Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ ప్రమాదంలో మరణించారా?

Webdunia
శుక్రవారం, 15 నవంబరు 2019 (18:55 IST)
'పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ ప్రమాదంలో మరణించారు'.. ఈ విషయాన్ని ఒడిశా విద్యాశాఖ ప్రచురించిన ఓ రెండు పేజీల బుక్‌లెట్‌ పేర్కొన్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు ప్రారంభమయ్యాయి.

బుక్‌ లెట్‌లో ప్రమాదం కారణంగానే గాంధీ చనిపోయారని మాత్రమే కాకుండా ఆ ప్రమాదం ఎలా జరిగిందో కూడా విశధీకరించారు.. గాంధీజీ హత్యను ప్రమాదంగా చెప్పడాన్ని పలువురు మేధావులే కాకుండా వివిధ వర్గాల ప్రజలు తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.

దీంతో ఒడిశా ప్రభుత్వ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ వ్యవహారంపై ఒడిశా ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ విషయంపై ఒడిశా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సమీర్‌ రంజన్‌ దాస్‌ మాట్లాడుతూ..’ఆమా బాపూజీ : ఏక్‌ ఝలకా’  లో వివాదాస్పదానికి దారితీసిన అంశం ఎలా ప్రచురితమైందనే విషయంపై విచారణకు ఆదేశించామని చెప్పారు.

అలాగే ప్రచురితమైన బుక్ లెట్ ను ఉపసంహరించామని తెలిపారు.. కాగా,  గాడ్సే సానుభూతిపరులు ఉద్దేశపూర్వకంగా ఈ బుక్‌ను ప్రచురించారని సామాజిక  కార్యకర్త ప్రఫుల్లా సమంత్ర విమర్శించారు. గాడ్సే వంటి ఉన్మాది చేతిలో గాంధీ మహాత్ముడు చనిపోయారని చెప్పకుండా భావితరాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

ఓ వైపు గాంధీజీ 150వ జయంత్యుత్సవాలు ఘనంగా చేస్తూ మరోవైపు ఇలా అవమానించడం తగదని హితవు పలికారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం