Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు పల్స్ పోలియో - తెలుగు రాష్ట్రాల్లో విస్తృత ఏర్పాట్లు

నేడు పల్స్ పోలియో - తెలుగు రాష్ట్రాల్లో విస్తృత ఏర్పాట్లు
, ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (09:29 IST)
దేశ వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుక్ మాండవీయ ఢిల్లీలో ప్రారంభించారు. ఆదివారం దేశ వ్యాప్తంగా ప్రారంభమైంది. ఇందుకోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా తెలంగాణాలో 23,331 కేంద్రాలు ఏర్పాటు చేసి పోలియో చుక్కలు వేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా 38,31,907 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, మసీదులు, ప్రధాన కూడళ్ళలో పల్స్ పోలియో శిబిరాలను ఏర్పాటుచేశారు. 
 
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు.. సామాజిక కేంద్రాలు, ప్రాంతీయ ఆస్పత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు ఇతర ముఖ్య కూడళ్ళలో పల్స్ పోలియో చుక్కలను చిన్నారులకు వేయనున్నారు. 
 
ఆదివారం పంపిణీ చేయడంతో పాటు సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలను పంపిణీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. దేశాన్ని పోలియో రహిత దేశంగా మార్చే చర్యల్లో భాగంగా, ఐదేళ్ళలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూర్యపేటలో దారుణం : ప్రయాణికురాలిపై బస్సుడ్రైవర్ అత్యాచారం