పెరుగుతున్న చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మెంతి నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెంతి గింజల్లో ఫైబర్ వుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, రక్తంలో చక్కెరను సాధారణంగా ఉంచుతుంది.ఒక చెంచా మెంతి గింజలను 200-250 మిల్లీ లీటర్ల నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే ఫిల్టర్ చేసిన నీటిని తాగాలి. నానబెట్టిన మెంతి గింజలను కూడా నమలవచ్చు. దీనితోపాటు ఉదయం 200-250 మిల్లిలీటర్ల నీటిలో 1 టీస్పూన్ మెంతి గింజలను ఉడకబెట్టవచ్చు. దీనిని వడకట్టి త్రాగాలి, గింజలను నమలాలి.మజ్జిగ మొదలైన వాటిలో మెంతి గింజల పొడిని కూడా తీసుకోవచ్చు. ఏదైనా ఆరోగ్య చిట్కాను అనుసరించే ముందు నిపుణుడిని సంప్రదించండి.

బెంగళూరుకు చెందిన పందొమ్మిదేళ్ల తుషార్ షా, స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో రెండవ సంవత్సరం చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థి, ఒక గాడ్జెట్‌ను మాత్రమే కాకుండా సామాజిక బాధ్యత, ఆవిష్కరణ కలయికను ప్రతిబింబించే పరిష్కారాన్ని అందించాడు. అతని ఆవిష్కరణ, పెర్సీవియా-దృష్టి లోపం ఉన్నవారికి సహజమైన గ్లాసెస్-శామ్‌సంగ్ సాల్వ్ ఫర్ టుమారో 2025 యొక్క జాతీయ విజేతలలో అతనికి స్థానం సంపాదించింది.శామ్‌సంగ్ సాల్వ్ ఫర్ టుమారో సంస్థ యొక్క ప్రధాన విద్యా కార్యక్రమం, ఇది యువ ఆవిష్కర్తలను వాస్తవ ప్రపంచ సమస్యలను గుర్తించి, సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ప్రోత్సహిస్తుంది.

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో లగేజ్ చెకింగ్ పాయింట్ వద్ద ఒక్కసారిగా ఓ వ్యక్తి కుప్పకూలింది. వైద్య బృందానికి సమాచారం ఇచ్చాక.. ఆ వ్యక్తికి ఎయిర్‌పోర్టు సిబ్బంది సీపీఆర్ అందించారు. వైద్యుడు వచ్చేలోపు సీపీఆర్ అందించడం వల్ల.. ఆ ప్రయాణీకుడు ఊపిరి తీసుకున్నాడు.ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) అధికారి ఒకరు సెప్టెంబర్ 1, 2025న ప్రీ-ఎస్‌హెచ్ఎ ప్రాంతంలో కుప్పకూలిన మహ్మద్ మొఖ్తార్ ఆలం అనే ప్రయాణికుడిని కాపాడారు. సబ్-ఇన్‌స్పెక్టర్ వీరేంద్ర సింగ్ అక్కడికక్కడే కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్)ను త్వరగా అందించారు.

రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహించారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ 5 రోజుల్లో 20.4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ ను హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.

శరీరానికి సహజసిద్దంగా శక్తిని అందించే ఆహార పదార్థాలు కొన్ని వున్నాయి. వాటిని తింటుంటే తక్షణ శక్తి లభిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము.అరటిపండులోని కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు, పొటాషియంలు శీఘ్రమైన-స్థిరమైన శక్తిని అందిస్తాయి.క్వినోవాలో పూర్తి ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్- మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది.చియా విత్తనాలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో సహా పోషకాలతో నిండి ఉంటాయి.బాదంపప్పులు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ యొక్క గొప్ప మూలం. అవి స్థిరమైన శక్తిని అందిస్తాయి.బచ్చలికూరలో ఐరన్, మెగ్నీషియం, అవసరమైన విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.