తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర అధికారులు సీఎంకు ఘనంగా స్వాగతం పలికారు. ఆపై దర్శనానికి తీసుకెళ్లారు. దర్శనానంతరం, రంగనాయకుల మండపంలో అర్చకులు ఆయనకు పట్టు వస్త్రాలు బహూకరించి, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
వైకుంఠ ఏకాదశి శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైనది. ఈ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ముక్కోటి ఏకాదశి తిథి నాడు మనం ఎలాంటి భగవత్ సంబంధమైన కార్యం చేసినా దాని ఫలితం కూడా కోట్ల రెట్లలో ఉంటుందట. ముక్కోటి ఏకాదశి తిథి రోజు ఒక తులసీ దళం పట్టుకొచ్చి శ్రీమహావిష్ణువు మనస్ఫూర్తిగా సమర్పిస్తే మూడు కోట్ల తులసీ దళాలు సమర్పించిన ఫలితం దక్కుతుందట. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజు భక్తిశ్రద్ధలతో విష్ణు క్షేత్రంలో శ్రీరంగనాథుడి స్మరిస్తూ.. భగవన్నామస్మరణలో ఉంటే అంతకంటే భాగ్యం మరొకటి ఉండదట.
హైదరాబాద్: ఎమ్కే వెల్త్ మేనేజ్మెంట్, ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్కు చెందిన వెల్త్ మేనేజ్మెంట్ విభాగం-ప్రకారం, భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న అధిక-వృద్ధి సంపద కేంద్రంగా హైదరాబాద్ అవతరిస్తోంది. గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు(GCCలు) ఆధారంగా బలపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు వేగంగా విస్తరిస్తున్న స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ ఈ పరిణామానికి ప్రధాన అంశాలుగా నిలుస్తున్నాయి.
1. పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చుల మధ్య బీమా చేయబడిన సభ్యులలో 27 శాతం కంటే ఎక్కువ పెరుగుదలను చూస్తే పెరుగుతున్న అవగాహనను ప్రతిబింబిస్తుంది.2. డెంగ్యూ, మలేరియా, కామన్ ఫ్లూ వంటి అనారోగ్యాలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, గుండె సంబంధిత వ్యాధులు వంటి జీవనశైలి సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, ఆర్థరైటిస్ భారతీయులలో పెరుగుతున్నాయి. 3. గుండె మరియు క్యాన్సర్కు అధిక-విలువ క్లెయిమ్లు పెరుగుతున్న వైద్య సంక్లిష్టతను నొక్కి చెబుతున్నాయి.4. వినియోగదారులు సౌకర్యవంతముగా ఆన్లైన్ అనుభవాలను స్వీకరించడంతో డిజిటల్ పునరుద్ధరణలు, యాప్-నేతృత్వంలోని సేవలు పెరుగుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం తిరుమల పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. ఆయనకు తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు, తితిదే అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ను చైర్మన్ శాలువాతో సత్కరించి, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తితిదే బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి, ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్లు కూడా పాల్గొన్నారు.
డిజిటల్ అరెస్ట్ కేసులో ఒక మహిళ నుండి రూ. 1.95 కోట్లకు పైగా దోచుకున్నందుకు గుజరాత్కు చెందిన ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుజరాత్లోని భావ్నగర్కు చెందిన సయ్యద్ సోయాబ్ జాహిద్ భాయ్, బెలిమ్ అనస్ రహీమ్ భాయ్లను అరెస్టు చేశారు.సైబర్ నేరానికి పాల్పడటంలో నిందితులు కీలక పాత్ర పోషించారని, మోసం చేసిన డబ్బును స్వీకరించడానికి, విత్డ్రా చేసుకోవడానికి మ్యూల్ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించారని, ఆ తర్వాత ఆ డబ్బును హవాలా నెట్వర్క్ల ద్వారా దుబాయ్లో ఉన్న సైబర్ మోసగాళ్లకు బదిలీ చేశారని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వి. అరవింద్ బాబు తెలిపారు.
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదంప్రతికూలతలకు ధీటుగా స్పందిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటటాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ నిర్ణయం సత్ఫలితమిస్తుంది. పనులు పురమాయించవద్దు. అనవసర జోక్యం తగదు. కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
నూతన సంవత్సరంలో రైల్వే కొత్త టైంటేబుల్ అమల్లోకి రానుంది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల రాకపోకల్లో చోటుచేసుకునే సమయాలతో ఈ టైంటేబుల్ను విడుదల చేయనున్నారు. ఈ కొత్త టైంటేబుల్ జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే శనివారం తెలిపింది. ముఖ్యంగా, వందే భారత్ ఎక్స్ప్రెస్తో సహా మొత్తం 25 రైళ్లు బయలుదేరే వేళల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
ఇప్పటివరకు జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి పట్టణాన్ని ఇపుడు ఆ హోదా నుంచి తొలగించడం జరిగిందని, ఈ నిర్ణయం ఎంతో బాధతో తీసుకున్నదని ఏపీ మంత్రి అనగాని సత్య కుమార్ యాదవ్ అన్నారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో బాధపడ్డారని చెప్పారు. ఈ తరహా నిర్ణయం తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చిందన్నారు. కాగా, సోమవారం ఏపీ మంత్రిమండలి సమావేశం జరిగింది.
మైగ్రేన్తో బాధపడేవారికి పనిదినాన్ని కోల్పోవడం లేదా అనారోగ్య సెలవు తీసుకోవడం సాధారణ అనుభవమే. అయితే, ఇది ఉత్పాదకత తగ్గడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా మారుతుందనే విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా 20 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల నిపుణుల్లో, అంటే పని చేసే జనాభాలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. క్రమరహితంగా షెడ్యూల్ అయ్యే పనులు లేదా సమావేశాలు, అధిక స్క్రీన్ వినియోగం, దీర్ఘకాలం పాటు తప్పైన భంగిమలో కూర్చోవడం, అలాగే నిరంతర ఒత్తిడి లేదా బర్నౌట్కు దగ్గరైన భావన వంటి అనేక కారణాలు మైగ్రేన్ను ప్రేరేపిస్తున్నాయి. ఈ సవాళ్లను గుర్తించి పరిష్కరించడం అత్యవసరం.
హైదరాబాద్ భరత్ నగర్లో జరిగిన ఓ హత్య కేసులో కూకట్పల్లి కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో ముద్దాయికి మరణశిక్ష విధించింది. భరత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ నగర్లో 2011లో జరిగి నహత్య కేసులో కోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితుడు కరణ్ సింగ్కు మూడో అదనపు జిల్లా న్యాయాధికారి వెంకటేశ్వర రావు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. కాగా, గత 2011లో జరిగిన ఈ హత్య కేసులో నిందితుడుకి 14 యేళ్ళ తర్వాత శిక్ష పడింది.
సలహాదారుల నియామకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భిన్నమైన మార్గాన్ని అనుసరిస్తోంది. అనేక మంది రాజకీయ విధేయులను సలహాదారులుగా నియమించినందుకు విమర్శలను ఎదుర్కొన్న గత పాలనకు భిన్నంగా, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సేవ, సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపిన వ్యక్తులను ఎంచుకుంటోంది.గతంలో, ప్రఖ్యాత ఆధ్యాత్మిక వక్త చాగంటి కోటేశ్వరరావును విద్యార్థులు, నైతిక విలువలపై సలహాదారుగా, క్యాబినెట్ హోదాతో నియమించారు. విద్యార్థులు, యువతలో నైతికత, విలువ ఆధారిత ఆలోచనలను బలోపేతం చేయడానికి ఆయనను ఎంచుకోవడాన్ని చాలామంది స్వాగతించారు.
తనపై లైంగికదాడికి పాల్పడిన కామాంధుడుకి ఉరిశిక్ష పడేంతవరకు న్యాయపోరాటం చేస్తానని ఉన్నావ్ అత్యాచార బాధితురాలు శపథం చేశారు. తనకు భారతీయ న్యాయవ్యవస్థపై అపారమైన నమ్మకం, గౌరవమర్యాదలు ఉన్నాయన్నారు. అలాగే, తన తండ్రి గురించి నిందితుడు కుల్దీప్ సెంగర్ కుమార్తె కూడా ఎక్స్ వేదికగా ఓ బహిరంగ లేఖ రాశారు.
కోట్లాది మంది ఆరాధ్యదైవంగా ఉన్న షిర్డీ సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను సినీ నటి మాధవీలతపై పోలీసులు కేసు నమోదు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీశారంటూ హైదరాబాద్ సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాధవీలతతో పాటు మరికొందరు యూట్యూబర్లపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
నటి మాధవీలతపై కేసు నమోదైంది. మంగళవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని సరూర్నగర్ పోలీసులు ఆమెను ఆదేశించారు. సోషల్ మీడియాలో సాయిబాబాపై పుకార్లు వ్యాప్తి చేశారనే ఆరోపణలపై ఆమెతో పాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సాయిబాబా దేవుడు కాదని మాధవీలత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని వారు పేర్కొన్నారు. ఆన్లైన్లో ఈ వాదనకు మద్దతు పలికిన పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లపై కూడా కేసులు నమోదు చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఒక కీలక మార్పుపై చర్చ జరుగుతోంది. రాష్ట్రానికి త్వరలోనే కొత్త ఇన్ఛార్జ్ రాబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయగల నాయకుడిని కాంగ్రెస్ అధిష్టానం కోరుకుంటోంది. అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్, రావత్ వంటి పేర్లను పరిశీలిస్తున్నారు. క్షేత్రస్థాయి అనుభవం ఉన్న సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్లోని అంతర్గత విభేదాలు కూడా అధిష్టానాన్ని ఈ నిర్ణయం వైపు పురికొల్పుతున్నాయి. ఈ చర్య ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగం కావచ్చు. మీనాక్షి నటరాజన్ ఫిబ్రవరి 2025లో తెలంగాణ ఇన్ఛార్జ్గా బాధ్యతలు స్వీకరించారు. పార్టీ ఓటమి పాలైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత, మీనాక్షి పరిస్థితిని సమీక్షించి సమన్వయ లోపాలను గుర్తించారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసినట్టు ఆయన వెల్లడించారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న AA22xA6 అనే భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు 40 శాతం పూర్తయింది. పుష్ప ఫ్రాంచైజీ పాన్ ఇండియా స్థాయిలో సాధించిన భారీ విజయం తర్వాత ఈ సినిమా వస్తోంది. ఆయన తదుపరి ప్రాజెక్ట్ గురించి బలమైన పుకార్లు వినిపిస్తున్నాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్తో ఒక సూపర్హీరో సినిమా చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, ఈ ప్రచారం జోరందుకుంటోంది. తమిళ దర్శకులతో వరుసగా చేస్తున్న ఈ ప్రాజెక్టులు చర్చకు దారితీశాయి.
ఈ క్రొత్త సంవత్సరం, అమెజాన్ వారి గెట్ ఫిట్ డేస్తో, మీ ఫిట్నెస్ సంకల్పాల దిశలో మరో అడుగు మందుకు వేయండి. క్రీడలు మరియు ఫిట్నెస్లకు అవసరమైన సామాగ్రుల విస్తృతశ్రేణితో సహా WHOOP నుండి ఇటీవల విడుదల చేసిన ఉత్పత్తులను ఇక్కడ మీరు కనుగొనవచ్చు. ఇంటి వద్ద వర్కవుట్ రొటీన్ను సెటప్ చేసుకుంటున్నా లేక మీ ఫిట్నెస్ గేర్ను అప్ గ్రేడ్ చేసుకుంటున్నా, యోనెక్స్, లైఫ్లాంగ్, ఇంకా మరెన్నో విశ్వసనీయమైన బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులను ఎక్స్ప్లోర్ చేయండి. ఈవెంట్ సందర్భంగా డెబిట్, క్రెడిట్ కార్డులపై ఉత్కంఠభరితమైన ఆఫర్లను కూడా కస్టమర్లు పొంది ఆనందించవచ్చు.
సంతాప తీర్మానాలు చదువుతున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లడాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ కొన్ని నిమిషాలు మాత్రమే సభకు హాజరయ్యారని, మరణించిన సీనియర్ సభ్యులను సత్కరించడానికి ఉద్దేశించిన సమయంలో వాకౌట్ చేశారని, ఇది తగదని కోమటిరెడ్డి అన్నారు.
బంగ్లాదేశ్ చొరబాటుదారులకు ఇక మూడిందేనంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారు. ఈ చొరబాటుదారులు దేశంలో ఏ మూలన దాక్కున్నా వారిని గుర్తించి ఏరిపారేస్తామని తెలిపారు. అస్సోంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, సరిహద్దులు దాటి రాష్ట్రంలోని చొరబడిన బంగ్లాదేశీయులు ఇక్కడ ప్రజల సంస్కృతి, గుర్తింపులకు ముప్పుగా పరిణమిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వారిని ఓటు బ్యాంకుగా చూస్తోందని ఆయన
హీరో శ్రీ నందు తన అప్ కమింగ్ మూవీ 'సైక్ సిద్ధార్థ'కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్నెస్తో యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ వుండబోతుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ షూటింగ్ జరుగుతోంది. బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బొమానీ ఇరానీ, జగపతిబాబు లుక్ ను నేడు చిత్ర టీమ్ విడుదల చేసింది. లేటెస్ట్ పోస్టర్లో జగపతి బాబు పూర్తిగా భిన్నమైన అవతార్లో దర్శనమిచ్చారు. అప్పల సూరి అనే పాత్రలో ఆయనను చూసిన వారు తొలుత గుర్తుపట్టలేని స్థాయిలో ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తోంది.
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ "రాజా సాబ్". ఈ చిత్రాన్ని హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. "రాజా సాబ్" సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉటంకిస్తూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ తిరుమలలో తెలంగాణ భవన్ కోసం డిమాండ్ను పునరుద్ధరించారు. తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజలు తరచుగా ఆలయ సందర్శనల సమయంలో వసతి, సరైన సౌకర్యాల కోసం ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం సఃకుటుంబానాం. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు కీలకపాత్రలో పోషిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా మధు దాసరి డిఓపిగా పనిచేశారు. ఎడిటర్ గా శశాంక్ మలి చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు సోషల్ మీడియా ద్వారా మంచి ప్రశంసలు వచ్చాయి.
అవును.. నేను లావుగా ఉన్నాను. 2020 నుంచి లావుగా ఉన్నాననే భావనతో అధిక బరువు, ఒబేసిటీ మధ్య ఊగిసలాడుతున్నాను. నా శరీరం గురించి నేను ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే, నాలో ఒక చిన్న సానుకూల మార్పు కనిపించడంతో దీని గురించి మాట్లాడటం మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నా అని ఇరాఖాన్ తన పోస్ట్లో రాసుకొచ్చారు.
ఉన్నత విద్య-ఉద్యోగ అవకాశాల కోసం అమెరికాలో ఉంటున్న తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు కాలిఫోర్నియాలో జరిగిన కారు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మృతులను మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన 25 ఏళ్ల పులఖండం మేఘన రాణిగా, ముల్కనూరుకు చెందిన 24 ఏళ్ల కడియాల భావనగా గుర్తించారు. ఈ ప్రమాదం ఆదివారం సాయంత్రం సుమారు 4 గంటలకు జరిగింది. మేఘన, భావన, ఎనిమిది మంది స్నేహితులతో కలిసి రెండు కార్లలో అలబామా హిల్స్ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. వారు ప్రయాణిస్తున్న వాహనం ఒక మలుపు వద్ద అదుపుతప్పి, రోడ్డు పక్కకు దూసుకెళ్లి లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. ఈ జిల్లాల ఏర్పాటుకు ఏపీ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ నిర్ణయంతో కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. దీంతో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 28కి పెరగనుంది. దీనికి సంబంధించి బుధవారం తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదలకానుంది.
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో జిల్లాల పునర్విభజనపై వచ్చిన సిఫార్సులను మంత్రివర్గం ఆమోదించింది. ఆ ప్రకారం కొత్తగా మరో 3 జిల్లాలు ఏర్పడనున్నాయి. మదనపల్లె, మార్గాపురం, రంపచోడవరం జిల్లాలను ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేయనున్నారు.కాగా తను ప్రాతినిధ్యం వహిస్తున్న అన్నమయ్య జిల్లాలోని రాయచోటిని కొత్తగా ఏర్పడనున్న మదనపల్లె జిల్లాకు కలిపేయడంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. తను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటి నియోజకవర్గం అన్నమయ్య జిల్లా నుంచి మదనపల్లెకు వెళ్లడంపై ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. దాంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను ఓదార్చారు.
ప్రసవానంతర సమస్యలతో తల్లి మరణించగా, కొన్ని గంటల తర్వాత తల్లి మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్ ప్రమాదానికి గురై అందులో ఉన్న ఆమె నవజాత శిశువు కూడా మరణించింది. హిందూపురం మండలం బసనపల్లి ఆటోనగర్కు చెందిన నజ్మా ప్రసవం కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఆమె ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆమె పరిస్థితి విషమించడంతో అనంతపురంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. తిరుగు ప్రయాణంలో ఆ కుటుంబం దుఃఖం మరింత తీవ్రమైంది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పుట్టినరోజుకు హాజరయ్యేందుకు ధోని వెళ్తున్న ఫోటోలు ఇంటర్నెట్లో అంతటా ఉన్నాయి. వెనుక సీటుపై ఉన్న సిగరెట్ ప్యాకెట్ను చూపించే ఒక ఫోటో అసాధారణ దృష్టిని ఆకర్షించింది. తీవ్రమైన ఆన్లైన్ ప్రతిచర్యలకు దారితీసింది. సిగరెట్ ప్యాకెట్ ఆన్లైన్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.ఈ చిత్రంలో సాక్షి ధోని వెనుక కూర్చుని, పక్కన సిగరెట్ ప్యాక్తో ఉన్నట్లు చూపబడింది. కెమెరాలో బంధించబడిన ప్రైవేట్ క్షణం ద్వారా ధోని, అతని కుటుంబాన్ని హానికరమైన అలవాటును ప్రోత్సహించారని విమర్శిస్తూ చాలామంది దూకుడుగా స్పందించారు.
రాజకీయాల్లో నాయకులు కాలక్రమేణా, పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు మారడం తరచుగా చూస్తుంటాం. గోషామహల్ మాజీ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, పార్టీలో తనను పట్టించుకోవడం లేదని బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసి, రాష్ట్ర స్థాయిలో అంతర్గత సమస్యలను ఎత్తిచూపుతూ బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా సమయంలో, రాజా సింగ్ తెలంగాణ బీజేపీలో వర్గపోషణ గురించి మాట్లాడారు. పార్టీ ఎమ్మెల్యేలకు ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పవన్ కల్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి ఉప ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలోని ప్రతి రోడ్డును గుంతలు లేని రోడ్లుగా మారుస్తున్నారు. పంచాయతీల పనితీరును పట్టాలెక్కిస్తున్నారు. పవన్ కల్యాణ్ పనితీరుపై పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని జగ్గయ్యచెరువు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన అభిప్రాయాలను పంచుకున్నారు.ఆయన మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ గారు వచ్చిన తర్వాత పిఠాపురం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతోంది. జగ్గయ్యచెరువు పధిలో అన్నిచోట్లా రోడ్లు నున్నగా వేస్తున్నారు. డ్రైనేజిలు వేస్తున్నారు. గతంలో సామర్లకోట రోడ్డంటే ఆ గోతుల్లో పడి చాలామంది సచ్చిపోయార్లెండి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. చక్కగా అన్నీ చేసేస్తున్నారు.
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తమను బాగా దెబ్బతీసిందని పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అంగీకరించారు. ముఖ్యంగా, తమకు అత్యంత కీలక వైమానిక స్థావరమైన నూర్ ఖాన్ కేంద్రం దెబ్బతిందని పేర్కొన్నారు. ఆ దాడిలో స్థావరం దెబ్బతిన్నదని చెప్పారు.
ఉన్నావ్ అత్యాచార బాధితుడుకి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఈ కేసు నుంచి ఆయనను విడుదల చేస్తూ ఇటీవల ఢిల్లీ హైకోర్టు జారీచేసిన ఆదేశాలపై స్టే విధించింది. కస్టడీ నుంచి నిందితుడుని విడుదల చేయొద్దంటూ పోలీస్ శాఖను ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. సభ సమావేశాలు ప్రారంభంకాగానే ఆయన సభ నుంచి వెళ్లిపోయారు. దీనిపై రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ను అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పారు.
తనకంటూ ఎవరూ లేరని, దీంతో తాను ఒంటరితనాన్ని అనుభవించానని యువ నటి ఇనయా సుల్తానా అన్నారు. ఈ ఒంటరితనానికి దూరంగా ఉండేందుకు వీలుగా ఓ వ్యక్తిని ప్రేమించానని, అతన్నే పెళ్లి చేసుకోవాలని భావించానని కానీ, అతను తనను మోసం చేశాడని చెప్పారు. ఈ విషయంలో తనదే పొరపాటు అని, తనదే తప్పు అని విషయం అర్థం కావడానికి కొంత సమయం పట్టిందని చెప్పారు.
2025లో విడుదలైన చిత్రాల జాబితా గా తెలుగు సినిమా రంగంలో 303 సినిమాలు విడుదల య్యాయి. అందులో పెద్ద, చిన్నా చిత్రాలున్నాయి. అందులో కొన్ని ఆదరణ పొందితే మరికొన్ని వచ్చి వచ్చినట్లే వెళ్ళిపోయాయి. ఈ సినిమాల్లో 190 స్ట్రెయిట్ చిత్రాలు. అనువాద చిత్రాలు ఆంగ్లం, పరబాషా చిత్రాలు కలిపి 113 దాకా వున్నాయి. ప్రతి ఏడాది సక్సెస్ రేటు 10, 12 శాతం కంటే ఎక్కువగా వుండదు. ఇది సినిమా ఆనవాయితీగా వుంటూ వచ్చింది. ఈసారి కూడా ఇంచుమించు అలాంటి ఫలితాలే రాబట్టింది.
సినీ నటి ప్రగతి కష్టపడి సాధించిన విజయానికి క్రెడిట్ తీసుకునేంత నీచుడుని కాదని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి అన్నారు. సినీ నటి ప్రగతి అంతర్జాతీయ వెయిట్ లిప్టింగ్ పోటీల్లో సాధించిన పతకాలపై వివాదం చెలరేగింది. తాను చేసిన పూజల ఫలితాలే నటి ప్రగతి మెడల్స్ సాధించారంటూ వేణుస్వామి వ్యాఖ్యానించారు. దీనికి ప్రగతి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
బిగ్ బాస్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నాడు ప్రముఖ నటుడు ఇమ్మాన్యుల్. 'జబర్దస్త్'తో కోట్లాదిమంది అభిమానాన్ని దండిగా గెలుచుకున్న ఇమ్మాన్యుల్.... బిగ్ బాస్ లోనూ తనదైన శైలిలో అలరించి టాప్ 4 ఫైనలిస్ట్ గా నిలిచాడు. ఈ సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించాడు.
తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారం, డిసెంబర్ 29, 2025న ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా సాగునీటి సమస్యలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకంపై చర్చ జరిగింది. డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీలలో అసెంబ్లీ సమావేశాలు జరగవు. జనవరి 2న తిరిగి ప్రారంభమవుతాయి. గత రెండు సంవత్సరాలుగా చాలా వరకు సమావేశాలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు సోమవారం జరిగిన శాసనసభ సమావేశానికి హాజరయ్యారు.
దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా షెరాజ్ మెహదీ అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘ఓ అందాల రాక్షసి’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ మీద సురీందర్ కౌర్ నిర్మాతగా ‘ఓ అందాల రాక్షసి’ అనే చిత్రం జనవరి 2న రాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో..
రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ సినిమాలో ఎలిజిబెత్ పాత్రలో నటిస్తోన్న బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషి ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న హుమా ఖురేషి..టాక్సిక్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. స్టార్లతో నిండిన ఈ వేడుకకు రామ్ చరణ్ హాజరుకావడం ఈవెంట్ ని మరింత స్పెషల్ గా మార్చింది. రామ్ చరణ్ సింపుల్, క్లాసీ లుక్లో. సాఫ్ట్ కలర్స్తో కూడిన క్లిన్ అవుట్ఫిట్లో నేచురల్ స్టైల్తో అలరించారు. ఆయన స్టైల్, స్వాగ్ హైలైట్గా నిలిచాయి.
మలేషియాలో జరిగిన జన నాయగన్ కార్యక్రమం తర్వాత చెన్నై విమానాశ్రయంలో అభిమానులు చుట్టుముట్టడంతో తలపతి విజయ్ తడబడి కిందపడ్డారు. టీవీకే అధినేత, నటుడు విజయ్ ఆదివారం చెన్నై విమానాశ్రయంలో తన కారులోకి ఎక్కే ప్రయత్నంలో కిందపడిపోయారు. మలేషియా నుండి తిరిగి వచ్చిన విజయ్ను భారీ సంఖ్యలో అభిమానులు చుట్టుముట్టారు. ఎయిర్పోర్టు నుంచి బయటికి వస్తూ.. కారులో ఎక్కడానికి కొన్ని క్షణాల ముందు, అభిమానుల రద్దీ పెరగడంతో తడబడి కిందపడిపోయారు. వెంటనే, భద్రతా సిబ్బంది అతన్ని పైకి లేపి కారులో కూర్చోబెట్టారు.
శ్రీలంకతో జరిగిన నాలుగో మహిళల టీ20లో భారత మహిళల జట్టు అద్భుతమైన ప్రదర్శన కారణంగా విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత జట్టు ఆల్రౌండర్ ప్రదర్శన కనబరిచింది. భారత జట్టులో స్మృతి మంధాన (80), షఫాలీ వర్మ (79)ల రికార్డు భాగస్వామ్యం, ఆ తర్వాత స్పిన్నర్ వైష్ణవి శర్మ అద్భుతమైన 2/24 ప్రదర్శనతో శ్రీలంకను 30 పరుగుల తేడాతో భారత్ ఓడించింది.
బిజినెస్ టుడే 2020- 2025 ఆర్థిక సంవత్సరాల మధ్య భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్ బలమైన ఆర్థిక పురోగతిని సాధించిన రాష్ట్రాలను హైలైట్ చేస్తుంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక సామాజిక, ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ఈ వృద్ధి నమోదైంది. అస్సాం 45శాతం వృద్ధి రేటుతో మొదటి స్థానంలో నిలవగా, తమిళనాడు 39శాతం వృద్ధి రేటుతో రెండవ స్థానంలో ఉంది. కర్ణాటక 36శాతం వృద్ధిరేటుతో మూడవ స్థానాన్ని దక్కించుకుంది.
భారత టెస్ట్ కోచ్గా గౌతమ్ గంభీర్ భవిష్యత్తుపై తీవ్ర పరిశీలన జరుగుతోంది. ఇటీవలి టెస్ట్ ప్రదర్శనలపై బీసీసీఐ అసంతృప్తిగా ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. టెస్టు ఫార్మాట్లో ఫలితాలు అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడంతో అతనిపై ఒత్తిడి పెరుగుతుంది. అయితే, అతని టెస్ట్ పనితీరు అదే ప్రమాణాలకు అనుగుణంగా లేదు. ఫార్మాట్ల మధ్య ఈ అంతరం బోర్డు, అభిమానులకు విస్మరించడం కష్టంగా మారింది. స్వదేశంలో ఓటములు ఒత్తిడిని పెంచుతాయి. గంభీర్ మార్గదర్శకత్వంలో, భారతదేశం స్వదేశంలో ఎదురుదెబ్బలను చవిచూసింది.
దుబాయ్లో జరిగే గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్లో పాల్గొనడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఆహ్వానం అందింది. ఈ పర్యటన 2026 జనవరి 9-11 మధ్య జరగనుంది. ఈ కార్యక్రమం ఆవిష్కరణ రంగం నుండి ప్రపంచ నాయకులను ఆకర్షించే అవకాశం ఉంది. వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి ఇంటర్నేషనల్ స్టార్ట్-అప్ ఫౌండేషన్ ఈ సమ్మిట్ను నిర్వహిస్తోంది. స్టార్టప్లు మరియు ఆవిష్కరణలపై దృష్టి సారించినందున కేటీఆర్కు ఆహ్వానం అందిందని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ ఐటీ మంత్రిగా ఆయన పదవీకాలంలో ఈ పురోగతి వచ్చింది.