వైఎస్సార్ జిల్లా గోపవరం అటవీ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. అడవిలో ఓ యువతి అత్యాచారానికి గురైంది. అంతటితో ఆగకుండా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అయితే ఈ హత్యాయత్నం నుంచి ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆమె అరుపులు విన్న స్థానికులు ఆమెను రక్షించారు. కొన ఊపిరిలో వున్న యువతిని కడప రిమ్స్కు తరలించారు.
విగ్నేష్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
మాయమాటలు చెప్పి తన ఇంటికి సమీపంలో వున్న విఘ్నేష్ తనపై అఘాయిత్యానికి ఒడిగట్టాడని, మూడు నెలల క్రితమే విఘ్నేష్కు వివాహం జరిగిందని.. అతని భార్య గర్భవతి అని బాధితురాలు తెలిపింది. దీంతో విఘ్నేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.