Shorts

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మునిసిపాలిటీల పరిధిలోని 2586 వార్డులకు, 7 కార్పొరేషన్ల పరిధిలోని 414 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. శుక్రవారం నాడు కౌంటింగ్ ప్రారంభమైంది. లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ తన హవా సాగిస్తోంది. ఇప్పటివరకూ కాంగ్రెస్ 441 మునిసిపల్ వార్డులోలనూ, బీఆర్ఎస్ 236 స్థానాల్లోనూ, భాజపా 63 స్థానాల్లోనూ, ఇతరులు 75 స్థానాల్లో విజయం దిశగా సాగుతున్నారు.మొత్తమ్మీద పుర, నగర ప్రజలు రేవంత్ రెడ్డి సర్కారుకే మొగ్గు చూపినట్లు కనబడుతోంది. 116 మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ 13 స్థానాల్లోనూ, బీఆర్ఎస్ 4 స్థానాల్లో విజయం దిశగా సాగుతున్నాయి. మధ్యాహ్నానికి ఫలితాలు దాదాపు రావచ్చు.

పాకిస్తాన్ దేశంలో జరిగే రాజకీయ పరిణామాలు గురించి వేరే చెప్పక్కర్లేదు. అధికారంలో వున్నప్పుడు ఒక్కొక్కరు చెలరేగిపోతుంటారు. దిగిపోయాక గద్దెనెక్కినవారు అంతకుముందటి నాయకలపై కసి తీర్చుకుంటారు. ఇప్పుడు అదే పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వ్యవహారంలోనూ జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆడియాలో జైల్లో వున్న ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తున్నట్లు వుందని చెప్పుకుంటున్నారు. ఇమ్రాన్ కంటిచూపు క్రమంగా సన్నగిల్లుతోందట. కుడి కంటి చూపు దాదాపు 85 శాతం పోయిందనీ, కేవలం 15 శాతం మాత్రమే మిగిలి వున్నట్లు వైద్య నివేదికలు చెబుతున్నట్లు కోర్టు నియమించిన న్యాయవాది వెల్లడించారు.

ఓట్స్‌లో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా వున్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా అధిక బరువు తగ్గవచ్చు. ఇంకా వీటి ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.ఓట్స్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.ఓట్స్ పోషకాలతో నిండి వుంటాయి, శక్తివంతమైన ఫైబర్ బీటా-గ్లూకాన్‌తో సహా పిండి పదార్థాలు, ఫైబర్‌లు వుంటాయి.యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కనుక ఓట్స్ తింటుండాలి.ఓట్స్‌లో బీటా-గ్లూకాన్ అనే శక్తివంతమైన కరిగే ఫైబర్ ఉంటుంది.ఓట్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగలవు, మంచి కొలెస్ట్రాల్‌ను దెబ్బతినకుండా కాపాడతాయి.ఓట్స్ రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరుస్తుంది.