నల్గొండ పర్యటనకు వెళ్లనున్న సీఎం కేసీఆర్

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (10:47 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తండ్రి మారయ్య దశదినకర్మ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. 
 
ఈ పర్యటనలో ముందుగా పట్టణంలోని కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో మారయ్య చిత్రపటానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి హైదరాబాద్ నగరానికి తిరిగివస్తారు. 
 
ఇదిలావుంటే, సీఎం కేసీఆర్ నల్గొండ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టరులో బయలుదేరి నల్గొండ ఎన్జీ కాలేజీ మైదానానికి ఆయన మధ్యాహ్నం 12 గంటల సమయంలో చేరుకుంటారు. 
 
అక్కడ నుంచి రోడ్డు మార్గంలో గాదరి కిషోర్ ఇంటికి చేరుకుంటారు. ఈ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రాజేశ్వరిలు దగ్గరుండి పర్యవేక్షించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. హెలిప్యాడ్‌ను కూడా వారు తనిఖీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments