భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధంమొదలైంది. దీంతో ఇరు దేశాలమధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వాతావరణం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. దీంతో గత కొన్ని రోజులుగా దేశంలో జరుగుతున్న ఐపీఎల్ టోర్నీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పూర్తిగా రద్దు చేసింది.
శ్రీవిష్ణు, వెన్నెల కిశోర్ ఓ బ్యాంక్ లో ఉద్యోగులు. తనను ఎవరూ ప్రేమించడలేదని దేవుడికి విన్నవించుకుంటాడు. ఆ టైంలోనే కిశోర్ కు గాళ్ ఫ్రెండ్ వుందని తెలుస్తుంది. లవర్ ను పరిచయం చేసే క్రమంలో కిశోర్ గురించి శ్రీవిష్ణు ఎక్కువ చెప్పడంతో బెడిసికొడుతుంది. ఆ తర్వాత ఆఫీసుకు మెట్రో జర్నీలో వెళుతుండగా కనిపించిన కేతిక శర్మపై మనసు పారేసుకుంటాడు విష్ణు. ఆమెను ఫాలోఅయి కారు షోరూమ్ మేనేజర్ అయిన ఆమె దగ్గరకువెళ్లి కారు కొంటున్నట్లు బిల్డప్ ఇచ్చి కొద్దిరోజులు తన చుట్టూ తిప్పుకుంటాడు.
సరిహద్దులను దాటి భారత్లోకి ప్రవేశించేందుకు యత్నించిన ఏడుగురు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత సైనిక బలగాలు కాల్చివేశాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత బలగాలు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసేలా సైనిక చర్యకు శ్రీకారం చుట్టింది. దీంతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సాగుతున్న యుద్ధం తీవ్రతరమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియాలో రకరకాలైన వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇవి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఓ వార్త ఇపుడు నెట్టింట వైరల్గా మారింది. ఇండోపాక్ నేపథ్యంలో వచ్చే మూడు రోజుల పాటు ఏటీఎంలు మూతపడనున్నాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
కర్ణాటకకు చెందిన మైనింగ్ వ్యాపారి, గంగావతి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై కర్ణాటక శాసనసభ అనర్హత వేటువేసింది. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించడంతో ఈ చర్య తీసుకున్నారు. ఈ మేరకు కర్ణాటక శాసనసభ కార్యదర్శి ఎం.కె. విశాలాక్షి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా తీవ్రమవుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రస్థావరాలపై సైనిక చర్య చేపట్టింది. దీనికి ప్రతిగా దాయాది దేశం పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడుతోంది. వీటిని భారత్ ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతోంది. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది.
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకుంది. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలకు శ్రీకారం చుట్టింది. దీంతో పాకిస్థాన్ సైతం ప్రతీకార దాడులకు దిగుతోంది. దీంతో ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు విమానం బయలుదేరే సమయానికి కనీసం మూడు గంటల ముందే విమానాశ్రయాలకు చేరుకోవాలని ఎయిర్ ఇండియా సూచించింది.
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం ముమ్మరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అపరకుబేరులుగా గుర్తింపు పొందిన దేశ దిగ్గజ పారిశ్రామికవేత్తలు ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు స్పందించారు. పాక్ యుద్ధం కారణంగా భారత్కు పూర్తి మద్దతుగా ఉంటామని ఇద్దరు ప్రకటించారు. దేశానికి ఏం కావాలన్నా తాము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు.
పాకిస్థాన్కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వివిధ రూపాల్లో ఆర్థిక సాయం చేస్తోంది. అయితే, ఈ ప్యాకేజీలపై భారత్ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా, ఐఎంఎఫ్ ఇచ్చే నిధులను ఉగ్రవాదాన్ని పెంచిపోషించేందుకు వినియోగిస్తుందంటూ భారత్ ఆరోపిస్తూ, తన అభ్యంతరాలను, ఆందోళలను వ్యక్తం చేయనుంది.
భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకునే పరిస్థితిలు నెలకొనడంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా సాగుతున్న ఐపీఎల్ క్రికెట్ పోటీలను రద్దు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటుంది. అదేసమయంలో భారత్లో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై కేంద్ర ఆహార శాఖామంత్రి ప్రహ్లాద్ జోషి క్లారిటీ ఇచ్చారు. దేశఁలో ఆహార ధాన్యాల కొరత ఉందన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అందువల్ల ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దేశంలో అవసరానికి మించి నిల్వలు ఉన్నాయన్నారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రం వెల్లడించింది. పంజాబ్లోనూ ఇలాంటి వదంతులు వ్యాపిస్తాయని ఆయన తెలిపారు.
తెలుగు సినిమా ప్రేక్షకులు, మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు క్రేజీ న్యూస్ గా జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ తయారైంది. కాలాతీత సోషియో-ఫాంటసీ క్లాసిక్ జగదేక వీరుడు అతిలోక సుందరి మే 9 నుండి ప్రత్యేకంగా 4K 2D మరియు 3D ఫార్మాట్లలో విడుదలై 35వ వార్షికోత్సవం సందర్భంగా థియేటర్లలోకి తిరిగి వస్తుంది. ఈ చిత్రం దాని ఇతిహాస దృశ్యాలు, ఆకర్షణీయమైన కథాంశం మరియు సంచలనాత్మక సంగీతం కోసం తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయింది. దీని గురించి మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ విషయాన్ని వెల్లడించారు.
భారతదేశం త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. పాకిస్తాన్ ఆశ్రయమిస్తున్న ఉగ్రవాద శిబిరాలను తుక్కుతుక్కు చేసాయి. ఇంకోపక్క కరాచీ నౌకాశ్రయాన్ని భారతదేశ ఐఎన్ఎస్ విక్రాంత్ నేలమట్టం చేసింది. ఎటు చూసినా బాంబుల మోతతో పాకిస్తాన్ బెంబేలెత్తిపోతోంది. మరోవైపు క్వెట్టా నగరంలో పాకిస్తాన్ సైనికులపై బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విరుచుకుపడుతోంది. అదనుచూసి పాక్ సైనికులను బెలూచ్ ఆర్మీ అంతుచూస్తోంది.భారత్ సైనిక దాడుల దెబ్బకు పాకిస్తాన్ ప్రధానమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో బాంబులు పడటంతో పాక్ ప్రధాని బిక్కచచ్చిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఆయన్ను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
భారతదేశంలోని సరిహద్దు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలపై దాడి చేసేందుకు పాకిస్తాన్ మిసైళ్లు, డ్రోన్లు, ఫైటర్ జెట్లతో ముందుకు దూసుకు వచ్చింది. అంతే... భారతదేశ S400 ఆటోమెటిక్ రాడార్ వ్యవస్థ వాటిని గగనతలంలోనే సర్వనాశనం చేసింది. మరోవైపు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పైన దాడి చేసేందుకు పాకిస్తాన్ తన ఫైటర్ జెట్లతో విశ్వప్రయత్నం చేసింది. ఈ ఫైటర్ జెట్లను భారతసైన్యం కూల్చివేసింది. ఈ విమానాల్లో ఒక విమానంలో బతికిబయటపడ్డ పాకిస్తాన్ పైలెట్ను భారతదేశ సైన్యం ప్రాణాలతో పట్టుకున్నది.
ధర్మశాలలో జరుగుతున్న పంజాబ్ vs ఢిల్లీ మ్యాచ్కు అంతరాయం కలిగింది. ధర్మశాలలో బ్లాక్ ఔట్ కారణంగా ఫ్లడ్ లైట్స్ ఆఫ్ చేసారు. మరోవైపు జమ్ముతో పాటు పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ మిసైల్ దాడులు చేస్తుండటంతో స్టేడియంలో వున్న ప్రేక్షకులందరినీ వెళ్లిపోవాలంటూ ఐపీఎల్ చైర్మన్ కోరుతున్నారు. వీడియోలో చూడవచ్చు.
జమ్మూ: గురువార రాత్రి 8:15 గంటల ప్రాంతంలో, పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లతో జమ్మూపై దాడి చేసింది. రక్షణ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, పాకిస్తాన్ చేసిన ఈ దుష్ట దాడిని భారత సైన్యం తిప్పికొట్టింది. ఆర్ఎస్ పురా సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దుపై పాకిస్తాన్ సైన్యం భారీ కాల్పులు ప్రారంభించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే అఖ్నూర్, సాంబా, పఠాన్కోట్లను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఇలాంటి క్షిపణి, డ్రోన్ దాడులను చేసిందా లేదా అనేది ఇంకా నిర్ధారించబడలేదు.
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదంకార్యసాధనకు మరింత శ్రమించాలి. ఆశావహదృక్పథంతో మెలగండి. అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలుప్రతికూలతలకు ధీటుగా స్పందిస్తారు. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
ఉత్తరాఖండ్లో ఆధ్యాత్మిక యాత్రకు వెళ్తున్న భక్తులతో కూడిన ఒక విషాదకరమైన హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఉత్తరకాశి జిల్లాలోని గంగ్నాని సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో ఒక హెలికాప్టర్ కూలిపోయి ఆరుగురు మరణించారు.మృతులలో వేదవతి కుమారి ఉన్నారు. ఆమెను అనంతపురం పార్లమెంటు సభ్యురాలు అంబికా లక్ష్మీనారాయణ సోదరిగా గుర్తించారు. వేదవతి కుమారి మతపరమైన తీర్థయాత్రలో భాగంగా గంగోత్రికి వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన కార్యక్రమంలో తన వ్యాఖ్యలలో, ఆర్థిక మంత్రి కూడా అయిన విక్రమార్క, అప్పుల భారం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగించడానికి కట్టుబడి ఉందని అన్నారు.
పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో స్వాతంత్ర్య ఉద్యమం మరోసారి తీవ్రమైంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) తన కార్యకలాపాలను ముమ్మరం చేసి పాకిస్తాన్ ప్రభుత్వానికి కొత్త సవాళ్లను విసురుతోంది. భారతదేశం - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రత్యేక దేశం కోసం తన దీర్ఘకాల డిమాండ్ను పెంచడానికి బీఎల్ఏ ప్రస్తుత వాతావరణాన్ని ఉపయోగించుకుంటున్నట్లు కనిపిస్తోంది.
రావల్పిండి క్రికెట్ స్టేడియంలో గురువారం జరగాల్సిన పెషావర్ జల్మి, కరాచీ కింగ్స్ మధ్య జరగాల్సిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) మ్యాచ్ రద్దు అయ్యింది. రావల్పిండితో సహా పాకిస్తాన్లోని అనేక ప్రదేశాలలో భారత సాయుధ దళాలు ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్న తర్వాత ఈ మ్యాచ్లను రద్దు చేశారు. పీఎస్ఎల్ మిగిలిన అన్ని మ్యాచ్లను విదేశాలకు - దోహా లేదా దుబాయ్కి మార్చాలని పీసీబీ అధికారులు సూచించారు.
ఏఐ -ఆధారిత ఆధునిక నాణ్యత ఇంజనీరింగ్, డిజిటల్ పరివర్తన పరిష్కారాలలో ప్రపంచ అగ్రగామి అయిన క్వాలిజీల్, నిర్మాన్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యంతో ఒక ముఖ్యమైన సీఎస్ఆర్ కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించినట్లు నేడు వెల్లడించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, క్వాలిజీల్ హైదరాబాద్లోని పేద యువతకు ల్యాప్టాప్లను పంపిణీ చేసింది, ఇది సమ్మిళిత అభివృద్ధి, డిజిటల్ సాధికారత పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించింది.
హైదరాబాద్: ప్రపంచ క్రీడలు, ఫ్యాషన్ల యొక్క ఉత్కంఠభరితమైన మిశ్రమంలో, 60 సంవత్సరాలకు పైగా వారసత్వం కలిగిన ప్రముఖ ఐవేర్ బ్రాండ్ అయిన GKB ఆప్టికల్స్, హైదరాబాద్లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్లోని తన స్టోర్లో ప్రపంచ క్రికెట్ ఐకాన్ పాట్ కమ్మిన్స్కు ఆతిథ్యం ఇచ్చింది.కారెరా ఐవేర్ యొక్క గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ అయిన పాట్ కమ్మిన్స్, ఇటీవల కారెరా యొక్క అధికారిక పంపిణీదారు సఫిలోతో కలిసి GKB ఆప్టికల్స్ స్టోర్ను సందర్శించారు. తన సందర్శన సందర్భంగా, కమ్మిన్స్ తన కళ్లజోడు సిగ్నేచర్ కలెక్షన్ను అధికారికంగా ఆవిష్కరించారు
2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. తాడేపల్లిలో జరిగిన కీలక సమావేశంలో జగన్ పార్టీ నాయకులకు ఎన్నికలు ఎప్పుడు ప్రకటించినా సిద్ధంగా ఉండాలని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు.25 పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రస్తుత ఇన్చార్జులతో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ, కొంతమంది నాయకులు తమ విధులను సరిగ్గా నిర్వర్తించడం లేదన్నారు. ప్రస్తుతం తాను ఎవరినీ బెదిరించడం లేదని, కానీ పనితీరులో వెనుకబడిన నాయకుల జాబితా తన వద్ద ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ), 2002 నిబంధనల ప్రకారం దర్యాప్తు చేయడానికి చర్యలు ప్రారంభించింది. ఈడీ తన సన్నాహాల్లో భాగంగా, ఈ కేసుకు సంబంధించిన సమగ్ర వివరాలను కోరుతూ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధిపతికి, విజయవాడ పోలీసు కమిషనర్కు అధికారికంగా లేఖ రాసింది. ఈడీ ప్రత్యేకంగా 21/2024 నంబర్ గల మొదటి సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్), ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న అన్ని బ్యాంకు ఖాతాల సమాచారం. ఇప్పటివరకు అరెస్టు చేయబడిన నిందితుల వివరాలను కోరింది.
భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పేరును ట్రేడ్మార్క్ చేసుకోవాలన్న యత్నాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ వెనక్కి తగ్గంది. తమ సంస్థలో ఓ జూనియర్ ఉద్యోగి పర్మిషన్ తీసుకోకుండానే ఈ దరఖాస్తును దాఖలు చేశాడంటూ స్పష్టం చేసింది. రిలయన్స్ ఛైర్మన్ ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆపరేషన్ సిందూర్ ట్రేడ్మార్క్ కోసం దరఖాస్తు చేసిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
భారతదేశం-పాకిస్తాన్ (India Pakistan war) మధ్య యుద్ధాన్ని నివారించేందుకు ఆదివారం నాడు పాకిస్తాన్ దేశానికి తను వెళ్లబోతున్నట్లు కె.ఎ.పాల్ (KA Paul) వెల్లడించారు. ఇటీవలే ఈ విషయంపై అమెరికాలోని 9 మంది అగ్ర నాయకులతో మంతనాలు జరిపాననీ, వారు కూడా తన నిర్ణయానికి మద్దతు తెలిపారన్నారు. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తానంటూ చెప్పుకొచ్చారు.ఈ యుద్ధాన్ని ఆపే బాధ్యత పైన దేవుడిది, కింద వున్న నాది అని అన్నారు. టెర్రరిస్టు క్యాంపులను మాత్రమే భారతదేశం టార్గెట్ చేసిందనీ, ఆపరేషన్ సింధూర్ ను వద్దని తను వారించినట్లు చెప్పుకొచ్చారు. ఏదేమైనప్పటికీ తనవంతు ప్రయత్నం మాత్రం చేస్తానని అన్నారు.
ఏప్రిల్ 22న పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు 26 మంది పౌరులను చంపిన పహల్గామ్ దాడుల తర్వాత భద్రతా చర్యల నేపథ్యంలో పాకిస్తాన్కు చెందిన అన్ని కంటెంట్ను వెంటనే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం గురువారం ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లను ఆదేశించింది.సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులో, "భారతదేశంలో పనిచేస్తున్న అన్ని పాకిస్థాన్ ఓటీటీ ప్లాట్ఫారమ్లు, మీడియా స్ట్రీమింగ్, వెబ్ సిరీస్లు, సినిమాలు, పాటలు, పాడ్కాస్ట్లు, ఇతర స్ట్రీమింగ్ కంటెంట్ను వెంటనే నిలిపివేయాలని కోరింది. జాతీయ భద్రత ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ తెలిపింది.
ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ లో ఓ సినిమా రూపొందుతోంది. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. హీరోగా రామ్ 22వ చిత్రమిది. మే 15న రామ్ పోతినేని పుట్టినరోజు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన కొత్త సినిమా టైటిల్ అధికారికంగా అనౌన్స్ చేయడంతో పాటు గ్లింప్స్ కూడా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్ మహేంద్రన్ కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'కర్మణ్యేవాదికారస్తే'. క్రైం ఇన్వెస్టిగేషన్ జానర్ లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ గురువారం రిలీజైంది. 2.38 నిమిషాలు ఉన్న ఈ ట్రైలర్లో ఫైట్స్, గన్ ఫైరింగ్, రొమాన్స్, థ్రిలింగ్ వంటి సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. మూవీ ట్రైలర్లో బీజీఎమ్ హైలెట్గా నిలుస్తోంది.
సామజవరగమన ఫేమ్ శ్రీవిష్ణు నటించిన సినిమా #సింగిల్ ఎలా వుండబోతోందని ఆసక్తి ఆయనకూ, ఆయన టీమ్ కూ నెలకొంది. చిత్ర టీమ్ మేరకు ఈ సినిమా పూర్తి ఎంటర్ టైన్ మెంట్ తో వుండబోతోందని తెలుస్తోంది. సింగిల్ గా వుండే హీరోకు తోడు కావాలని ఎవరైనా ప్రేమిస్తారేమోనని ఆశతో ఎదురుచూస్తుంటారు. కానీ ఎవరూ సెట్ కారు. పైగా తనతోటివారు సింగిల్ గా వుండేవారు డబుల్ గా అయ్యేసరికి ఎక్కడలేని ఆక్రోషం వస్తుంది. దానితో లేడీస్ అంటే అసహ్యించుకుంటాడు.
ఆపరేషన్ సింధూర్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ధృవీకరించారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందని, ఇంకా ముగియలేదని కూడా రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్, పీఓకేలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, దేశ భద్రత విషయంలో ఎలాంటి చర్యలకైనా సిద్ధం అని స్పష్టం చేశారు.
ఇటీవలే టాలీవుడ్ లో నాగచైతన్య, శోభితా జంట ముగ్గురు కాబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. దీనికి కారణం శోభితా చీరకట్టుకుని ఢిల్లీలో వేవ్స్ మీటింగ్ కు హాజరు కావడమే. అక్కడ తాను కట్టుకున్న చీరపై శ్రద్ధపెడుతూ కనిపించింది. దానికిలో బాలీవుడ్ లోని మీడియా ఆమె గర్భం దాల్చినట్లు వార్తలు ప్రచారం చేశారు. దీనిపై ఆమె టీమ్ కూడా క్లారిటీ ఇస్తూ, చైతు, శోభితాలు జంట తల్లి దండ్రులు కావడంలేదని వెల్లడిస్తోంది.
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ ‘రాబిన్హుడ్’ థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో రాబోతుంది. మే10 నుంచి ప్రముఖ ఓటీటీ మాధ్యమం ZEE5లో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ సినిమాను ఓటీటీలో చూసి ఉర్రూత లూగించే సాహసానికి సిద్ధం కావాలని మేకర్స్ భావిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటించిన ఈ చిత్రం సస్పెన్స్, ట్విస్ట్స్, ఎవరూ ఊహించలేని మలుపులతో సాగే కథనంతో ఆకట్టుకుంటుంది.
ఈషా రెబ్బా, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ త్రీ రోజెస్. ఆహా ఓటీటీలో సూపర్ హిట్టయిన ఈ సిరీస్ కు ఇప్పుడు సీజన్ 2 రాబోతోంది. ఈ సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా..కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు.
“డ్రింకర్ సాయి” సినిమాలో నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు టాలెంటెడ్ హీరో ధర్మ. అందరి ప్రశంసలతో పాటు పలు అవార్డ్స్ కూడా దక్కించుకున్నారు. ఇప్పుడీ యంగ్ హీరో క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ చేసుకుంటున్నారు. నటుడిగా తనను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసేలా ఆ మూవీస్ ఉండబోతున్నాయి. వీటికి సంబంధించిన అనౌన్స్ మెంట్ త్వరలో చేయబోతున్నారు హీరో ధర్మ.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న దృఢ వైఖరికి, ముఖ్యంగా ఇటీవల ప్రారంభించిన "ఆపరేషన్ సింధూర్"ను సమర్థిస్తూ ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు.తన అధికారిక ఎక్స్ ఖాతాను ఉపయోగించి, పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రిని ప్రశంసిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీని "అనికేత్" అని అభివర్ణించారు. ఆ పదానికి ఆలోచనాత్మక వివరణ ఇచ్చారు.. "అనికేత్ అనేది కేవలం పేరు కాదు, అది ఒక సంకల్పం. తన సన్యాసి జీవితంలో ఇల్లువుండదు. అలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పవన్ అనికేత్ అని పిలిచారు.
పాకిస్తాన్లోని ప్రధాన నగరమైన లాహోర్లో వరుసగా శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయి. ఇది స్థానిక నివాసితులలో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. లాహోర్లోని వాల్టన్ రోడ్లోని సైనిక వైమానిక స్థావరం సమీపంలో పేలుళ్లు సంభవించాయి. పెద్ద శబ్దాలతో కూడిన పేలుళ్లు సైనిక వైమానిక స్థావరం వెలుపల సంభవించాయి. తదనంతరం, సమీపంలోని భవనాల్లో దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. దీనితో భయాందోళనకు గురైన నివాసితులు భయాందోళనకు గురై ఇళ్ల నుండి పారిపోయారు. సంఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే, అగ్నిమాపక- పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు.
పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) నిర్వహించిన రెండు వేర్వేరు దాడుల్లో 14 మంది పాకిస్తాన్ సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. బీఎల్ఏ స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్ (ఎస్టీఓఎస్) బోలాన్ జిల్లాలోని మాక్ ప్రాంతంలోని షోర్కాండ్ సమీపంలో ఒక సైనిక కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో ఆ స్క్వాడ్ రిమోట్-కంట్రోల్డ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)ని ఉపయోగించింది. ఈ శక్తివంతమైన పేలుడు సైనిక వాహనాన్ని ధ్వంసం చేసింది. స్పెషల్ ఆపరేషన్స్ కమాండర్ తారిక్ ఇమ్రాన్, సుబేదార్ ఉమర్ ఫరూక్తో సహా విమానంలో ఉన్న 12 మంది సైనికులందరూ తక్షణమే మరణించారు.
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, పాన్-ఇండియా మూవీ శేఖర్ కమ్ముల 'కుబేర'. అద్భుతమైన తారాగణంతో కుబేర భారతీయ సినిమాలో గేమ్-ఛేంజర్గా నిలవబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా సినిమా నుంచి సరికొత్త పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ధనుష్ రష్మిక మందన చిరునవ్వులతో కనిపించిన ఈ పోస్టర్ అదిరిపోయింది.
ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా, భారత సైన్యం పాకిస్తాన్- పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) అంతటా ఉన్న తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ అనే కోడ్నేమ్తో దాడులు నిర్వహించింది. ఈ సైనిక కార్యకలాపాలకు సంబంధించి పూర్తి వివరాలను భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, భారత సైన్యం కల్నల్ సోఫియా ఖురేషి, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో కలిసి మీడియాకు వెల్లడించారు.
భారతదేశం-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయ్ రెండు దేశాలు సంయమనం పాటించాలని, శాంతియుత వాతావరణాన్ని పెంపొందించాలని విజ్ఞప్తి చేశారు. కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో మలాలా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తన భవిష్యత్తు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ జూలైలో 44 ఏళ్లు నిండనున్న ధోనీ, ఐపీఎల్ 2025 తన చివరి సీజన్ అవుతుందా లేదా అనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాడు. తాను సంవత్సరానికి రెండు నెలలు మాత్రమే ఆడుతున్నప్పటికీ, మిగిలిన ఆరు నుండి ఎనిమిది నెలలు తన శరీరాన్ని సిద్ధం చేసుకోవాలని, ఆ ఒత్తిడిని తట్టుకోగలదా అనేది తాను ఇంకా అంచనా వేయాల్సిన విషయం అని ఆయన వివరించారు. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్ తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
శ్రీలీల ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తెలుగులో సినిమాలతోపాటు బాలీవుడ్ లోకి ప్రవేశించింది. కార్తీక్ ఆర్యన్ సరసన నటించనుంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాతో బాలీవుడ్లో కూడా సంచలనం సృష్టిస్తోంది. కారణం కార్తీక్ ఆర్యన్ తో నటించడం వల్లే ఈ క్రేజ్ వుంది. శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ డేటింగ్ గురించి కూడా పుకార్లు షికారు చేస్తున్నాయి. దానితో వీరి కాంబినేషన్ హాట్ టాపిక్ గా మారింది. శ్రీలీల ఈ సినిమా కాకుండా మరో సినిమాలో కూడా నటించనున్నట్లు బాలీవుడ్ కథనాలు తెలుపుతున్నాయి.
తన బేనర్ లో తనే హీరోగా కన్నప్ప సినిమా చేసిన మంచు విష్ణు మరో క్రాఫ్ట్ లో కూడా ప్రవేశించారు. తను ఫైట్ మాస్టర్ గా మారాడు. ఈ విషయాన్ని నేడు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో ప్రమోషన్ యాత్ర సందర్భంగా తిరుగుతున్న మంచు విష్ణు కన్నప్ప స్టోరీస్ లో భాగంగా ఒక్కో విషయాన్ని ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. అందులో భాగంగా కన్నప్ప లో యాక్షన్ కోసం ఎంత కష్టపడిందో గ్లింప్స్ ను విడుదల చేశారు.
ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాల దాడితో కలవరపడిన పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ కింద భారతదేశం లక్ష్యంగా చేసుకున్న సైనిక దాడులు పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) అంతటా తొమ్మిది అధిక విలువైన ఉగ్రవాద మౌలిక సదుపాయాల ప్రదేశాలను దెబ్బతీశాయి. వీటిలో అగ్ర ఉగ్రవాద సూత్రధారులు మౌలానా మసూద్ అజార్- హఫీజ్ సయీద్ రహస్య స్థావరాలు కూడా ఉన్నాయి.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. పరువు నష్టం కేసులో ఆయన దోషిగా తేలడం, ఆయన పౌరసత్వ హోదాకు సంబంధించిన పరిష్కారం కాని ప్రశ్నలను పేర్కొంటూ ఈ పిటిషన్ దాఖలు చేయబడింది. పిటిషనర్ వాదనలను ధర్మాసనం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.రాహుల్ గాంధీకి అనుకూలంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీ పౌరసత్వం ఆధారంగా ఆయన పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు చేయాలనే వాదనకు మద్దతు ఇచ్చే బలమైన లేదా అధికారిక ఆధారాలను పిటిషనర్ సమర్పించడంలో విఫలమయ్యారని కోర్టు పేర్కొంది.
ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా, కేంద్ర ప్రభుత్వం భారతదేశం నుండి పాకిస్తాన్ వైమానిక ప్రాంతాన్ని యాక్సెస్ చేయడానికి వీలు కల్పించే సుమారు 25 వైమానిక మార్గాలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. భారత సాయుధ దళాలు "ఆపరేషన్ సిందూర్" విజయవంతంగా అమలు చేసిన తర్వాత ఈ పరిణామం జరిగింది.ఏప్రిల్ 24 పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఏప్రిల్ 30న, భారతదేశం ఇప్పటికే పాకిస్తాన్ విమానయాన సంస్థలు తన వైమానిక ప్రాంతాన్ని ఉపయోగించకుండా నిషేధించింది
ప్రపంచంలోనే శాంతియుత దేశంగా పేరున్న భారతదేశాన్ని సీమాంతర ఉగ్రవాదులతో అమాయక పౌరులపై పిరికిపంద దాడులు చేస్తూ సహనాన్ని పరీక్షిస్తోన్న పాకిస్తాన్ ముక్కలు చెక్కలయ్యే రోజులు వచ్చేసాయంటున్నారు నిపుణులు. దేశ ప్రజల అభివృద్ధి మానేసి మందుగుండు సామాగ్రి, ఉగ్రవాదులకు రాచమర్యాదలు చేస్తూ పాక్ ప్రజలను బిచ్చగాళ్లలా మార్చేసింది పాకిస్తాన్. ఫలితంగా ఆ దేశంలో సింహభాగం ప్రజలు తీవ్ర అసంతృప్తితో వున్నారు. వారికి ఎవరికీ యుద్ధం అవసరంలేదు.
బెంగళూరు: భారతీయ ఆటోమొబైల్ రంగంలో మంచి నమ్మకమైన బ్రాండ్ అనగానే మన అందరికి గుర్తుకు వచ్చేది లెక్సస్ ఇండియా. అద్భుతమైన డిజైన్, ఆకట్టుకునే ప్రీమియం మోడల్స్ తో ఉండే లెక్సస్ కార్లకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. అయితే లెక్సస్లో చాలా పాపులర్ మోడల్ LM 350h. ఇప్పుడు ఈ మోడల్ బుకింగ్స్ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది లెక్సస్ ఇండియా. లెక్సస్ ఇండియా యొక్క LM 350h మోడల్.. ప్రారంభమైన దగ్గరనుంచి దేశవ్యాప్తంగా లగ్జరీ కార్ల ఔత్సాహికులను ఆకర్షించింది. ఎంతో జాగ్రత్తగా రూపొందించబడిన ఈ అద్భుతమైన మోడల్ అల్ట్రా-లగ్జరీ మొబిలిటీ విభాగాన్ని సరికొత్తగా పునర్నిర్వచించింది.