తమిళనాడు రాష్ట్రంలోని తేని జిల్లాలో ఓ విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. తనకు ఓ కేజీ మటన్ ఉచితంగా ఇవ్వాలని ఓ వ్యాపారిని ఓ వ్యక్తి అడిగాడు. దీనికి ఆ వ్యాపారి నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన ఆ వ్యక్తి శ్మశానానికి వెళ్లి పాతిపెట్టిన ఓ మృతదేహాన్ని తవ్వి తీసుకుని మటన్ దుకాణం వద్దకు వచ్చాడు. మృతదేహాన్ని చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు.
హీరో రామ్ చరణ్ తనకు కొడుకు లాంటివాడని, తనకున్న ఏకైక మేనల్లుడు అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నగరంలో విలేకరులతో మాట్లాడుతూ, ఓ ఈవెంట్లో రామ్ చరణ్ స్థాయిని తగ్గించేలా మాట్లాడినట్టుగా మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారని, చెర్రీని తాను ఉద్దేశ్యపూర్వకంగా ఏమీ అనలేదని స్పష్టం చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు పరిస్థితిని వివరించే క్రమంలో తాను మాట్లాడిన మాటలు మరోలా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు.
హీరోయిన్ సమంతతో విడాకుల అంశంపై హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. సమంతతో విడాకుల అంశం జనాలతో పాటు మీడియాకు ఒక ఎంటర్టైన్మెంట్ అంశంగా మారింపోయిందంటూ కామెంట్స్ చేశారు. మేమిద్దరం కలిసే విడాకులు తీసుకున్నామని, వ్యక్తిగతంగా, ఏకపక్షంగా విడాకులు తీసుకోలేదని ఆయన స్పష్టంచేశారు.
సోషల్ మీడియాలో ఫన్మోజీకి ఉండే ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. యూట్యూబ్లో ఫన్మోజీ నుంచి వచ్చే కంటెంట్ అందరినీ ఆకట్టుకుంటూ బిలియన్ల వ్యూస్, మిలియన్ల సబ్ స్క్రైబర్లను సాధించుకుంది. ఇక ఇప్పుడు ఈ టీం వెండితెరపైకి రాబోతోంది. మన్వంతర మోషన్ పిక్చర్స్, శివం సెల్యూలాయిడ్స్ బ్యానర్ల మీద సుశాంత్ మహాన్ హీరోగా కె. సుధాకర రెడ్డి, రవి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ ను అఖండ 2 – తాండవం లో బోయపాటి శ్రీను సరికోత్హగా చుపిస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఇప్పడు మరో విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరిగుతుంది. దీనిపై మరో క్రేజీ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రలు చేస్తున్నాడు. ఒక పాత్ర నెగిటివ్, మరో పాత్ర పాజిటివ్ అని తెలుస్తోంది. సహజంగా ఇంటర్వెల్ లోనే బాలయ్య రెండో పాత్ర రివీల్ అవుతుంది. ఇందులోనూ అదే జరుగుతుంది. కాగా, రెండో బాలయ్య సింపతి క్రియేట్ చేస్తుందని అంటున్నారు.
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి సి.ఎస్. రంగరాజన్పై జరిగిన దాడిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ సంఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రంగరాజన్పై ఒక బృందం దాడి చేసినట్లు తెలిసి తీవ్ర బాధ కలిగిందని, ఈ దాడి దురదృష్టకరమని ఆయన అన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని, ధర్మ పరిరక్షణపై జరిగిన దాడి అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
ప్రతి ఒక్కరూ హెల్త్ కేర్ తీసుకోవాలని ఐశ్వర్య రాజేష్ అన్నారు. 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ఫేమ్ ఐశ్వర్య రాజేష్ ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ 'కలర్స్' (Kolors Healthcare) బంజారా హిల్స్ బ్రాంచీలో సందడి చేసింది. ఈ సందర్భంగా 'కలర్స్ హెల్త్ కేర్ 2.O' యూనిట్ని ప్రారంభించింది. ఆధునిక టెక్నాలజీతో ఈ సంస్థ అందిస్తున్న సేవలను ఆమె స్వయంగా పరిశీలించింది.
సందీప్ కిషన్ 30వ మూవీ 'మజాకా' సినిమాలో సందీప్ కిషన్, రీతు వర్మ ల ఫోటోలను చుస్తే రోమాన్స్ పెంచినట్లు కనిపిస్తుంది. త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ మూవీ టీజర్ హిలేరియర్స్ ఎంటర్టైమెంట్ ని అందించింది. ఈ చిత్రం ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ ల కొలాబరేషన్ లో రాజేష్ దండా నిర్మిస్తున్నారు. సహ నిర్మాత బాలాజీ గుత్తా. రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తున్న మజాకాలో రావు రమేష్ అన్షు కూడా కీలక పాత్రల్లో నటించారు.
విరాజ్ రెడ్డి చీలం హీరోగా జగ పెద్ది దర్శకత్వంలో అను ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనసూయ రెడ్డి నిర్మించిన చిత్రం ‘గార్డ్’. రివేంజ్ ఫర్ లవ్ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28న రిలీజ్ చేయబోతోన్నారు. సినిమా మొత్తాన్ని ఆస్ట్రేలియాలో షూట్ చేయడం విశేషం. హారర్, థ్రిలర్, లవ్ ఎలిమెంట్స్తో రాబోతోన్న ఈ చిత్రంలో మిమీ లియానార్డ్, శిల్పా బాలకృష్ణ కథానాయికలుగా నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది.
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ కిరణ్ రాయల్పై సంచలన ఆరోపణలు చేసిన మహిళ లక్ష్మి వ్యవహారంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. తిరుపతి ప్రెస్క్లబ్లో విలేఖరుల సమావేశాన్ని ముగించుకుని వస్తున్న ఆమెను రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆన్లైన్ మోసం కేసులో లక్ష్మిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత ఆమెును ఎస్వీయూ పోలీస్ స్టేషన్కు తరలించారు.
పా పాండి, రాయన్ వంటి బ్లాక్ బస్టర్ల తరువాత ధనుష్ ‘జాబిలమ్మ నీకు అంతా కోపమా’ అంటూ దర్శకుడిగా మరోసారి అందరినీ మెప్పించేందుకు రెడీ అయ్యారు. ధనుష్ హోమ్ బ్యానర్ అయిన వండర్బార్ ఫిల్మ్స్, ఆర్కె ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ మూవీని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి విడుదల చేస్తోంది.
"ఒరేయ్ శీను భార్యకు, చీరకు వున్న తేడా ఏంటో తెలుసా?" అడిగాడు వంశీ."తెలియదే.. ఏంటది?" అడిగాడు శీను "చెప్తా విను.. చీరని ఉతికిన తర్వాత కట్టుకుంటారు. భర్తను కట్టుకున్న తర్వాత ఉతుకుతారు.." చెప్పాడు వంశీ
తక్కువ బడ్జెట్ చిత్రమా? కొత్త నటీనటులా అనే విషయాన్ని పట్టించుకోకుండా మంచి కంటెంట్తో ఫీల్గుడ్గా నిలిచే చిత్రాలు మంచి విజయాలను అందుకొంటున్నాయని తెలంగాణా రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. కంటెంట్ ప్రధానంగా వచ్చే చిత్రాలే ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతున్నాయని ఆయన తెలిపారు. "తకిట తదిమి తందాన" చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కారం అనంతరం ఆయన చిత్రబృందాన్ని అభినందిస్తూ పైవిధంగా పేర్కొన్నారు.
పేటీఎం తన యాప్లో కొత్త సేవను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా దేశ, విదేశాల్లో సులభంగా హోటళ్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ను సులభతరం చేయడానికి, పేటీఎం బ్రాండ్ కింద పనిచేసే One97 కమ్యూనికేషన్స్ డిజిటల్, ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫామ్ Agodaతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతికి సహాయం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట బైపాస్ రోడ్డులోని వై జంక్షన్ వద్ద సోమవారం జరిగిన ఈ సంఘటనలో ఒక యువతి గాయపడింది.అదే సమయంలో, శ్రీశైలంకు వెళుతూ అనిత అదే మార్గంలో ప్రయాణిస్తుండగా, ప్రమాదాన్ని గమనించిన ఆమె తన కాన్వాయ్ను ఆపి గాయపడిన మహిళకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. గాయపడిన మహిళకు తాగునీరు అందించింది, భరోసా ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఓ దారుణ ఘటన జరిగింది. పాఠశాల నుంచి ఇంటికి ఆలస్యంగా వచ్చిన కుమారుడుపై మద్యం మత్తులో ఉన్న కన్నతండ్రి పిడిగుద్దులు కురిపించాడు. విచక్షణ కోల్పోయి విపరీతంగా దాడి చేయడంతో ఈ దారుణం శనివారం రాత్రి చోటుచేసుకోగా ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది.
టాలీవుడ్ మూవీ మంగళవారం పెద్దగా హిట్ కాకపోయినా, దాని ప్రత్యేకమైన కథాంశం, నవలా పాత్రలు, మంచి సాంకేతిక విలువలతో కూడిన ఆసక్తికరమైన కథనం కోసం విమర్శకులు, ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలను పొందింది. మొదటి భాగంలో పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్ర పోషించినప్పటికీ, సీక్వెల్లో ఆమె ప్రధాన కథానాయికగా తిరిగి రాదని టాక్ వస్తోంది. బదులుగా, చిత్రానికి కొత్త ఆకర్షణను తీసుకురావడానికి దర్శకుడు కొత్త ముఖాన్ని పరిశీలిస్తున్నాడు.
దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో చాలా కాలంగా ఒక ట్రెండ్ ఉంది. ఒక సినిమా హిట్ అయినప్పుడు, సక్సెస్ పోస్టర్లలో హీరో మాత్రమే ప్రముఖంగా కనిపిస్తాడు. అయితే కీలక పాత్ర పోషించిన హీరోయిన్ పక్కన పెట్టబడతారు. తండేల్ ప్రమోషన్ల సమయంలో, నాగ చైతన్య సాయి పల్లవికి సినిమా సక్సెస్ పోస్టర్లపై తగిన క్రెడిట్ లభిస్తుందని హామీ ఇచ్చాడు. దీంతో దక్షిణాది ట్రెండ్ను చైతన్య మార్చేశాడు. చై తన మాటను నిలబెట్టుకోవడం చూడటం పట్ల ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఫిబ్రవరి 12న తిరుమలలో నెలవారీ పౌర్ణమి గరుడసేవ జరుగుతుంది. ఈ సందర్భంగా, శ్రీ మలయప్ప స్వామి సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు నాలుగు మాడ వీధుల్లో విహరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం వాహన సేవను ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
హైదరాబాద్ నగరంలోని అక్రమ నిర్మాణాలను తొలగించేందు ఆ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో ఓ స్వతంత్ర బాడీని ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు కమిషనర్గా రంగనాథ్ను ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. హైడ్రా కమిషనర్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆయన మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఒక అమానవీయ సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఒకడు సభ్యసమాజం తలదించుకునే పాడపనికి పాల్పడ్డాడు. ఓ మహిళతో సహజీవనం చేస్తూనే.. ఆ మహిళకు చెందిన ఇద్దరు కుమార్తెలపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఆరేళ్లుగా ఈ తంతు కొనసాగించాడు. ఈ క్రమంలో ఆ టీచర్ అనారోగ్యానికి గురికావడంతో వివిధ రకాలైన రక్తపరీక్షలు చేయగా, ఇందులో హెచ్.ఐ.వి సోకినట్టుు తేలింది. అదేసమయంలో బాలికలిద్దరు కూడా తమకు జరిగిన అన్యాయాన్ని తల్లికి చెప్పారు. దీంతో ముగ్గురూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
ఓ పెద్దపులి వద్ద ఓ బుడ్డోడు చిక్కుకున్నాడు. జూ ఫెన్సింగ్ వద్ద నిలబడి పులిని చూస్తున్న ఓ బుడతడు చొక్కాను పులి నోటితో పట్టుకుంది. దాని నుంచి తప్పించుకునేందుకు ఎంతగానో ఆ బుడ్డోడు ప్రయత్నించాడు. కానీ, ఆ పులి చొక్కాను మాత్రం వదిలిపెట్టదు. పైగా, ఆ బుడ్డోడితో ఆ పులి ఎప్పటినుంచో సావాసం చేసినట్టు కనిపిస్తుంది.
శివపూజలో ప్రదోష కాలానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. వ్యాస మహర్షి రచించిన శివ మహా పురాణం ప్రకారం సౌమ్య ప్రదోషం రోజు శివ పార్వతులను పూజించడం వల్ల మన మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం. పరమేశ్వరుని పూజకు విశిష్టమైన ప్రదోష వ్రతం రోజున ఆది దంపతులైన శివపార్వతులను పూజిస్తే సుఖసంతోషాలతో జీవిస్తారని విశ్వాసం. ఈ రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి, శుచియై శివ పార్వతులని మల్లెలతో పూజించాలి.
ఓ యువ డాక్టరమ్మ తాను మరణిస్తూ మరో ఐదుగురికి ప్రాణం పోసింది. ఒక్కగానొక్క కుమార్తె తమకు దక్కదన్న కొండంత దుఃఖాన్ని దిగమింగుకుని, అవయవాలను దానం చేసి బిడ్డ కోరిక తీర్చారు ఆమె తల్లిదండ్రులు.. శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపులు మండల నంగివాండ్లపల్లికి చెందిన నంగి నందకుమార్ రెడ్డి, లోహితల కూతురు భూమికారెడ్డి (24). ఇటీవలే వైద్య విద్య పూర్తిచేసి హైదరాబాద్ ఎల్బీ నగరులోని కామినేని ఆస్పత్రిలో హౌస్ సర్జన్గా వైద్య సేవలు అందిస్తోంది.
మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కనుక ఉన్నన్నాళ్లూ దుఃఖానికి దూరంగా ఆనందాలకు దగ్గరగా వుంటూ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ వుండాలి. ఎందుకంటే ఈమధ్య కాలంలో చూస్తూ చూస్తూనే గుండెపోటుతో కుప్పకూలి మరణిస్తున్నవారి సంఖ్య అధికమవుతోంది. అసలు విషయానికి వస్తే... పరిణీత జైన్ తన సోదరి పెళ్లిలో సంతోషంగా నృత్యం చేస్తుండగా, కొన్ని సెకన్లలోనే ఆమెకు గుండెపోటు వచ్చింది. దాంతో ఆమె నృత్యం చేస్తుండగానే స్టేజి పైన కుప్పకూలిపోయి నిర్జీవంగా మారిపోయింది. పెళ్లి ఆనందం అంతా శోకసంద్రంగా మారింది. కనుక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ వుండాలి.
రాజమండ్రిలో రామ్ పోతినేనికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. గోదావరి జిల్లాలలో సంప్రదాయం ప్రతిబింబించేలా అరటి పళ్ళతో చేసిన భారీ దండతో వెల్కమ్ చెప్పారు. RAPO22 లేటెస్ట్ షెడ్యూల్ కోసం రాజమండ్రి వెళ్తే... ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఇప్పటివరకు ఏ హీరోకి ఇటువంటి ఘన స్వాగతం రాజమండ్రిలో దక్కలేదు. అరటిపళ్ల దండ అందుకున్న మొదటి హీరో రామ్.
బ్రిటిష్ సింగర్ ఎడ్ షీరన్ బెంగళూరులోని చర్చ్ స్ట్రీట్లో షేప్ ఆఫ్ యూ పాటను పాడారు. అయితే ముందస్తు అనుమతి లేకుండా లైవ్ ప్రదర్శన చేపట్టారంటూ ఓ పోలీసు ఎంటరై ఎడ్ షీరన్ పాడుతుండగానే మైక్ వైర్ తీసివేశాడు. ఈ వ్యవహారం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఈ బ్రిటిష్ సింగర్ ఎడ్ షీరన్ ప్రస్తుతం భారతదేశ పర్యటనలో ఉన్నాడు. అతను ఇప్పటికే హైదరాబాద్, చెన్నైలలో తన ప్రదర్శనలు ఇచ్చాడు. చెన్నైలో జరిగిన మ్యూజిక్ ప్రోగ్రామ్లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్.రెహమాన్తో కలిసి ఎడ్ షీరన్ క్లాసిక్ ఊర్వశి సాంగ్ను పాడారు. ఇక తాజాగా చర్చ్ స్ట్రీట్లో పాడటంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మణిపూర్ ముఖ్యమంత్రి పదవికి బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ అజయ్ భల్లాకు సమర్పించారు. బడ్జెట్ సమావేశాల సమయంలో బీరేన్ సింగ్ రాజీనామా చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. పైగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అదేసమయంలో మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "సంతాన ప్రాప్తిరస్తు".ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ హీరోగా "ఏబీసీడీ" సినిమా, రాజ్ తరుణ్ తో "అహ నా పెళ్లంట" అనే వెబ్ సిరీస్ రూపొందించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా తెరకెక్కుతోంది.
ఆరాధ్య దేవి ప్రదాన పాత్రతో రామ్ గోపాల్ వర్మ నేతృత్వంలో తెరకెక్కిన 'శారీ' చిత్రం త్వరలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్ ను హీరొయిన్ జంతు ప్రేమికురాలిగా చూపిస్తూ కొత్త ప్రక్రియ చేసారు వర్మ. చిత్ర హీరోయిన్ ఆరాధ్య దేవి తో నవీన్ కళ్యాణ్ 'యానిమల్ ఆరాధ్య' టైటిల్ తో ఫోటో సిరీస్ రూపొందించి సరికొత్త ప్రయోగం చేసాడు. హైదరాబాద్ లోని ఓ పబ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామ్ గోపాల్ వర్మ హాజరై ఫోటో సిరీస్ ని ఆవిష్కరించారు.
ఏ ఆడబిడ్డకి ఏ కష్టం వచ్చినా నిలబడతా అన్నావ్ కదా పవన్ కళ్యాణ్ అన్నా.. ఇపుడు ఎక్కడ వున్నావ్ అంటూ జనసేన పార్టీకి చెందిన తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జ్ కిరణ్ రాయల్ చేతిలో మోసపోయినట్టుగా చెబుతున్న లక్ష్మీ అనే మహిళ ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ట్రాక్టర్ కాలువ గట్టుపై బోల్తా పడి నలుగురు మహిళా వ్యవసాయ కార్మికులు మృతి చెందారు. పల్నాడు జిల్లా ముప్పళ్ల మండలం బొల్లవరం గ్రామ సమీపంలోని మాదల ప్రధాన కాలువ వద్ద జరిగిన ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడ్డారు.వివరాల్లోకి వెళితే, ట్రాక్టర్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన మహిళలు మిరప తోటలో పనిచేసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
విశ్వక్సేన్ 'లైలా' ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్ లో విడుదల కానుంది.
దేశంలో ఒక్క మావోయిస్టు కూడా లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. పైగా, మావోయిస్టుల దాడిలో ఇకపై ఒక్క పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోవడానికీ వీల్లేదని, అందువల్ల 2026 మార్చి నెలాఖరు నాటికి దేశంలో మావోల ఉనికి లేకుండా చేస్తామని హెచ్చరించారు.
విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా' ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా మాస్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
ఆస్తి కోసం ఓ వ్యక్తి అంత్యక్రియలను కన్నతల్లి, సోదరి ఆపేశారు. దీంతో గత రెండు రోజులుగా ఆ వ్యక్తి మృతదేహం ఇంటివద్దే ఉంటుంది. భర్త శవాన్ని చూసిన భార్య రోదనలు మిన్నంటుతున్నాయి. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరులో చోటుచేసుకుంది.
స్వదేశంలో పర్యాటక ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్లో భాగంగా, ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ వీర బాదుడు బాదాడు. ఫలితంగా 304 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని భారత్ ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ ఇన్నింగ్స్లో 7 సిక్స్లు, 12 ఫోర్లు ఉండగా, 90 బంతుల్లో 119 పరుగులు చేశాడు. చాలా రోజుల తర్వాత రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా బ్యాట్తో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, బ్యాటింగ్ను ఎంజాయ్ చేశానంటూ కామెంట్స్ చేశారు.
సమాజంలోని కొందరు కామాంధులు ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. నిండు అంధురాలైన ఓ యువతిపై వరుసకు మామ అయ్యే ఓ కామమృగం అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
మెగాస్టార్ చిరంజీవి జై జనసేన అంటూ నినందించారు. ఆ తర్వాత ఆయన చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ అయ్యాయి. నాటి ప్రజారాజ్యమే నేటి జనసేన అని వ్యాఖ్యానించారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మెగా ఫ్యాన్స్ను తెగ ఖుషీ చేస్తున్నాయి.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కంచికర్లలో ఓ దారుణం జరిగింది. మాయ మాటలు, పెళ్లి పేరుతో ఓ యువతి మోసపోయింది. ప్రేమ పేరుతో నమ్మించిన ప్రియుడే తన స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత వీడియో తీశామంటూ నిత్యం బెదిరిస్తూ వేధిస్తుండటంతో ఈ వేధింపులను తాళలేక బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో చోటుచేసుకుంది.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదులపై నమోదైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కీలోని భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాకలో ఉన్న శ్రీవైష్ణవి డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో అపూర్వ చావడా, తమిళనాడు రాష్ట్రం దిండింగల్లోని ఏఆర్ డెయిరీ ఎండీ డా.రాజు రాజశేఖరన్లను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అరెస్టు చేశారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిషలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. తన సోదరి పెళ్ళి వేడుకలో స్టేజీపై డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అక్కడే ఉన్న బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించాయి. దీనికి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తెలంగాణా రాష్ట్రంలో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ చిలుకూరుపై ఆయన నివాసంలోనే దాడి జరిగింది. శుక్రవారం ఈ దాడి జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రధాన అర్చకుడుపై ఏకంగా 20 మంది వరకు దాడి చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదంఓర్పుతో యత్నాలు సాగించండి. సంప్రదింపులు వాయిదా పడతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. దుబారా ఖర్చులు విపరీతం. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి.
టాటా మోటార్స్, భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ, ఈ రోజు గౌహతిలో రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీను ప్రారంభించింది. 'Re.Wi.Re-రీసైకిల్ విత్ రెస్పెక్ట్' అని పేరు పెట్టబడిన ఈ అత్యాధునిక ఫెసిలిటీ స్థిరమైన, పర్యావరణ స్పృహ గల ప్రక్రియలను ఉపయోగించి ఏటా 15,000 ఎండ్-ఆఫ్-లైఫ్ వాహనాలను సురక్షితంగా విచ్ఛిన్నం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ RVSFను టాటా మోటార్స్ భాగస్వామి అయిన అక్సోమ్ ప్లాటినమ్ స్క్రాపర్స్ నిర్వహిస్తోంది. ఇది అన్ని బ్రాండ్లకు చెందిన ప్రయాణికుల, వాణిజ్య వాహనాలను విచ్ఛిన్నం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.
తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ మీడియా ముందుకు వచ్చారు. తనపై గత నాలుగు రోజులుగా వైసిపి నాయకులు చేస్తున్న ఆరోపణల విషయమై ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషనుకు వచ్చినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... '' గతంలో రోజా ఫిర్యాదుతో నాపై కేసులు పెట్టి అరెస్ట్ చేయడమే కాకుండా నా ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లలో వున్న సమాచారాన్ని చోరీ చేసారు. ఇపుడా డేటాతోనే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మహిళను అడ్డం పెట్టుకుని చేస్తున్న రాజకీయానికి నేను భయపడను.
ఈమధ్య కొంతమంది రైతులు ఏకంగా క్రూర మృగాలతో స్నేహం చేస్తున్నట్లు కనబడుతోంది. ఇటీవల ఓ రైతు తన పొలంలోకి వచ్చిన చిరుతపులితో సెల్ఫీ తీసుకోవడం సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. ఈ సెల్ఫీ వీడియోలో చిరుత రైతు ముందు కూర్చుని వుంది. రైతు తన సెల్ ఫోనుని చేతితో పట్టుకోగానే ఉలిక్కిపడి పైకి లేవబోయింది.ఐతే సెల్ఫీ తీసుకున్న తర్వాత రైతు పరిస్థితి ఏమిటి? ఆ చిరుతపులి అతడిని విడిచిపెట్టి వెళ్లిపోయిందా అని కామెంట్లు చేస్తున్నారు కొందరు నెటిజన్లు. మరికొందరైతే... వచ్చిన చిరుతపులి అతడికి పెంపుడు జంతువు అయి వుండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సులో రూ.23 లక్షల నగదు బ్యాగు కనిపించకుండా పోయింది. ఈ నగదు బ్యాగును బస్సులో పెట్టి టిఫిన్ చేయడానికి వెళ్లి తిరిగి బస్సులోకి వచ్చి చూడగా ఆ బ్యాగు కనిపించకుండా గుర్తు తెలియని దొంగు ఒకరు ఎత్తుకెళ్లిపోయారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొని ఎన్డీయే కూటమి తరపున బీజేపీకి ప్రచారం చేశారు. ఫలితంగా షహదరాలో బీజేపీ అభ్యర్థి 32 యేళ్ల తర్వాత విజయం సాధించారు. ఇక్కడ 1993లో తొలిసారి బీజేపీ అభ్యర్థి రామ్ నివాస్ గోయల్ గెలుపొందారు. ఆ తర్వాత 1998, 2003, 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 2013లో శిరోమణి అకాలీదళ్, 2015, 2020లో ఆప్ అభ్యర్థులు గెలుపొందారు.
మహారాష్ట్రలో ప్రజలను గిలియన్ బార్ సిండ్రోమ్ (జీబీఎస్) వణికిస్తుంది. జీబీఎస్ కేసులు నానాటికీ పెరిగిపోతున్నయి. ఈ సిండ్రోమ్ శరవేగంగా వ్యాపిస్తుంది. దీనికి కారణమే శనివారం కొత్తగా మరో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో జీబీఎస్ కేసుల సంఖ్య మొత్తం 183కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 151 మంది కోలుకోగా, ఆరుగురు మరణించారు. ఇటీవల ముంబైలో 64 యేళ్ల వృద్ధురాలికి జీబీఎస్ వ్యాధి ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఆ మహిళకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్థానికంగా నీటి శాంపిల్స్ను పరీక్షించడంతో శనివారం మరో రెండు నీటి వనరులు కలుషితమైనట్టు తెలిపింది.