మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కనుక ఉన్నన్నాళ్లూ దుఃఖానికి దూరంగా ఆనందాలకు దగ్గరగా వుంటూ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ వుండాలి. ఎందుకంటే ఈమధ్య కాలంలో చూస్తూ చూస్తూనే గుండెపోటుతో కుప్పకూలి మరణిస్తున్నవారి సంఖ్య అధికమవుతోంది. అసలు విషయానికి వస్తే... పరిణీత జైన్ తన సోదరి పెళ్లిలో సంతోషంగా నృత్యం చేస్తుండగా, కొన్ని సెకన్లలోనే ఆమెకు గుండెపోటు వచ్చింది. దాంతో ఆమె నృత్యం చేస్తుండగానే స్టేజి పైన కుప్పకూలిపోయి నిర్జీవంగా మారిపోయింది. పెళ్లి ఆనందం అంతా శోకసంద్రంగా మారింది. కనుక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ వుండాలి.

బ్రిటిష్ సింగర్ ఎడ్ షీరన్ బెంగళూరులోని చర్చ్ స్ట్రీట్‌లో షేప్ ఆఫ్ యూ పాటను పాడారు. అయితే ముందస్తు అనుమతి లేకుండా లైవ్ ప్రదర్శన చేపట్టారంటూ ఓ పోలీసు ఎంటరై ఎడ్ షీరన్ పాడుతుండగానే మైక్ వైర్ తీసివేశాడు. ఈ వ్యవహారం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఈ బ్రిటిష్ సింగర్ ఎడ్ షీరన్ ప్రస్తుతం భారతదేశ పర్యటనలో ఉన్నాడు. అతను ఇప్పటికే హైదరాబాద్, చెన్నైలలో తన ప్రదర్శనలు ఇచ్చాడు. చెన్నైలో జరిగిన మ్యూజిక్ ప్రోగ్రామ్‌లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్.రెహమాన్‌తో కలిసి ఎడ్ షీరన్ క్లాసిక్ ఊర్వశి సాంగ్‌ను పాడారు. ఇక తాజాగా చర్చ్ స్ట్రీట్‌లో పాడటంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "సంతాన ప్రాప్తిరస్తు".ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ హీరోగా "ఏబీసీడీ" సినిమా, రాజ్ తరుణ్ తో "అహ నా పెళ్లంట" అనే వెబ్ సిరీస్ రూపొందించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా తెరకెక్కుతోంది.