Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ ప్రమాదంలో మరణించారా?

Webdunia
శుక్రవారం, 15 నవంబరు 2019 (18:55 IST)
'పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ ప్రమాదంలో మరణించారు'.. ఈ విషయాన్ని ఒడిశా విద్యాశాఖ ప్రచురించిన ఓ రెండు పేజీల బుక్‌లెట్‌ పేర్కొన్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు ప్రారంభమయ్యాయి.

బుక్‌ లెట్‌లో ప్రమాదం కారణంగానే గాంధీ చనిపోయారని మాత్రమే కాకుండా ఆ ప్రమాదం ఎలా జరిగిందో కూడా విశధీకరించారు.. గాంధీజీ హత్యను ప్రమాదంగా చెప్పడాన్ని పలువురు మేధావులే కాకుండా వివిధ వర్గాల ప్రజలు తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.

దీంతో ఒడిశా ప్రభుత్వ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ వ్యవహారంపై ఒడిశా ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ విషయంపై ఒడిశా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సమీర్‌ రంజన్‌ దాస్‌ మాట్లాడుతూ..’ఆమా బాపూజీ : ఏక్‌ ఝలకా’  లో వివాదాస్పదానికి దారితీసిన అంశం ఎలా ప్రచురితమైందనే విషయంపై విచారణకు ఆదేశించామని చెప్పారు.

అలాగే ప్రచురితమైన బుక్ లెట్ ను ఉపసంహరించామని తెలిపారు.. కాగా,  గాడ్సే సానుభూతిపరులు ఉద్దేశపూర్వకంగా ఈ బుక్‌ను ప్రచురించారని సామాజిక  కార్యకర్త ప్రఫుల్లా సమంత్ర విమర్శించారు. గాడ్సే వంటి ఉన్మాది చేతిలో గాంధీ మహాత్ముడు చనిపోయారని చెప్పకుండా భావితరాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

ఓ వైపు గాంధీజీ 150వ జయంత్యుత్సవాలు ఘనంగా చేస్తూ మరోవైపు ఇలా అవమానించడం తగదని హితవు పలికారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం