Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సూర్యపేటలో దారుణం : ప్రయాణికురాలిపై బస్సుడ్రైవర్ అత్యాచారం

సూర్యపేటలో దారుణం : ప్రయాణికురాలిపై బస్సుడ్రైవర్ అత్యాచారం
, ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (09:04 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో దారుణం జరిగింది. ఓ ప్రయాణికురాలిపై బస్సు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. సూర్యాపేట సమీపంలో ఈ ఘటన జరుగగా, కూకట్‌పల్లి పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 29 యేళ్ల యువతి ఒకరు హైదరాబాద్ నగరంలో బేబీ కేరే టేకర్‌గా పని చేస్తున్నారు. తన ఇద్దరు పిల్లలతో కలిసి మాదాపూర్‌లో ఉంటుండగా, ఆమె భర్త వేరుగా నివసిస్తున్నాడు. 
 
అయితే, తన సొంతూరుకు వెళ్లేందుకు ఈ నెల 23వ తేదీన ఓ ప్రైవేటు స్లీపర్ క్లాస్ బస్సు ఎక్కి, తనకు కేటాయించిన సీటులో నిద్రకు ఉపక్రమించింది. బస్సు కదిలిన తర్వాత అర్థరాత్రి 12.30 గంటల సమయంలో బస్సు సూర్యాపేట దాటింది. 
 
ఈ బస్సులో ఉన్న ఇద్దరు డ్రైవర్లలో రాజేష్ (35) అనే బస్సు డ్రైవర్ ఈ మహిళను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉదయం గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత మరో బస్సు డ్రైవర్ బెదిరించి ఆమె వద్ద ఉన్న రూ.7 వేల నగదును దోచుకున్నాడు. 
 
ఆ తర్వాత బాధితురాలు శనివారం హైదరాబాద్ నగరానికి చేరుకుని కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఒక నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశ్వబ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పిన గరికపాటి.. ఏంటి సంగతి?