Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Metoo ప్రకంపనలు- కేంద్ర మంత్రి ఎం.జె. అక్బర్ రాజీనామా

కేంద్ర మంత్రి ఎం.జె. అక్బర్ తన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళా జర్నలిస్టు మీద పరువునష్టం కేసు వేశారు.

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (17:42 IST)
కేంద్ర మంత్రి ఎం.జె. అక్బర్ తన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళా జర్నలిస్టు మీద పరువునష్టం కేసు వేశారు. దేశాన్ని అట్టుడికిస్తున్న #Me too ఉద్యమంలో భాగంగా జర్నలిస్ట్ ప్రియా రమణి ఆయనపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా పరువునష్టం దావా వేసినా వెనక్కి తగ్గేది లేదని కోర్టులో తేల్చుకుంటానని ప్రియా రమణి ఛాలెంజ్ విసిరారు. 
 
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవికి ఎంజె అక్బర్ బుధవారం నాడు రాజీనామా చేశారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా ఎంజె అక్బర్ పనిచేస్తున్నారు. మీటూలో భాగంగా ప్రియా రమణితో పాటు కొందరు మహిళా జర్నలిస్టులు అక్బర్‌పై లైంగిక ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను అక్బర్ ఖండించారు. 
 
ఇంతలో ఏమైందో ఏమోకానీ.. అక్బర్ బుధవారం నాడు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తనకు విదేశాంగ సహాయ మంత్రి బాధ్యతలు కట్టబెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ఈ సందర్భంగా అక్బర్ ధన్యవాదాలు తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కోర్టులో ఈ విషయాన్ని తేల్చుకొనేందుకు వీలుగా తన మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు. 
 
అయితే మీటూ ఉద్యమంలో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని మంత్రి పదవిలో కొనసాగించడం ఏమిటని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని నెటిజన్లు ప్రశ్నించడంతో.. ప్రధాని ఒత్తిడి మేరకు అక్బర్ రాజీనామా చేసి వుంటారని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం