Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సూర్యాపేట డీహెచ్ఎంపీ ఫ్యామిలీలో ఆరుగురికి కరోనా పాజిటివ్

సూర్యాపేట డీహెచ్ఎంపీ ఫ్యామిలీలో ఆరుగురికి కరోనా పాజిటివ్
, శుక్రవారం, 3 డిశెంబరు 2021 (07:39 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో జిల్లా వైద్యాధికారి కుటుంబంలో ఆరుగురుకి కరోనా వైరస్ బారిపనపపడ్డారు. డీహెచ్ఎంఓతో పాటు.. ఏకంగా ఆరుగురు కుటుంబ సభ్యులకు ఈ వైరస్ సోకింది. 
 
డీహెచ్ఎంవో తన కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల తిరుమలకు వచ్చి వెళ్లారు. ఆ తర్వాత బుధవారం ఆయనకు స్వల్పంగా జ్వరం రావడంతో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో డీహెచ్ఎంవో డాక్టర్ కోటాచలంకు పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 
 
ఆ తర్వాత ఆయన భార్య, పెద్ద కుమారుడు, కోడలు, చిన్న కుమార్తెలతో పాటు మరో కుటుంబ సభ్యురాలికి ఈ వైరస్ పరీక్ష చేయించారు. ఈ పరీక్షల్లో వారందరికీ కరోనా నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చిన వారందరినీ హోం ఐసోలేషన్‌కు తరలించారు. వీరందరి ఆరోగ్యం బాగానేవుంది. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 
 
అయితే, ఈ కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఒమిక్రాన్ లక్షణాలు లేకపోయినప్పటికీ.. వారి శాంపిల్స్‌ను జినోం టెస్టుకు పంపించినట్టు డీఎంహెచ్‌వో డాక్టర్ హర్షవర్థన్ తెలిపారు. అదేసమయంలో ప్రజలెవ్వరూ ఆందోళన చెందల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఉండాలని కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌ నుంచి మెరుగైన పెన్షన్‌ పరిష్కారం