చాలా మంది యువతీయువకులు పెళ్ళికాకముందే శృంగారంలో పాల్గొంటుంటారు. కొందరు తగిన జాగ్రత్తలు తీసుకుని శారీరకంగా కలుస్తుంటారు. మరికొందరు మాత్రం తొందరపడి సంభోగంలో పాల్గొంటారు. ఇలాంటి యువతుల్లో కొందరికి అవాంఛిత గర్భాలు వస్తుంటాయి. అయితే, శారీరకంగా కలిసిన తర్వాత నిమ్మకాయ రసాన్ని యోనిలో పూసుకుంటే గర్భం రాదన్నది కొందరి మూఢనమ్మకం. దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఓసారి తెలుసుకుందాం.
సాధారణంగా గర్భంరాకుండా ఉండేందుకు సెక్స్ సమయంలో కండోమ్ వాడటమే అత్యంత సురక్షితమని అంటున్నారు. సంభోగం తర్వాత యోనిలోకి నిమ్మకాయ రసం పిండితే గర్భం రాకుండా ఉంటుందనేది కేవలం అపోహేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పైగా ఇలాంటి చర్య చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
నిమ్మకాయ రసం వల్ల ఆ భాగంలో ఇన్ఫ్లమేషన్ కలిగి పుండ్లు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. అది కాస్త గర్భాశయానికి చేరితే మరింత ప్రమాదమన్నారు. గర్భం రాకుండా ఉండాలంటే కండోమ్ వాడాలే తప్ప ఇటువంటి పద్ధతులు అనుసరించకూడదని చెప్పుకొచ్చారు.
స్త్రీపురుషుల కలయిక తర్వాత యోనిలో జిల్లేడు పాలు పోయడం, నిమ్మకాయ రసం పిండటం, సున్నపు నీళ్లు పోయడం, సబ్బునీళ్లు పోయడం ఇటువంటివి అన్నీ మొరటు పద్ధతులని.. పూర్తి అశాస్త్రీయమని, ఇలాంటి చర్యల వల్ల ఇతర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు లేకపోలేదని వారు హెచ్చరిస్తున్నారు.