లక్ష్యం దన్నుగా, ప్రేమపూర్వకమైన మార్గదర్శకత్వంతో హామీలను నిలబెట్టుకోవడంలో ఒక తండ్రి ప్రస్థానాన్ని ప్రతిబింభించే ఎస్‌బీఐ లైఫ్ #PapaHaiNa చిత్రం. చాలా సందర్భాల్లో తండ్రులు నిశ్శబ్దంగా తమ కుటుంబానికి మొక్కవోని చిత్తశుద్ధితో శక్తి, స్థిరత్వాన్ని అందించే మూలస్తంభంగా నిలుస్తుంటారు. తమ కుటుంబ సభ్యుల సంక్షేమానికి, వారి భవిష్యత్తుకు ప్రాధాన్యతనిస్తూ తండ్రులు ఇటు వ్యక్తిగత, అటు వృత్తిగత బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ ఉంటారు. ఈ ఫాదర్స్ డే సందర్భంగా, తండ్రి అందించే శక్తిని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో వారు చూపే చిత్తశుద్ధిని హృదయానికి హత్తుకునే విధంగా, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ తమ #PapaHainNa డిజిటల్ ప్రాపర్టీ కింద 'పాపా భూల్తే నహీ' అనే డీవీసీని రూపొందించింది.

మేఘాలయ రాష్ట్రానికి హనీమూన్‌ కోసం వెళ్లిన నవ దంపతుల్లో వరుడు హత్యకు గురైన కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ హత్య కేసులో మృతుడు భార్య, నవ వధువు సోనమ్ రఘువంశీ, ఆమె ప్రియుడే ప్రధాన సూత్రధారులుగా తేలింది. అయితే, తన కళ్లముందు కిరాయి ముఠా సభ్యులు వేటకొడవలితో నరుకుతుంటే భార్య సోనమ్ అక్కడ నుంచి పారిపోయింది. తన ప్రియుడు రాజ్ కుష్వాహా, మరో ముగ్గురు కిరాయి హంతకులతో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు తేల్చారు. అదేసమయంలో మేఘాలయలో పోలీసులు ఈ హత్యలో క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చసారు. అలాగే, ఈ హత్యకు వాడిన రెండో వేట కొడవలిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

భారతదేశంలోని అగ్రశ్రేణి టెక్ కంపెనీలలో ఒకటైన టీసీఎస్, బెంచ్ పీరియడ్‌కు సంబంధించి కొత్త ఆదేశాలను జారీ చేసింది. జూన్ 12 నుండి కొత్త విధానం అమలులోకి వస్తోంది. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా 225 బిల్ చేయబడిన పని దినాలు పనిచేయాలని నిర్ణయించింది. బెంచ్‌లోని రోజులు 35 రోజులకు పరిమితం చేయబడ్డాయి. ఉద్యోగులు పని చేయని సమయాన్ని తగ్గించడానికి, శ్రామిక శక్తిని గరిష్టంగా ఉపయోగించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రస్తావించబడింది. ఒక ఐటీ సంస్థలో, బిల్ చేయబడిన రోజులు అంటే ఉద్యోగి క్లయింట్, ప్రాజెక్ట్‌లో పనిచేసే రోజులు. దీని అర్థం ఉద్యోగి ఏదైనా ప్రాజెక్ట్‌లో 225 రోజులు పని చేయాల్సి ఉంటుంది.

గత వారం ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన 274 మందిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఎంఎస్సీ పూర్తి చేసిన 23 ఏళ్ల క్రికెటర్ దిర్ధ్ పటేల్ కూడా ఉన్నాడు. గత వారం ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన 274 మందిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఎంఎస్సీ పూర్తి చేసిన 23 ఏళ్ల క్రికెటర్ దిర్ధ్ పటేల్ కూడా ఉన్నాడు. బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానాల సముదాయానికి చెందిన AI 171 గురువారం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్ది సెకన్లకే కూలిపోయింది. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో విమానం టేకాఫ్ అయిన వెంటనే ఎత్తును కోల్పోయిందని అధికారులు తెలిపారు.