Webdunia - Bharat's app for daily news and videos

Install App

జొన్న రొట్టెలు చేస్తున్న మహిళను కత్తితో పొడిచిన దండగుడు

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (13:41 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ దండగుడు మహిళను కత్తితో పొడిచి చంపాడు. మృతురాలు జొన్నరొట్టెలు తయారు చేస్తుండగా ఈ దారుణం జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జగద్గిరిగుట్ట షిరిడీకు చెందిన కవిత (35) అనే మహిళ తన ఇంటి ముందే జొన్నరొట్టెలు తయారు చేసి, వాటిని విక్రయించుకుంటూ జీవనం సాగిస్తుంది. ఇదే కాలనీలో గ్యాస్ సప్లయ్ చేసే యాదగిరి అనే వ్యక్తి జొన్నరొట్టెలు చేస్తున్న సమయంలో ఆమె వద్దకు వచ్చి వాదనకు దిగారు. 
 
అప్పటికే పీకలవరకు మద్యం సేవించివుండటంతో నిగ్రహం కోల్పోయిన యాదగిరి ఆమెను కత్తితో కిరాతకంగా పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావానికి గురైన ఆ మహిళ అక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న యాదగిరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments