డిజిటల్ అరెస్ట్ కేసులో ఒక మహిళ నుండి రూ. 1.95 కోట్లకు పైగా దోచుకున్నందుకు గుజరాత్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన సయ్యద్ సోయాబ్ జాహిద్ భాయ్, బెలిమ్ అనస్ రహీమ్ భాయ్‌లను అరెస్టు చేశారు.సైబర్ నేరానికి పాల్పడటంలో నిందితులు కీలక పాత్ర పోషించారని, మోసం చేసిన డబ్బును స్వీకరించడానికి, విత్‌డ్రా చేసుకోవడానికి మ్యూల్ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించారని, ఆ తర్వాత ఆ డబ్బును హవాలా నెట్‌వర్క్‌ల ద్వారా దుబాయ్‌లో ఉన్న సైబర్ మోసగాళ్లకు బదిలీ చేశారని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వి. అరవింద్ బాబు తెలిపారు.

తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఒక కీలక మార్పుపై చర్చ జరుగుతోంది. రాష్ట్రానికి త్వరలోనే కొత్త ఇన్‌ఛార్జ్ రాబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయగల నాయకుడిని కాంగ్రెస్ అధిష్టానం కోరుకుంటోంది. అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్, రావత్ వంటి పేర్లను పరిశీలిస్తున్నారు. క్షేత్రస్థాయి అనుభవం ఉన్న సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లోని అంతర్గత విభేదాలు కూడా అధిష్టానాన్ని ఈ నిర్ణయం వైపు పురికొల్పుతున్నాయి. ఈ చర్య ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగం కావచ్చు. మీనాక్షి నటరాజన్ ఫిబ్రవరి 2025లో తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు స్వీకరించారు. పార్టీ ఓటమి పాలైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత, మీనాక్షి పరిస్థితిని సమీక్షించి సమన్వయ లోపాలను గుర్తించారు.

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో జిల్లాల పునర్విభజనపై వచ్చిన సిఫార్సులను మంత్రివర్గం ఆమోదించింది. ఆ ప్రకారం కొత్తగా మరో 3 జిల్లాలు ఏర్పడనున్నాయి. మదనపల్లె, మార్గాపురం, రంపచోడవరం జిల్లాలను ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేయనున్నారు.కాగా తను ప్రాతినిధ్యం వహిస్తున్న అన్నమయ్య జిల్లాలోని రాయచోటిని కొత్తగా ఏర్పడనున్న మదనపల్లె జిల్లాకు కలిపేయడంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. తను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటి నియోజకవర్గం అన్నమయ్య జిల్లా నుంచి మదనపల్లెకు వెళ్లడంపై ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. దాంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను ఓదార్చారు.

పవన్ కల్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి ఉప ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలోని ప్రతి రోడ్డును గుంతలు లేని రోడ్లుగా మారుస్తున్నారు. పంచాయతీల పనితీరును పట్టాలెక్కిస్తున్నారు. పవన్ కల్యాణ్ పనితీరుపై పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని జగ్గయ్యచెరువు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన అభిప్రాయాలను పంచుకున్నారు.ఆయన మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ గారు వచ్చిన తర్వాత పిఠాపురం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతోంది. జగ్గయ్యచెరువు పధిలో అన్నిచోట్లా రోడ్లు నున్నగా వేస్తున్నారు. డ్రైనేజిలు వేస్తున్నారు. గతంలో సామర్లకోట రోడ్డంటే ఆ గోతుల్లో పడి చాలామంది సచ్చిపోయార్లెండి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. చక్కగా అన్నీ చేసేస్తున్నారు.