నువ్వులు కొన్నిసార్లు మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు తదితర అనారోగ్యాలకు ఉపయోగిస్తారు. నువ్వులు వల్ల కలిగే ఇతర ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము.ఎముకలు దృఢంగా మారుస్తుంది.రక్తసరఫరా మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు తగ్గుతుంది చెడు కొలెస్ట్రాల్ను కరిగిస్తుందిషుగర్ లెవల్స్ సాధారణ స్థితిలో వుంటాయి. రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు అందుతాయి. డయాబెటిస్ రాకుండా నియంత్రిస్తుంది. నల్ల నువ్వుల్లో ఉండే ఔషధ విలువలు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. నువ్వుల నూనె వాడకంతో గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
ఈ బాలల దినోత్సవం నాడు, అమెజాన్ కుతూహలం కలిగించడానికి, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, చదవడం పట్ల ప్రేమను పెంచడానికి అత్యంత ప్రసిద్ధి చెందిన పుస్తకాల యొక్క కూర్పు చేసిన ఎంపికను తీసుకువస్తోంది. శాశ్వతమైన క్లాసిక్స్ నుండి సాహసోపేతమైన కధలు, విద్యాపరమైన పుస్తకాలు వరకు, కస్టమర్లు బెస్ట్-సెల్లింగ్ రచయితలు, ప్రచురణకర్తల్లో విస్తృత శ్రేణి టైటిల్స్ను అన్వేషించవచ్చు. కస్టమర్లు 45% వరకు కూడా తగ్గింపును, అదనంగా 10% తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ను కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై పొందవచ్చు.
పెరుగుతున్న చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మెంతి నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెంతి గింజల్లో ఫైబర్ వుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, రక్తంలో చక్కెరను సాధారణంగా ఉంచుతుంది.ఒక చెంచా మెంతి గింజలను 200-250 మిల్లీ లీటర్ల నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే ఫిల్టర్ చేసిన నీటిని తాగాలి. నానబెట్టిన మెంతి గింజలను కూడా నమలవచ్చు. దీనితోపాటు ఉదయం 200-250 మిల్లిలీటర్ల నీటిలో 1 టీస్పూన్ మెంతి గింజలను ఉడకబెట్టవచ్చు. దీనిని వడకట్టి త్రాగాలి, గింజలను నమలాలి.మజ్జిగ మొదలైన వాటిలో మెంతి గింజల పొడిని కూడా తీసుకోవచ్చు. ఏదైనా ఆరోగ్య చిట్కాను అనుసరించే ముందు నిపుణుడిని సంప్రదించండి.
అటవీ భూములను బొక్కేస్తున్న పెద్దల బాగోతం ఒక్కొక్కటిగా వెలుగుచూస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అటవీ భూములను కొందరు కబ్జా చేసారంటూ ఏపీ అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ చలపతి రావు మీడియా సమావేశంలో చెప్పారు. చిత్తూరు జిల్లా మంగళం పేటలో ఏకంగా 32.63 ఎకరాల భూమిని పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించుకున్నదని ఆయన చెప్పారు. ఆ భూమిని స్వాధీనం చేసుకుంటామనీ, ఎక్కడ ఆక్రమణలు జరిగినట్లు తేలినా ఆ భూములన్నింటినీ వెనక్కి తీసుకుంటామని అన్నారు.ప్రస్తుతం కొన్ని రిట్ పిటీషన్లపై కోర్టులో వాదనలు జరుగుతున్నట్లు వెల్లడించారు.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీ ఈ సంవత్సరం తొలిసారిగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసిన కిషోర్ యువతను ఆకర్షించగలిగారు. అయితే, ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, జాన్ సూరజ్ పార్టీ తన తొలి ఎన్నికల్లో బలమైన ప్రభావాన్ని చూపలేకపోయింది. చాలా సర్వేలు పార్టీ సున్నా నుండి ఐదు సీట్ల మధ్య గెలుస్తుందని అంచనా వేస్తున్నాయి. అయితే బీహార్లో ఎన్డీఏ అధికారాన్ని నిలుపుకుంటుందని భావిస్తున్నారు.
జూబ్లీహిల్స్లో మొత్తం 48.47 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇందులో 34 కీలక కేంద్రాల నుండి 60 శాతం ఓట్లు వచ్చాయి. 192 కేంద్రాలలో పోలింగ్ 50 శాతం దాటింది. ఎన్నికల కమిషన్ ప్రకారం, ఈ అధిక పోలింగ్ కేంద్రాల ద్వారా గెలిచే అభ్యర్థిని నిర్ణయించే అవకాశం ఉంది.
శుక్రవారం అమ్మవారిని పూజించడానికి పవిత్రమైన రోజు. దుర్గ, సరస్వతి, లక్ష్మిని శుక్రవారాల్లో పూజించవచ్చు. లక్ష్మీదేవి సంపదకు నిలయం కాబట్టి ఆమెను పూజించడానికి శుక్రవారం చాలా ప్రత్యేకమైన రోజు. లక్ష్మీదేవి నుండి పూర్తి అనుగ్రహం, ఆశీర్వాదం పొందడానికి శుక్రవారం ఆమెని ఆరాధించి పూజించాలి. లక్ష్మీదేవి రూపాలలో ఒకటి గృహలక్ష్మి. ఇది చాలామందికి అంతగా తెలియదు, కానీ ఈమె చాలా శక్తివంతమైనది. లక్ష్మీదేవిని స్వాగతించడానికి, మనం నివసించే ఇంటికి ఆహ్వానించడానికి గృహలక్ష్మిని ఆవాహన చేయాలి.
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదంలావాదేవీలు ముగుస్తాయి. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. ఫోను సందేశాలు పట్టించుకోవద్దు. ఆత్మీయుల ఆహ్వానం అందుకుంటారు. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలురావలసిన ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. ప్రముఖలతో పరిచయాలేర్పడతాయి. బాధ్యతగా మెలగాలి. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. పాత పరిచయస్తులు తారసపడతారు. చర్చలు, సమావేశాల్లో పాల్గొంటారు.
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను క్రమబద్ధీకరించడంపై వారు దృష్టి సారించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, ముఖ్యంగా ఐటీ కారిడార్లలో మోనో రైలు కనెక్టివిటీని అందించే ప్రక్రియలో ఉంది. ఇందులో భాగంగా తెలంగాణ సర్కారు మరిన్ని స్కైవాక్లను నిర్మించి, మోనో రైలును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. మోనో రైలును స్కైవాక్లతో అనుసంధానించాలనేది ప్రణాళిక.
బెంగళూరుకు చెందిన పందొమ్మిదేళ్ల తుషార్ షా, స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో రెండవ సంవత్సరం చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థి, ఒక గాడ్జెట్ను మాత్రమే కాకుండా సామాజిక బాధ్యత, ఆవిష్కరణ కలయికను ప్రతిబింబించే పరిష్కారాన్ని అందించాడు. అతని ఆవిష్కరణ, పెర్సీవియా-దృష్టి లోపం ఉన్నవారికి సహజమైన గ్లాసెస్-శామ్సంగ్ సాల్వ్ ఫర్ టుమారో 2025 యొక్క జాతీయ విజేతలలో అతనికి స్థానం సంపాదించింది.శామ్సంగ్ సాల్వ్ ఫర్ టుమారో సంస్థ యొక్క ప్రధాన విద్యా కార్యక్రమం, ఇది యువ ఆవిష్కర్తలను వాస్తవ ప్రపంచ సమస్యలను గుర్తించి, సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ప్రోత్సహిస్తుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఉత్కంఠ శుక్రవారంతో ముగియనుంది. యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు. లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందుగా బ్యాలెట్ ఓట్లను, తరువాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తామని కర్ణన్ తెలిపారు. లెక్కింపు పది రౌండ్లలో జరుగుతుందని కర్ణన్ మీడియాకు తెలిపారు. సాధారణ పద్నాలుగు టేబుళ్లకు బదులుగా, ప్రక్రియను వేగవంతం చేయడానికి అధికారులు నలభై రెండు టేబుళ్లను ఉపయోగిస్తారని ఆయన చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులలో రూ. 1,10,250 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఏబీసీ క్లీన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్(ఎవ్రెన్), యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర నోడల్ ఏజెన్సీ, న్యూ & రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్(NREDCAP) అవగాహన ఒప్పందం (ఎంఓయు)చేసుకుంది. ఎవ్రెన్ అనేది బ్రూక్ఫీల్డ్ రెన్యూవబుల్స్, యాక్సిస్ ఎనర్జీల మధ్య వరుసగా 51%:49% జాయింట్ వెంచర్ కంపెనీగా ఏర్పడింది.
కుటుంబ విలువలు సన్నగిల్లుతున్నాయి. భార్యాభర్తల అనుబంధాలు మంటగలిసిపోతున్నాయి. ఇందుకు వివాహేతర సంబంధాలే కారణమవుతున్నాయి. ఈ వివాహేతర సంబంధాల కారణంగా భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా విజయవాడలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను ఓ భర్త నడిరోడ్డుపై భార్యను అతి కిరాతంగా కత్తితో దాడి చేసి చంపేశాడు. వివరాల్లోకి వెళితే.. సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన విజయ్, సరస్వతి 2022 ఫిబ్రవరి 14వ తేదీన లవ్ మ్యారేజి చేసుకున్నారు.
కేశ్ కింగ్, భారత్ యొక్క ప్రాముఖ్యత పొందిన ఒక హెయిర్ కేర్ బ్రాండ్గా నిలిచింది. ఈ బ్రాండ్ తనకు తానే ఒక సరిక్రొత్త రూపాన్ని ఇవ్వడానికి రీ బ్రాండింగ్ చొరవలో ప్రథమాంశంగా ప్రవేశపెట్టారు కేశ్ కింగ్ గోల్డ్. దీనివలన బ్రాండ్కు ఒక క్రొత్త గుర్తింపు, ప్రతిపాదన, ప్యాకేజింగ్కు ఒక సరిక్రొత్త మరియు ఆకర్షణీయమైన స్థానం పొందింది. ఈ రీ బ్రాండింగ్ చొరవ కారణంగా ఇమామి తన బ్రాండ్ కేశ్ కింగ్ కోసం ఒక ప్రత్యేక వ్యూహాత్మక మార్పును స్వీకరించింది. ఇప్పుడు అది దాని సాంప్రదాయ మూలాలను దాటి ఒక శక్తివంతమైన కొత్త ప్రతిపాదన స్వీకరించింది, ఆయుర్వేదం-విజ్ఞానం.
2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్కు ముందు గురువారం లక్నో సూపర్ జెయింట్స్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ను ముంబై ఇండియన్స్ రెండు కోట్ల రూపాయలకు ట్రేడ్ చేసింది. ముంబైకి చెందిన ఈ ఆల్ రౌండర్ను 18వ ఎడిషన్ లీగ్లో గాయం కారణంగా లక్నో సూపర్ జెయింట్స్ 2 కోట్ల రూపాయలకు తీసుకుంది. ఈ ఆల్ రౌండర్ను ప్రస్తుత ప్లేయర్ ఫీజు అయిన 2 కోట్ల రూపాయలకు ముంబై ఇండియన్స్కు ట్రేడ్ చేశారని ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఠాకూర్ 105 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 325 పరుగులు చేసి 107 వికెట్లు పడగొట్టాడు.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ - హీరో అక్కినేని నాగార్జునల మధ్య జరిగిన వివాదం టీ కప్పులో తుఫానులా ముగిసిపోయింది. కొండా సురేఖ ఓ మెట్టుదిగి వచ్చి క్షమాపణలు చెప్పడంతో పాటు అక్కినేని నాగార్జునపై ఆమె చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. దీంతో నాగార్జున కూడా శాంతి తన కేసును విత్ డ్రా చేసుకున్నారు.
ఈరోజుల్లో వివాహం కావడం అనేది చాలామందికి ఓ సవాలుగా మారుతోంది. ముఖ్యంగా మగవారి విషయంలో ఇది ఎక్కువగా కనబడుతోంది. తెలంగాణలోని హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన నరేష్ తనకు ఎంతకూ పెళ్లి కావడం లేదని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.తల్లిదండ్రులు సురేందర్, రమ తమ కుమారుడు నరేష్ కి గత నాలుగైదేళ్లుగా సంబంధాలు చూస్తున్నారు. నరేష్ హైదరాబాదులోని అమీర్ పేటలోని ఓ బట్టల షాపులో పనిచేస్తున్నాడు. బట్టల షాపులో పనిచేస్తున్నాడని చెప్పగానే పిల్లనిస్తానన్నవారు కూడా ఇచ్చేందుకు ముందుకు రాకుండా పోతున్నారట.
ఓం నమః శివాయ అనే శివ షడక్షరీ మంత్రమే సకల వేదాలకు సారం అని, సమస్త జ్ఞానానికి మూలం అని చెప్పబడింది. పరమేశ్వరుడు సృష్టిలోని ప్రతి అణువులో ఉన్నాడని, అందుకే ఈ మంత్రాన్ని జపించినా, స్తోత్రాన్ని పఠించినా తక్షణ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. శివ షడక్షరీ మంత్ర జపంతో జన్మజన్మల నుండి పోగుపడిన పాపాలు, కర్మ దోషాలు తొలగిపోతాయి.అంతేకాదు ధనం, ఐశ్వర్యం కలుగుతాయి. ఈ స్తోత్రం యొక్క శక్తి వలన దుష్ట శక్తుల నుండి రక్షణ లభిస్తుంది. భౌతిక జీవితంలో శాంతి, ఆనందం, సంతృప్తి లభిస్తాయి.
'ది కేరళ స్టోరీ' తర్వాత తర్వాత తనను చంపేందుకు ప్లాన్ చేశారని బాలీవుడ్ నటి ఆదా శర్మ అన్నారు. 2023లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రం తర్వాత దేశంలో సగం మంది తనను చంపాలని చూశారని వెల్లడించారు. ఆ సమయంలో మిగితా సగం మంది తనకు మద్దతుగా నిలిచి తన ప్రాణాలను కాపాడారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతామని టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీని త్వరలోనే గ్రీన్ హెడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
బెంగళూరు శివారు ప్రాంతమైన అనేకల్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వైద్య చికిత్స కోసం స్కానింగ్ సెంటర్కు వచ్చిన ఒక మహిళను రేడియాలజిస్ట్ లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. సదరు మహిళ తనకు తీవ్రమైన కడుపు నొప్పి ఉందని తన భర్తతో కలిసి స్కానింగ్ కేంద్రానికి వెళ్లింది. ఐతే ఆమె వైద్య నిపుణుడిగా తాను విశ్వసించిన వ్యక్తి నుండి భయంకరమైన వేధింపులకు గురైంది.స్కానింగ్ చేసే ప్రక్రియలో ఆ వ్యక్తి తన చేతిని, ఆ తరువాత ఆమె ప్రైవేట్ భాగాలను అనుచితంగా తాకడం ద్వారా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
భార్యాభర్తల మధ్య కుక్క పెట్టిన లొల్లి చివరకు విడాకుల వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్లో ఉంటున్న ఓ 41 ఏళ్ల వ్యక్తికి 2006లో వివాహం జరిగింది. మొదట్లో అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత పెంపుడు కుక్కను ఆ భార్య ఇంటికి తీసుకురావడంతో భర్తకు కష్టాలు మొదలయ్యాయి. ఎందుకంటే భార్య ఆ కుక్కలను బాగా చూసుకునేది. వాటిని తన బెడ్పై పడుకునేపెట్టేది. ఆమె దగ్గరకు భర్తను కూడా కుక్కలు రానీయకుండా కరిచేవి. దీంతో ఇరుగు పొరుగు వారు కూడా ఇబ్బంది పడేవారు. ఇలా వారి నుంచి కూడా విమర్శలు వచ్చాయి. ఇక భర్త తట్టుకోలేక 2008లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తులో పురోగతి లభించింది. ఈ పేలుళ్లతో సంబంధం ఉన్న మరో వైద్యుడుని దర్యాప్తు పోలీసులు అరెస్టు చేశారు. కాన్పూర్లోని కార్డియాలజీ ఇనిస్టిట్యూట్కు చెందిన డాక్టర్ మహమ్మద్ ఆరిఫ్ను అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, జమ్మూకాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో భాగంగా ఈ అరెస్టు జరిగింది. ఈ కేసులో గతవారం అరెస్టయిన లక్నోకు చెందిన మహిళా డాక్టర్ షాహీన్తో ఆరిఫ్ నిరంతరం టచ్లో ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుళ్ల ఘటన దేశవ్యాప్తంగా విషాదం నింపగా, కొందరు మాత్రం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసి పైశాచిక ఆనందం పొందారు. ఇలాంటి వారిపై అస్సాం ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 17న అల్పపీడనం ఏర్పడనుండగా.. అక్కడికి మరో రెండు లేదా మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంటున్నారు.
మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ వస్తే ఆ బాధ వారికి కూడా తెలుస్తుందని హీరోయిన్ రష్మిక మందన్నా అన్నారు. తాజాగా ఆమె నటించిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆమె మాట్లాడుతూ, మహిళల పీరియడ్స్ పెయిన్స్పై మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
ఢిల్లీ ఎయిర్పోర్టులో లగేజ్ చెకింగ్ పాయింట్ వద్ద ఒక్కసారిగా ఓ వ్యక్తి కుప్పకూలింది. వైద్య బృందానికి సమాచారం ఇచ్చాక.. ఆ వ్యక్తికి ఎయిర్పోర్టు సిబ్బంది సీపీఆర్ అందించారు. వైద్యుడు వచ్చేలోపు సీపీఆర్ అందించడం వల్ల.. ఆ ప్రయాణీకుడు ఊపిరి తీసుకున్నాడు.ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) అధికారి ఒకరు సెప్టెంబర్ 1, 2025న ప్రీ-ఎస్హెచ్ఎ ప్రాంతంలో కుప్పకూలిన మహ్మద్ మొఖ్తార్ ఆలం అనే ప్రయాణికుడిని కాపాడారు. సబ్-ఇన్స్పెక్టర్ వీరేంద్ర సింగ్ అక్కడికక్కడే కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్)ను త్వరగా అందించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం యూరోపియన్ దేశాలు, వ్యాపారవేత్తలను రాష్ట్ర ప్రయోజనాలను పొందాలని ఆహ్వానించారు. ఇది ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశించడానికి ఒక ద్వారం అవుతుందని అన్నారు. నవంబర్ 14-15 తేదీలలో జరిగే 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముందు ప్రోగ్రెస్లో భాగస్వాములు భారతదేశం యూరప్ సహకారం ఫర్ సస్టైనబుల్ గ్రోత్ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం చేయడంలో సౌలభ్యం, వేగం, ఖర్చు అపూర్వమైనదని ముఖ్యమంత్రి హైలైట్ చేశారు.
బాలీవుడ్ నటి కాజోల్ పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. పెళ్ళికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందన్నారు. అలాగే, రెన్యువల్ ఆప్షన్ కూడా ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పలువురు సినీ ప్రముఖులను ఆశ్చర్యానికి గురిచేశాయి. గత రెండున్నదశాబ్దాలకు పైగా వైవాహిక జీవితాన్ని గడుపుతున్న కాజల్ అగర్వాల్ ఇపుడు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారాయి.
తూర్పు కనుమల్లోని రక్షిత మంగళం పేట అటవీ భూముల్లో 76.74 ఎకరాల అక్రమ ఆక్రమణను ప్రత్యేక వైమానిక సర్వేలో వెల్లడైంది. దీనికి మాజీ అటవీ మంత్రి, సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డితో సంబంధం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ స్థలాన్ని సందర్శించి, ఉల్లంఘనలను అంచనా వేసి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, క్యాబినెట్ మంత్రులకు వివరించారు.
దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్ట్ కోసం భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యాడు. రాజ్కోట్లో దక్షిణాఫ్రికా ఏతో జరిగే వన్డే సిరీస్ కోసం నితీష్ ఇండియా ఏ జట్టులో చేరనున్నారు. ఇండియా ఏ, దక్షిణాఫ్రికా ఏ మధ్య మూడు వన్డేలు నవంబర్ 13 నుండి 19 వరకు నిరంజన్ షా స్టేడియంలో జరుగుతాయి. ఎ సిరీస్ ముగిసిన తర్వాత రెడ్డి రెండో టెస్టుకు నితీష్ కుమార్ రెడ్డి తిరిగి జట్టులోకి వస్తాడు.
ప్రముఖ టెక్ సంస్థ అమెజాన్ వెబ్ సర్విసెస్ భాగస్వామ్యంతో త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్బాట్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ అత్యాధునిక చాట్బాట్కు అవసరమైన సాఫ్ట్వేర్ను ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా భక్తులు శ్రీవారి దర్శనం, వసతి గదుల లభ్యత, విరాళాలు ఇతర సేవలకు సంబంధించిన సమాచారాన్ని క్షణాల్లో పొందవచ్చు.
ఒంటరి తల్లి జీవితం కష్టమని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్పష్టం చేసింది. తన ఆప్తమిత్రురాలు, బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్తో కలిసి నిర్వహించిన పాడ్కాస్ట్లో సానియా మీర్జా మాట్లాడుతూ.. తన జీవితంలో ఎదుర్కొన్న తీవ్రమైన ఒత్తిడి గురించి గుర్తుచేసుకుంది. ఒకసారి తనకు పానిక్ అటాక్ వచ్చినప్పుడు, ఫరా ఖాన్ వచ్చి అండగా నిలిచారని తెలిపింది.
ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెళ్ళి సంబంధాలు కుదరడం లేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది.
కోల్కతా పోలీసులు మహానగరం అంతటా, ముఖ్యంగా ఈడెన్ గార్డెన్స్ స్టేడియం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. శుక్రవారం భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ క్రికెట్ ప్రారంభం కానుంది. స్టేడియం, పరిసర ప్రాంతాలలో సమగ్ర భద్రతా ఏర్పాట్లు అమలు చేయబడ్డాయని అధికారులు తెలిపారు. రెండు జట్ల హోటళ్ళు, ప్రాక్టీస్ వేదికల మధ్య సురక్షితమైన ప్రయాణంతో సహా తాము రక్షణను బలోపేతం చేశామని చెప్పుకొచ్చారు. మ్యాచ్ జరిగే ఐదు రోజుల పాటు పటిష్టమైన భద్రత అమలులో ఉంటుంది.
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా భారత్కు సహకరించేందుకు అగ్రరాజ్యం అమెరికా ముందుకు వచ్చింది. అయితే, అమెరికా ప్రతిపాదనను భారత ప్రభుత్వం తోసిపుచ్చిందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. ఈ పేలుడుకు సంబంధించి దర్యాప్తునకు సాయం చేసేందుకు తాము ముందుకు వచ్చామని, కానీ ఆ అవసరం భారత్కు లేదని తెలిపారు.
ఏపీలో రూ.82వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రిన్యూ పవర్ సిద్ధంగా వుంది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ధ్రువీకరించారు. ఈ పెట్టుబడి సౌర ఇంగోట్, వేఫర్ తయారీ నుండి ప్రాజెక్ట్ అభివృద్ధి వరకు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ మాలిక్యూల్ ఉత్పత్తి వరకు మొత్తం పునరుత్పాదక ఇంధన విలువను కవర్ చేస్తుంది.
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసుకు సంబంధించి మరో కీలక విషయం వెలుగుచూసింది. ఈ పేలుడుకు కారణమైన కారులో లభించిన నమూనాలతో డాక్టర్ ఉమర్ నబీ డీఎన్ఏ మ్యాచ్ అయినట్లు సమాచారం. ఫోరెన్సిక్ ల్యాబ్ ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటరు దేవుళ్ళు ఇచ్చిన తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైవుంది. అయితే, ఈ స్థానం నుంచి ఎవరు విజేతగా నిలుస్తారన్న అంశంపై ఇపుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. తక్కువ పోలింగ్ శాతం తమకే అనుకూలమని అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం భారాస విశ్లేషిస్తున్నాయి.
ప్రముఖ సినీ కళా దర్శకుడు తోట తరణిపై జనసేన పార్టీ అధినేత, సినీ హీరో, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. దీనికి కారణం లేకపోలేదు. తోట తరణికి ఫ్రాన్స్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన 'చెవాలియర్ డె లా లీజియన్ డి హానర్'ను ప్రకటించింది. దీనిపై పవన్ హర్షం వ్యక్తం చేస్తూ ఈ విశిష్ట గౌవరం అందుకున్న తోట తరణికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణను చలి వణికిస్తోంది. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో చలి మరింత తీవ్రం కానుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇందులో భాగంగా పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లను జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతున్నాయి. తద్వారా చలి తీవ్రతకు తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కతున్న చిత్రం 'స్పిరిట్'. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. అయితే, ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి అతిథి పాత్రలో నటిస్తున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. దీనిపై చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్వయంగా స్పందించారు
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ సంబంధాన్ని ఇంతవరకు బహిరంగంగా ప్రకటించలేదు, కానీ వారి ప్రేమను ప్రతిబింబించే క్షణం నిన్న వచ్చేసంది. ఈ జంట ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్లోని ఉదయపూర్లో గ్రాండ్గా కానీ సన్నిహితంగా ఉండే వివాహ వేడుకను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కానీ వీటి గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. కానీ గత రాత్రి జరిగిన ది గాళ్ ఫ్రెండ్ సక్సెస్ మీట్ లో విజయ్.. రష్మిక మందన్నా చేయి తీసుకుని ముద్దుపెట్టుకున్నారు. సాక్షిగా అల్లు అరవింద్ వున్నారు.
రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహించారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ 5 రోజుల్లో 20.4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ ను హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.
SSMB29 చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తాజాగా ఆ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న ప్రియాంకా చోప్రా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. గ్లోబ్ ట్రాటర్ (Globetrotter) అనే చిత్ర టైటిల్తో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా లుక్ ఆకట్టుకునేవిధంగా వుంది. సాంప్రదాయ చీర కట్టులో వున్న ప్రియాంకా చోప్రా చేతిలో మాత్రం తుపాకీని పట్టుకుని ఫైర్ చేస్తోంది. ఈ స్టిల్ ను షేర్ చేస్తూ రాజమౌళి.. ప్రపంచ వేదికపై భారతీయ సినిమాను పునర్వచించిన మహిళ అయిన దేశీ గర్ల్కి తిరిగి స్వాగతం, మందాకినిని అనేక షేడ్స్ ను ప్రపంచానికి పరిచయం చేయలేకుండా వుండలేకపోతున్నాన్నారు.
శరీరానికి సహజసిద్దంగా శక్తిని అందించే ఆహార పదార్థాలు కొన్ని వున్నాయి. వాటిని తింటుంటే తక్షణ శక్తి లభిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము.అరటిపండులోని కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు, పొటాషియంలు శీఘ్రమైన-స్థిరమైన శక్తిని అందిస్తాయి.క్వినోవాలో పూర్తి ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్- మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది.చియా విత్తనాలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో సహా పోషకాలతో నిండి ఉంటాయి.బాదంపప్పులు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ యొక్క గొప్ప మూలం. అవి స్థిరమైన శక్తిని అందిస్తాయి.బచ్చలికూరలో ఐరన్, మెగ్నీషియం, అవసరమైన విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదంకార్యసాధనకు ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలుపరిస్థితులు చక్కబడతాయి. సన్నిహితుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఒక సమాచారం ఆలోచించేస్తుంది. పత్రాల విషయంలో జాగ్రత్త వహించండి.
కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి మరో షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ద్వారా కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి మిస్టరీ వీడినట్లైంది. మోటారు సైకిల్ను ఢీకొనడంతోనే కర్నూలు ఘోర ప్రమాదం జరిగిందని తొలుత అందరూ భావించారు. కానీ ఈ కేసుపై జరిగిన విచారణలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. వేమూరి కావేరి బస్సు ప్రమాదానికి ముందు.. శివ యాక్సిడెంట్కి సంబంధించిన దృశ్యాలు మరో బస్సు కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
డిజిటల్ మీడియా ప్రకటనల ఉల్లంఘనలలో ఆధిపత్యం చెలాయిస్తూనే ఉందని, మొత్తం 97% వాటా కలిగి ఉందని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) అర్థ-వార్షిక ఫిర్యాదుల నివేదిక (2025–26) తెలియజేస్తోంది. ఏప్రిల్, సెప్టెంబర్ 2025 మధ్య, ASCI 6,841 ఫిర్యాదులను సమీక్షించింది. 6,117 ప్రకటనలపై విచారణ చేసింది. వీటిలో 98 శాతం వాటికి సవరణ అవసరం. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఫిర్యాదులలో 70% పెరుగుదల, ప్రాసెస్ చేయబడిన ప్రకటనలలో 102% పెరుగుదల ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని అరకు లోయలో ఒక షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. స్థానిక ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్లో ఒక వ్యక్తి నిద్రిస్తున్న రోగుల నుండి మొబైల్ ఫోన్లను దొంగిలిస్తున్నట్లు కనిపించిన ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో, వైద్య సౌకర్యాల లోపల భద్రత లేకపోవడంపై నెటిజన్లను ఆందోళనకు గురిచేసింది.