Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కడపలో ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, పెట్రోల్ పోసి నిప్పంటించారు

victim

ఐవీఆర్

, శనివారం, 19 అక్టోబరు 2024 (18:55 IST)
కడపలోని గోపవరం మండలంలో దారుణ ఘటన జరిగింది. దస్తగిరి కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని వస్తున్న దారిలో మాటు వేసిన ఐదుగురు కామాంధులు కిడ్నాప్ చేసి సమీప అడవిలోకి లాక్కెళ్లారు. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నిజం ఎక్కడ బయటపెడుతుందోనని బాధితురాలిపై పెట్రోలు పోసి నిప్పంటించారు.
 
ఆమె కేకలు వేయడంతో సమీపంలోని స్థానికులు వచ్చారు. వారు రావడాన్ని గమనించిన కామాంధులు అక్కడ నుంచి పరారయ్యారు. స్థానికులు విషయాన్ని పోలీసులకు తెలుపడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు.
 
ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బాధితురాలిని మెరుగైన వైద్యం చేయాలని అధికారులకు సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు హైదరాబాద్ విజన్ కంప్లీట్, ఇక అమరావతిపైన టార్గెట్: నాగబాబు