Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈనెల 16, 17 తేదీల్లో ఇండో-అమెరికా ఆర్థిక సదస్సు!

Webdunia
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈనెల 16, 17 తేదీల్లో ఇండో అమెరికా ఆర్థిక సదస్సు జరుగనుంది. ఇండో-అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో ఇరు దేశాలకు చెందిన సుమారు 300 మంది ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు.

రెండు దేశాలమధ్య కొనసాగించాల్సిన ఆర్థిక సహకారంపై సదస్సులో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. ఈ సదస్సులో సాధారణంగా ప్రస్తావనకు వచ్చే వర్తక, వాణజ్య అంశాలతో పాటు ఆర్థికమాద్యం నేపపథ్యంలో అనుసరించాల్సిన కొత్త వ్యూహాలు చర్చించే అవకాశం వుందని సదస్సు ఛైర్మన్‌ లలిత్‌ బాసిన్‌ మంగళవారం తెలిపారు.

సదస్సులో సేవారంగంపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా భారత్‌ అందించే సేవలపై దృష్టి సారించడం జరుగుతుందని బాసిన్‌ తెలిపారు. భారత్‌, అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య సహకారం ప్రపంచ అభివృద్ధికి దోహదం చేస్తుందని బాసిన్‌ పేర్కొన్నారు.

ఈ సదస్సులో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్‌ సిబాల్‌, సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ మంత్రి ఫరూక్‌ అబ్దుల్లా, యుఎస్‌ రాయబార కార్యాలయం డిప్యూటీ ఛీఫ్‌ స్టీవెన్‌ జెవైట్‌, నేషనల్‌ ఏవియేషన్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ఛైర్మన్‌ అరవింద్‌ జాదవ్‌ తదితరులు పాల్గొంటారని చెప్పారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments