భారతదేశం త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. పాకిస్తాన్ ఆశ్రయమిస్తున్న ఉగ్రవాద శిబిరాలను తుక్కుతుక్కు చేసాయి. ఇంకోపక్క కరాచీ నౌకాశ్రయాన్ని భారతదేశ ఐఎన్ఎస్ విక్రాంత్ నేలమట్టం చేసింది. ఎటు చూసినా బాంబుల మోతతో పాకిస్తాన్ బెంబేలెత్తిపోతోంది. మరోవైపు క్వెట్టా నగరంలో పాకిస్తాన్ సైనికులపై బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విరుచుకుపడుతోంది. అదనుచూసి పాక్ సైనికులను బెలూచ్ ఆర్మీ అంతుచూస్తోంది.భారత్ సైనిక దాడుల దెబ్బకు పాకిస్తాన్ ప్రధానమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో బాంబులు పడటంతో పాక్ ప్రధాని బిక్కచచ్చిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఆయన్ను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

భారతదేశం-పాకిస్తాన్ (India Pakistan war) మధ్య యుద్ధాన్ని నివారించేందుకు ఆదివారం నాడు పాకిస్తాన్ దేశానికి తను వెళ్లబోతున్నట్లు కె.ఎ.పాల్ (KA Paul) వెల్లడించారు. ఇటీవలే ఈ విషయంపై అమెరికాలోని 9 మంది అగ్ర నాయకులతో మంతనాలు జరిపాననీ, వారు కూడా తన నిర్ణయానికి మద్దతు తెలిపారన్నారు. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తానంటూ చెప్పుకొచ్చారు.ఈ యుద్ధాన్ని ఆపే బాధ్యత పైన దేవుడిది, కింద వున్న నాది అని అన్నారు. టెర్రరిస్టు క్యాంపులను మాత్రమే భారతదేశం టార్గెట్ చేసిందనీ, ఆపరేషన్ సింధూర్ ను వద్దని తను వారించినట్లు చెప్పుకొచ్చారు. ఏదేమైనప్పటికీ తనవంతు ప్రయత్నం మాత్రం చేస్తానని అన్నారు.

ఏప్రిల్ 22న పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు 26 మంది పౌరులను చంపిన పహల్గామ్ దాడుల తర్వాత భద్రతా చర్యల నేపథ్యంలో పాకిస్తాన్‌కు చెందిన అన్ని కంటెంట్‌ను వెంటనే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం గురువారం ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది.సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులో, "భారతదేశంలో పనిచేస్తున్న అన్ని పాకిస్థాన్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, మీడియా స్ట్రీమింగ్, వెబ్ సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు, ఇతర స్ట్రీమింగ్ కంటెంట్‌ను వెంటనే నిలిపివేయాలని కోరింది. జాతీయ భద్రత ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ తెలిపింది.

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) నిర్వహించిన రెండు వేర్వేరు దాడుల్లో 14 మంది పాకిస్తాన్ సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. బీఎల్ఏ స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్ (ఎస్టీఓఎస్) బోలాన్ జిల్లాలోని మాక్ ప్రాంతంలోని షోర్కాండ్ సమీపంలో ఒక సైనిక కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో ఆ స్క్వాడ్ రిమోట్-కంట్రోల్డ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)ని ఉపయోగించింది. ఈ శక్తివంతమైన పేలుడు సైనిక వాహనాన్ని ధ్వంసం చేసింది. స్పెషల్ ఆపరేషన్స్ కమాండర్ తారిక్ ఇమ్రాన్, సుబేదార్ ఉమర్ ఫరూక్‌తో సహా విమానంలో ఉన్న 12 మంది సైనికులందరూ తక్షణమే మరణించారు.

బెంగళూరు: భారతీయ ఆటోమొబైల్ రంగంలో మంచి నమ్మకమైన బ్రాండ్ అనగానే మన అందరికి గుర్తుకు వచ్చేది లెక్సస్ ఇండియా. అద్భుతమైన డిజైన్, ఆకట్టుకునే ప్రీమియం మోడల్స్ తో ఉండే లెక్సస్ కార్లకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. అయితే లెక్సస్‌లో చాలా పాపులర్ మోడల్ LM 350h. ఇప్పుడు ఈ మోడల్ బుకింగ్స్‌ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది లెక్సస్ ఇండియా. లెక్సస్ ఇండియా యొక్క LM 350h మోడల్.. ప్రారంభమైన దగ్గరనుంచి దేశవ్యాప్తంగా లగ్జరీ కార్ల ఔత్సాహికులను ఆకర్షించింది. ఎంతో జాగ్రత్తగా రూపొందించబడిన ఈ అద్భుతమైన మోడల్ అల్ట్రా-లగ్జరీ మొబిలిటీ విభాగాన్ని సరికొత్తగా పునర్నిర్వచించింది.