హైదరాబాద్: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అఫ్ ఇండియా ఏప్రిల్ 2025లో మరో మైలురాయిని అధిగమించింది, మొత్తం పెట్టుబడిదారుల ఖాతాల సంఖ్య అంటే, యూనిక్ క్లయింట్ కోడ్లు 22 కోట్ల మార్కును దాటింది, ఇది అక్టోబర్ 2024లో 20 కోట్ల దాటిన ఆరు నెలల్లోనే గణనీయంగా పెరిగింది. విడిగా చెప్పాల్సి వస్తే, ప్రత్యేకమైన నమోదిత పెట్టుబడిదారుల సంఖ్య 11.3 కోట్లు (మార్చి 31, 2025 నాటికి), జనవరి 20, 2025 నాటికి 11 కోట్ల (110 మిలియన్లు) దాటింది.
నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, ప్రదీప్ చిలుకూరి, అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ రూపొందించిన 'అర్జున్ S/O వైజయంతి' సినిమాకి U/A సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు. నేడు హైదరాబాద్ లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు ఎన్.టి.ఆర్. హాజరయ్యారు. ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. మదర్ అండ్ సన్ డ్రామా తో రూపొందింది.
ఇటీవలే రెండు దశాబ్దాల సినీ కెరీర్ను పూర్తి చేసుకున్న టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా సక్సెస్ఫుల్గా తన కెరీర్ను కొనసాగిస్తుంది. ముఖ్యంగా, స్పెషల్ సాంగ్స్లో మెరుస్తోంది. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన తమన్నాకు ఐటెం సాంగ్స్లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. తమ సినిమాలో తమన్నా సాంగ్ ఉంటే హిట్ అయినట్టేనని నిర్మాతలు, దర్శకులు భావిస్తున్నారు.
బొమ్మరిలు, ఆరెంజ్ సినిమాల దర్శకుడు భాస్కర్ కొంత గేప్ తీసుకుని జాక్ సినిమా తీశాడు. సిద్దు జొన్నలగడ్డతో రూపొందించిన ఈ సినిమా పూర్తిఎంటర్ టైన్ మెంట్ గా వుంటుందని రిలీజ్ కు ముందు భారీ ప్రమోషన్ చేశారు. అసలు పాయింట్ అనేది దాచేసి వినోదం అంటూ చెప్పారు. అయితే విడుదల తర్వాత ఈ సినిమా సీరియస్ పాయింట్ చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. కానీ దాన్ని వినోదం చూస్తారనున్న దర్శకుడి అంచనా తారుమారుఅయింది.
వేసవి సెలవులు రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్టణం నుంచి బెంగుళూరు, తిరుపతి, కర్నూలు సిటీలకు ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 13 నుంచి మే నెలాఖరు వరకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం ప్రత్యేక వీక్లీ రైళ్లను నడుపనున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది.
ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో వ్యూస్ పిచ్చి ఎక్కువైంది. అందరికంటే విభిన్నంగా చేయాలనే తపనతో ఏదేదో పిచ్చి చేష్టలు చేస్తున్నారు. దీనితో అవి కాస్తా ప్రాణాల మీదికి వస్తున్నాయి. తాజాగా ఓ టీనేజ్ యువతి రీల్స్ చేయడం కోసం కదిలే రైలును ఎంచుకున్నది.తన ఫోనుని తన తోటి ప్రయాణికుడికి ఇచ్చింది. తను వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందికి దిగేటప్పుడు వీడియో తీయాలంటూ చెప్పి రైలు వేగంగా వెళ్తున్న సమయంలో రైలు ద్వారం వద్దకు వచ్చేసింది. ఐతే వీడియో తీస్తున్న వ్యక్తి... ఓ పిచ్చిపిల్లా... ట్రైన్ స్పీడుగా వెళ్తోంది. దూకొద్దూ... దూకొద్దూ అని అంటూ వున్నప్పటికీ ఆమె దూకేసింది. వీడియో తీస్తున్న వ్యక్తి అది చూసి షాకయ్యాడు. ఐతే అలా దూకేసిన యువతి ప్రాణాలతో వున్నదా లేదా అనేది మాత్రం తెలియరాలేదు.
మాస్ జాతర పేరుతో రవితేజ ఈ యాక్షన్ డ్రామా కొత్త చిత్రం రూపొందుతోంది. దీనిని భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. మేకర్స్ ప్రమోషన్లను ప్రారంభించారు, మరియు ఈ నెల 14న కొత్త పాటను విడుదల చేయనున్నారు. అందుకు కర్టెన్ రైజర్ గా రవితేజ నటించిన గత సినిమాలోని మ్యూజిక్ ను విడుదల చేశారు.
హీరో ప్రదీప్ మాచిరాజు లేటెస్ట్ మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం చేశారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్టైనర్లో దీపికా పిల్లి కథానాయికగా నటించింది. ఏప్రిల్ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా ప్రదీప్ పలు విషయాలు తెలిపారు.
మే నెలలో సమంత పెళ్లి చేసుకోబోతోందంటూ టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. ఇక ఈ వార్త ఎప్పటిలాగే గాలివార్త అవుతుందో లేదంటే వాస్తవరూపం దాల్చుతుందో చూడాల్సి వుంది. ఇక అసలు విషయానికి వస్తే... సమంత తాజాగా తన ఇన్స్టా పేజీలో ఆసక్తికర వ్యాఖ్యలతో తన ఫోటోలను జత చేస్తూ పెట్టింది. ఈ క్యాప్షన్స్ మొత్తం అర్థం చూస్తే... తన శక్తిపై తనకు నమ్మకం వుందనీ, తన నియంత్రణ లేని విషయాల గురించి అస్సలు పట్టించుకోనని తేటతెల్లం చేసింది.క్యాప్షన్స్ సంగతి అలా పెడితే ఈ ఫోటోల్లో సమంత మరీ స్లిమ్గా కనబడుతోంది. భుజాల వద్ద బోన్స్ కనబడుతున్నాయంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై బత్తుల కోటేశ్వరరావు నిర్మాతగా నూతన నటుడు పవన్ కళ్యాణ్ తెరంగేట్రం చేస్తున్నారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఈ మూవీని శనివారం నాడు ఘనంగా ప్రారంభించారు. ఈ చిత్ర ప్రారంభ ముహుర్తానికి వడ్డవల్లి వెంకటేశ్వర రావు(బుల్లబ్బాయ్) క్లాప్ కొట్టగా, బేబీ ఏముల ధరణి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదంఈ వారం కొంతమేరకు అనుకూలం. ఆలోచనల్లో మార్పు వస్తుంది. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. దుబారా ఖర్చులు నియంత్రించుకుంటారు. వాయిదాల చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఒక సంఘటన మీపై ప్రభావం చూపుతుంది. ముఖ్యుల కలయిక వీలుపడదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఉద్యోగస్తులు మరింత శ్రద్ధగా పనిచేయాలి. అధికారుల తీరును గమనించి మెలగండి. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి.
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం సంప్రదింపులతో తీరిక ఉండదు. అనాలోచిత నిర్ణయాలు తగవు. చేపట్టిన పనులు సాగవు. బంధువులతో సంభాషిస్తారు. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
భారతదేశంలోని ప్రముఖ నోట్బుక్, స్టేషనరీ బ్రాండ్ అయిన ఐటిసి యొక్క క్లాస్మేట్, న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో క్లాస్మేట్ ఆల్ రౌండర్ (సిఏఆర్) కార్యక్రమం యొక్క మూడవ ఎడిషన్ను ముగించింది. ఈ కార్యక్రమం భారతదేశం అంతటా 60 మంది అసాధారణ విద్యార్థులను ఒకచోట చేర్చింది, వారు రెండు కఠినమైన ముందస్తు రౌండ్ల పరీక్షల తర్వాత జాతీయ ఫైనలిస్టులుగా నిలిచారు. ఈ ఫైనలిస్టులు ప్రతిష్టాత్మకమైన ఆల్ రౌండర్ టైటిళ్ల కోసం పోటీ పడ్డారు. రెండు విభాగాలలో - జూనియర్ కేటగిరీ (6-8 తరగతులు), సీనియర్ కేటగిరీ (9-12 తరగతులు) ప్రాతినిధ్యం వహించిన ఈ ఫైనల్ లో ఎనిమిది మంది విద్యార్థులు విజేతలుగా నిలిచారు.
బాలీవుడ్ యువ నటి జాన్వీ కపూర్కు బిర్లా వారసురాలు అత్యంత ఖరీదైన బహమతిని ప్రదానం చేశారు. ఈ బాలీవుడ్ బ్యూటీకి అత్యంత ప్రేమతో రూ.5 కోట్ల విలువ చేసే లంబోర్ఘిని కారును బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అయితే, జాన్వీకి ఇంత కాస్ట్లీ బహుమతి బిర్లా వారసురాలు ఎందుకు ఇచ్చారన్న చర్చ ఇపుడు సోషల్ మీడియా వేదికగా సాగుతోంది. ఈ బహుమతి ఇచ్చింది ఎవరో కాదు.. ప్రముఖ వ్యాపారవేత్త కుమార మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లా.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ చట్టం వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఆందోళనకు దారితీసింది. ఈ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అనేక మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేసిన పని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ప్రయాణిస్తున్న మార్గంలో ఓ వ్యక్తి రద్దీగా ఉన్న రోడ్డుపై ఆవుకు ఓ రొట్టె ముక్కను విసిరివేశాడు. దీన్ని చూసిన ముఖ్యమంత్రి రేఖా గుప్తా తన కాన్వాయ్ ఆపించి, కారు దిగి ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి.. ఇంకోసారి అలా చేయొద్దని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చర్యల వల్ల మూగజీవులతో పాటు వాహనదారులకూ ప్రమాదమేనన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో ఆమె షేర్ చేశారు.
స్త్రీ జీవితంలో రుతువిరతి లేదా మెనోపాజ్ అనేది ఒక సహజ దశ. తరచుగా వేడి ఆవిర్లు, మూడ్ స్వేచ్చలు, రాత్రి చెమటలు, వ్యక్తిగత ప్రదేశం పొడిబారడం, అలసట వంటి అసౌకర్య లక్షణాలు ఉంటాయి. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఒక సాధారణ చికిత్సగా ఉన్నప్పటికీ, చాలా మంది మహిళలు ఉపశమనం కోసం సహజ నివారణల వైపు మొగ్గు చూపుతున్నారు. అటువంటి శక్తివంతమైన ఆయుర్వేద మూలికలలో ఒకటి శతావరి. రుతువిరతి సమయంలో ఈ సహజ మూలిక వాడితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
అయోధ్య బాలరాముడుని దర్శించుకునేందుకు వచ్చిన కొందరు మహిళా భక్తులు స్నానం చేస్తుండగా వారిని వీడియో తీసాడు ఓ కామాంధుడు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అతిథిగృహంలో గదులను బుక్ చేసుకోగా, ఆ గదులకు ఆనుకుని నిర్మించిన బాత్రూంల పైకప్పు ఎక్కి వాటి నుంచి వీడియో తీస్తున్నాడు.పూర్తి వివరాలు ఇలా వున్నాయి. శుక్రవారం నాడు వారణాసి నుంచి ఐదుగురు మహిళలు అయోధ్య వచ్చారు. వీరిలో ఓ మహిళ ఉదయం 6 గంటలకు స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లింది. అక్కడ ఆమె స్నానం చేస్తున్న సమయంలో బాత్రూం పైకప్పు పైన మనిషికి సంబంధించి నీడ వుండటాన్ని గమనించింది.
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం "అర్జున్ రెడ్డి". ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన భామ షాలిని పాండే. తొలి చిత్రంతోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో ఆమె స్టార్ హీరోయిన్ రేంజ్కు చేరుకుంటారని ప్రతి ఒక్కరూ భావించారు. అయితే, ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలు పెద్దగా హిట్ కాలేదు. దీంతో ఆమె స్టార్ రేంజ్ను సొంతం చేసుకోవడంలో వెనుకబడిపోయారు. ప్రస్తుతం హిందీ, తమిళంతో పాటు కొన్ని వెబ్ సిరీస్ చిత్రాల్లో నటిస్తున్నారు.
"ఒకే దేశం - ఒకే ఎన్నిక" పేరుతో నిర్వహించాలని భావించే జమిలి ఎన్నికలపై కొన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించడంలో రాజకీయ కోణం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఒకే దేశం - ఒకే ఎన్నికపై తిరుపతిలో జరిగిన మేధావుల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జమిలి ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది అనేది కేవలం అపోహ మాత్రమేనని చెప్పారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో టీం ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న వీడియో క్లిప్ను ఉపయోగించి, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక సృజనాత్మకమైన, ఆలోచింపజేసే పోస్ట్ను పంచుకున్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో త్వరగా వైరల్ అయింది.ఆ వీడియోలో, "రన్ మెషిన్" అని తరచుగా పిలువబడే విరాట్ కోహ్లీ, ఒక బౌలర్ నుండి భయంకరమైన డెలివరీని ఎదుర్కొంటున్నప్పుడు హెల్మెట్ ధరించి కనిపిస్తాడు. తీవ్రమైన గాయాలను నివారించడంలో భద్రతా గేర్, కీలక పాత్రను వివరిస్తూ, బంతి అతని హెల్మెట్ను బలంగా తాకింది.
ఉత్తరప్రదేశ్ - మురాదాబాద్ తీర్థంకర మహావీర్ విశ్వవిద్యాలయంలో పిడుగుపాటుకు గురైన ఐదుగురు విద్యార్థులు ఆస్పత్రి పాలైనారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చోవడంతో ఐదుగురు విద్యార్థులపై పిడుగు పడింది. ఈ ఘటనలో తీవ్రగాయాలైన ఐదుగురు విద్యార్థులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి ఆరోగ్యంగా విషమంగా వుందని.. మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా వున్నట్లు వైద్యులు వెల్లడించారు. కాలిన గాయాలతో విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం అందుకున్న పక్బాడా పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఐదుగురు విద్యార్థులు టీఎంయూ క్యాంపస్లోని న్యూ హాస్టల్ వర్ధమాన్ భవన్లో నివసిస్తున్నారు.
భారతీయ సినిమా పరిశ్రమలో గత కొన్ని దశాబ్దాలుగా విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ, సినీ పరిశ్రమ ఎదుగుదలకు కృషి చేస్తున్న కమల్ హాసన్ ఇలా భవిష్యత్తుని శాసించబోతోన్న ఏఐ రీసెర్చ్ సెంటర్ను సందర్శించడంతో మరిన్ని విప్లవాత్మక మార్పుల్ని తీసుకు రాబోతోన్నారు.
ఢిల్లీలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆదివారం తలపడనున్నాయి. ఈ హై స్టేక్స్ మ్యాచ్ కోసం సన్నాహాల్లో భాగంగా, ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాళ్లు ఇప్పటికే ఢిల్లీకి చేరుకుని శనివారం ఇంటెన్సివ్ ప్రాక్టీస్ సెషన్ నిర్వహించారు. అయితే సెషన్ జరుగుతుండగా, వాతావరణ పరిస్థితుల్లో అకస్మాత్తుగా మార్పు రావడంతో స్టేడియం మొత్తం దుమ్ము, ధూళి కమ్ముకుంది. బలమైన గాలులు భూమి గుండా వీచడంతో వాతావరణం వేగంగా క్షీణించింది. దానితో పాటు భారీ ధూళి తరంగం మొత్తం పొలాన్ని ముంచెత్తింది. ఈ సందర్భంలో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఆ సంఘటన స్థలంలో ఉన్నాడు. మారుతున్న పరిస్థితులకు వెంటనే స్పందించాడు. పరిస్థితి గమనించిన రోహిత్ శర్మ తన స్వరాన్ని పెంచి, తన తోటి ఆటగాళ్లను మైదానం నుండి వెనక్కి వెళ్ళమని అరిచాడు.
యూపీఐ పేమెంట్స్ సేవలకు మరోమారు అంతరాయం కలిగింది. దేశ వ్యాప్తంగా ఈ సేవలు నిలిచిపోయాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్లు పని చేయలేదు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొందరు వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగొచ్చని హెచ్చరించాయి. ఈ క్రమంలో రైల్వే శాఖను నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. డ్రోన్, ఐఈడీతో దాడులు జరగొచ్చని వెల్లడించాయి. నదీ మార్గాల్లో ఉగ్రవాదులు దేశంలోకి చొరబడవచ్చని హెచ్చరించాయి. ముంబైకి కీలక కుట్రదారు తహవ్వుర్ రాణాను అమెరికా నుంచి భారత్కు తీసుకొచ్చి విచారిస్తున్న తరుణంలో ఈ అలెర్ట్ చేయడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్య, ఐటీ శాఖామంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా శనివారం రిలీజ్ చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికార https://resultsbie.ap.gov.in వెబ్సైట్లో చూసుకోవచ్చని తెలిపారు. అలాగే, మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 హాయ్ అనే సందేశం పంపడం ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చని చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’ లో రామరామ.. పాటను హనుమత్ జయంతి సందర్భంగా నేడు విడుదల చేశారు. రామ రామ..రామ.. అంటూ శంకర్ మహదేవన్, లిప్సిక పాడిన ఈ పాటలో చిరంజీవి బ్రుందం తన శైలిలో పండించారు. ‘జై శ్రీరామ్’ అనే చిరు వాయిస్తో పాట ప్రారంభమవుతుంది. ‘రామ.. రామ..’ అంటూ సాగే ఈ పాటను కీరవాణి స్వరపరచగా.. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్గా నటిస్తున్నారు.
ఈ రోజుల్లో, ప్రతి ఆఫీసులో కాఫీ మెషిన్ ఉండటం సర్వసాధారణమైపోయింది. కాఫీ తాగితే, ఇది మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా, మీకు శక్తిని కూడా ఇస్తుంది. ఆఫీసు కాఫీ మెషిన్ నుండి బ్లాక్ కాఫీ, మిల్క్ కాఫీ, కాపుచినో తాగడానికి ఇష్టపడతారు. కానీ ఆఫీసు కాఫీ మెషిన్ నుండి రోజుకు చాలాసార్లు కాఫీ తాగడం వల్ల మీ ఆరోగ్యానికి హాని కలుగుతుందని మీకు తెలుసా? అవును, మెషిన్ కాఫీ తాగడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఇటీవలి అధ్యయనం నివేదించింది. ఇటీవల ప్రచురించబడిన ఒక అధ్యయనంలో ఈ షాకింగ్ సమాచారం వెల్లడైంది. అంటే, ఇంట్లో తయారుచేసిన కాఫీ కంటే ఆఫీసులో మెషిన్ కాఫీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే హానికరమైన సమ్మేళనాలను ఎక్కువగా కలిగి ఉంటుందని ఒక కొత్త అధ్యయనం కనుగొంది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, సినీ నటి విజయశాంతి భర్త శ్రీనివాస్కు ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. తనకు డబ్బులు ఇవ్వకంటే కసితీరా నరికి చంపుతానంటూ బెదిరించాడు. దీంతో ఆయన బంజారా హిల్స్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు విచారణ జరుపుతున్నారు.
జాతకాల నేపథ్యంలో సారంగపాణి జాతకం రాబోతుంది. హీరో ప్రియదర్శి, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ చాలా ఇష్టపడి చేసిన సినిమా ఇది. ఇంటిల్లిపాదినీ కడుపుబ్బా నవ్వించే వినోదాత్మక చిత్రమిది . యూత్ ను ఆకట్టుకునే క్రైమ్ కామెడీ అంశాలు కూడా ఇందులో ఉన్నాయనీ, ఈ నెల 25 న సమ్మర్ కూల్ స్పెషల్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. విద్య- సమాచార సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా ఈ ప్రకటన చేశారు, విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్: https://resultsbie.ap.gov.in లో యాక్సెస్ చేయవచ్చని పేర్కొన్నారు. అదనంగా, విద్యార్థులు మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కు "హాయ్" సందేశాన్ని పంపడం ద్వారా కూడా తమ ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చని ఆయన తెలియజేశారు.ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఉత్తీర్ణత 70 శాతం, ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 83 శాతానికి చేరుకుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రభుత్వ, ప్రభుత్వ-సహాయక విద్యా సంస్థలలో ఉత్తీర్ణత రేటులో గణనీయమైన మెరుగుదల ఉందన్నారు.
ఇద్దరు వేరువేరు లక్ష్యాలతో వున్నవారు ప్రేమించుకుంటే ఏవిధమైన పరిణామాలు వస్తాయనే పాయింట్ తో డియర్ ఉమ చిత్రం రూపొందింది. సుమయ రెడ్డి హీరోయిన్గా, నిర్మాతగా, రచయితగా వున్న ఈ చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. లైన్ ప్రొడ్యూసర్గా నగేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా నితిన్ రెడ్డి వ్వవహరించారు.
సభ్య సమాజంలో మానవ సంబంధాలు నానాటికీ మంటకలిసిపోతున్నాయి. ఆస్తులు కోసం సొంత మనుషులనే అత్యంత కిరాతకంగా హత్య చేస్తున్నారు. తాజాగా ఓ సవతి తల్లి ఆస్తి పోతుందనే భయంతో కుమార్తెను హత్య చేసి నదిలో పాతిపెట్టింది. ఇది నాలుగు నెలల తర్వాత వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇటీవల సింగపూర్లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఈ సంఘటనకు ప్రతిస్పందనగా, సింగపూర్ ప్రభుత్వం ఒక ముఖ్యమైన చర్య తీసుకుంది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ను కాపాడిన వారిని అధికారికంగా సత్కరించింది.అధికారిక సమాచారం ప్రకారం, ఈ సంఘటనలో పదహారు మంది పిల్లలు, ఆరుగురు పెద్దలు చిక్కుకున్నారు. వారిని సింగపూర్లోని భారత ప్రవాస సమాజ సభ్యులు రక్షించారు. ఈ వ్యక్తులందరినీ వారి ధైర్యసాహసాలకు సింగపూర్ ప్రభుత్వం గౌరవించింది.
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నోటిఫికేషన్ విడుదల చేసింది. పాఠశాల విద్యా శాఖ అందించిన వివరాల ప్రకారం, టెట్ పరీక్షలు జూన్ 15 నుండి జూన్ 30 వరకు నిర్వహించబడతాయి. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం ఏప్రిల్ 15న అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచబడుతుంది. ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్షలు జూన్ 15 నుండి జూన్ 30 వరకు జరుగుతాయి మరియు ఫలితాలు జూలై 22న విడుదల చేయబడతాయి. ఒక పేపర్కు హాజరయ్యే అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.500, రెండు పేపర్లకు హాజరయ్యే అభ్యర్థులకు రూ.1,000గా నిర్ణయించబడింది.
రెండు రోజుల క్రితం తన భార్యకు ఫోన్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పాడనే ఆరోపణలతో ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఆమె ఫిర్యాదు ప్రకారం, భర్త మహిళ తండ్రి ఫోన్కు ట్రిపుల్ తలాక్ చెప్పమని ఫోన్ చేశాడు. మహిళ ఫిర్యాదుపై ఐపీసీ సెక్షన్లు 498A, 406, 34 అలాగే ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) చట్టంలోని నిబంధనల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 చివరి నాటికి ప్రజా రవాణా కోసం 750 ఎలక్ట్రిక్ బస్సులను నడపనుంది. ప్రధానమంత్రి ఈ-బస్ సేవా పథకంలో భాగంగా, కేంద్రం ఆంధ్రప్రదేశ్కు 750 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. ఇవి ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 11 డిపోల నుండి నడుస్తాయి. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కటి 100 బస్సులు, అమరావతి, కర్నూలు, రాజమండ్రి, అనంతపురం, కడప, కాకినాడ, తిరుపతి జిల్లాల్లో ఒక్కొక్కటి 50 బస్సులు నడపాలి. ఈ పథకంలో భాగంగా, కేంద్రం ఈ-బస్సులను తయారు చేసే పనిని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. వారు దశలవారీగా ఏపీకి బస్సులను డెలివరీ చేస్తారు. ఈ బస్సులను ఈ పథకం కింద కేంద్రం నిర్ణయించిన ప్రైవేట్ ఏజెన్సీలు నడుపుతాయి.
కొందరు యువకులు తమ ప్రియురాళ్లను వదిలివుండలేకపోతున్నారు. ఇందుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు తాను ఉండే హాస్టల్కు తన ప్రియురాలిని తీసుకెళ్లేందుకు పెద్ద సాహసమే చేశాడు. తన ప్రియురాలిని ఓ సూట్ కేసులో బంధించి తన గదికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే, అతని ప్రయత్నం విఫలమై చివరకు సెక్యూరిటీ సిబ్బందికి దొరికిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
కోట్లాది మంది హిందువులకు పరమపవిత్రమైన ప్రదేశంగా అయోధ్య నగరం విరాజిల్లుతుంది. అలాంటి అయోధ్య నగరంలో ఉండే ఓ అతిథి గృహంలోని బాత్రూమ్లో ఓ మహిళ స్నానం చేస్తుంటే ఓ వ్యక్తి మొబైల్ ఫోనులో వీడియోను చిత్రీకరించాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
నల్గొండలో అర్థరాత్రి హత్య కలకలం రేపింది. శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగుల ముఠా నల్గొండ పట్టణంలోని రామగిరి ప్రాంతంలో మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్, స్టూడియో యజమానిని హత్య చేసింది. ఈ నేరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగింది. వేట కత్తులతో సాయుధులైన ముసుగు ధరించిన దుండగులు కలర్ ల్యాబ్ యజమాని సురేష్ (37) పై దాడి చేసి కత్తితో దాడి చేశారు. తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించి, అతను ల్యాబ్ వెనుక గదిలో దాక్కునేందుకు ప్రయత్నించాడు. కానీ దుండగులు గదిలోకి చొరబడి తలుపు తెరిచి అతడిని హతమార్చారు.
దేశంలోని పలు ముఖ్య నగరాల్లో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ రైళ్లను కొందరు ప్రేమికులు, యువతీయువకులు తమ ప్రేమ కలాపాలకు చిరునామాగా వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా, తమ విశృంఖల చర్యలతో ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కల్పిస్తున్నారు. తాజాగా బెంగుళూరు మెట్రో రైళ్లలో ఢిల్లీ మెట్రో కల్చర్ పాకింది. ప్రేమికులిద్దరూ రెచ్చిపోయి ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
జియో హాట్స్టార్ 20 కోట్ల చెల్లింపు సబ్స్క్రైబర్ బేస్ను సాధించి, నెట్ఫ్లిక్స్- ప్రైమ్ వీడియో తర్వాత మూడవ అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్గా అవతరించింది. ఈ మైలురాయి సాధనకు ప్రధానంగా కొనసాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ మ్యాచ్ల మల్టీ లాంగ్వేజ్ కవరేజ్ దోహదపడింది. జియో హాట్స్టార్ అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో స్ట్రీమింగ్ ఓటీటీ ప్లాట్ఫామ్లలో ఒకటిగా మారడంతో, మార్కెట్ లీడర్ల మధ్య పోటీ మరింత తీవ్రమవుతోంది. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ఇప్పటికే తమ సబ్స్క్రైబర్ బేస్లను నిలుపుకోవడానికి, విస్తరించడానికి తమ వ్యూహాలను పదును పెట్టాయి.
ఇటీవలికాలలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండాపోతోంది. కేవలం పోకిరీలు, అకతాయిలు, ప్రేమోన్మాదులు మాత్రమే కాదు... విద్యావంతులు, పోలీస్ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం మహిళలను వేధిస్తున్నారు. ముఖ్యంగా చట్టాన్ని పరిరక్షిస్తూ సమాజంలోని పౌరులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే నేరాలు ఘోరాలకు పాల్పడుతున్నారు. తాజాగా గతంలో ఏర్పడిన ముఖపరిచయంతో న్యూడ్ ఫోటోలు పంపాలంటూ ఓ మహిళను ఓపెన్ జైలు జైలర్ వేధింపులకు పాల్పడ్డాడు. తాజాగా ఓ జైలు అధికారి కూడా ఓ మహిళను వేధించిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ తెలంగాణ విభాగం తీవ్రంగా ఖండించింది. పవన్ కళ్యాణ్ సీరియస్ రాజకీయ నాయకుడు కాదని, ఆయన ఉప ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరమని కల్వకుంట్ల కవిత తన వ్యాఖ్యలలో పేర్కొన్నారు.ఆమె వ్యాఖ్యలపై జనసేన తీవ్రంగా స్పందిస్తూ, కల్వకుంట్ల కవితకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని తెలంగాణ జన సేన పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ అన్నారు.
ఏప్రిల్ 15 నుండి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనలతో భారత రైల్వే తత్కాల్ రైలు టికెట్ బుకింగ్ సమయాలను సవరించిందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. అటువంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరింది. ఏసీ లేదా నాన్-ఏసీ తరగతులకు ప్రస్తుత తత్కాల్ లేదా ప్రీమియం తత్కాల్ బుకింగ్ షెడ్యూల్లలో ఎటువంటి మార్పులు చేయలేదని ఇది ధృవీకరించింది.
అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణానికి అందుబాటులో ఉండే రైలు టిక్కెట్లు తత్కాల్. ఇందులో తత్కాల్, ప్రీమియర్ తత్కాల్ అనే రెండు రకాలైన టిక్కెట్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. తత్కాల్ టిక్కెట్ల ధర సాధారణ టిక్కెట్ల కంటే కాస్త ఎక్కువగాను, ప్రీమియం తత్కాల్ టిక్కెట్ల ధరలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఈ టిక్కెట్లను ప్రయాణానికి ఒక రోజు ముందు మాత్రమే రిజర్వు చేసుకునే వెసులుబాటు ఉంది. ఇందుకోసం నిర్ధిష్ట సమయాన్ని రైల్వే శాఖ కేటాయించింది. ఈ నేపథ్యంలో ఈ తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ సమయం మారిందంటూ ప్రచారం సాగుతోంది.
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో శుక్రవారం నాడు నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) కు మరో దెబ్బగా, 22 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. ములుగు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ములుగు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ పి. శబరీష్ ముందు మావోలు తమ ఆయుధాలను వదులుకుని లొంగిపోయారు. వారిలో నలుగురు ఏరియా కమిటీ సభ్యులు (ACMలు), ఒక పార్టీ సభ్యుడు ఉన్నారు. మిగిలిన వారు మిలీషియా సభ్యులు. ఏసీఎంలకు వారి పునరావాసం కోసం ఒక్కొక్కరికి రూ.4 లక్షలు అందజేస్తామని ఎస్పీ ప్రకటించారు. పార్టీ సభ్యుడికి రూ.1 లక్ష, ఇతరులకు రూ.25,000 చొప్పున అందజేయనున్నారు.
శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన అందించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీరాముని ఆదర్శాలతో పాలించి, రామరాజ్యంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమన్నారు. ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి వారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఆయన రాములవారి ఆశీస్సులతో రాష్ట్రాన్ని సుభిక్షంగా మారుస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఎనిమిది వికెట్ల తేడాతో అలవోకగా విజయం సాధించింది. 104 పరుగులతో లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా జట్టు 10.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లు సునీల్ నరైన్ (44), డికాక్ (23) రాణించారు. చెన్నై బౌలర్లలో అన్షుల్, నూర్ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో ఓడిపోవడంతో ఈ సీజన్లో చెన్నై జట్టుకు ఇది వరుసగా ఐదో ఓటమి కావడం గమనార్హం.