురు మరణించగా, ఇంకా చాలా మంది నీటిలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అనేక వాహనాలు మహిసాగర్ నదిలో పడిపోయాయి. ఇంతలో, ఇప్పటివరకు నలుగురిని రక్షించామని, ఆపరేషన్ కొనసాగుతోందని పద్రా పోలీస్ ఇన్స్పెక్టర్ విజయ్ చరణ్ తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో ర్యాగింగ్ భూతాన్ని అరికట్టే దేశగా యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ దృష్టిసారించింది. ఇందులోభాగంగా, కీలక ఆదేశాలు జారీచేసింది. జూనియర్ విద్యార్థులను వేధించేందుకు సీనియర్లు ఏర్పాటు చేసే అనధికారిక వాట్సాప్ గ్రూపులను కూడా ఇకపై ర్యాగింగ్గానే పరిగణించనున్నట్టు స్పష్టంచేసింది. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై యాంటీ - ర్యాగింగ్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
హైదరాబాద్ నగరంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. కల్తీ కల్లు సేవించిన 15 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన అనంతరం అప్రమత్తమైన ఎక్సైజ్ శాఖ అధికారులు పలు కల్లు దుకాణాలను సీజ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలో దారుణం ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు భార్యలు కలిసి భర్తను చంపేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల మేరకు... పిట్టలోనిగూడేనికి చెందిన కాల్వ కనకయ్య (30) అనే వ్యక్తి రెండేళ్ల క్రితం గుజులోతు చిన్నరాజయ్య, జున్నూబాయి దంపతుల కుమార్తె చుక్కమ్మ అలియాస్ శిరీషను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇదే గూడేనికి చెందిన గుజులోతు క్రిష్టమ్మ కుమార్తె గౌరమ్మను కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు.
అహంకారం, ఇతరులను మోసం చేయడం అహంకారంగా ప్రవర్తించి ఇతరులను మోసం చేసే ధోరణి ఉన్నవారు జీవితాంతం పేదవారిగా జీవిస్తారని చాణక్య నీతి శాస్త్రం చెప్తోంది. ఇంకా ఆర్థిక ఇబ్బందులకు గల కారణాలేంటో చాణక్యుల వారు తన నీతి శాస్త్రంలో పేర్కొని వున్నారు. అవేంటంటే.. ఎవరి ఇంట్లోనైనా స్త్రీలను అవమానించినా, చెడుగా ప్రవర్తిస్తే, సంపదతో పాటు, అలాంటి ఇంటి ప్రజలకు పరువు కూడా ఉండదని చాణక్యులు చెప్పారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి స్మారకార్థం ప్రగతిశీల రైతులకు (ఆదర్శ రైతు) అవార్డులు ఏర్పాటు చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి, అమలు చేయడానికి రాజశేఖర్ రెడ్డి పేరు మీద ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
వర్షాకాలంలో నల్ల మిరియాలను ఆహారంలో భాగం చేసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతిరోజూ మన ఆహారంలో నల్ల మిరియాలను చేర్చితే ఆరోగ్యంపై మంచి ప్రభావం పడుతుంది. నల్ల మిరియాలు జలుబు, దగ్గును దరిచేరనివ్వవు. శ్వాస సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి. నల్ల మిరియాల్లో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి మన శరీరాన్ని హానికర బ్యాక్టీరియా నుంచి కాపాడతాయి. ముఖ్యంగా జీర్ణ సంబంధిత ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయి.