Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్గొండ పర్యటనకు వెళ్లనున్న సీఎం కేసీఆర్

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (10:47 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తండ్రి మారయ్య దశదినకర్మ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. 
 
ఈ పర్యటనలో ముందుగా పట్టణంలోని కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో మారయ్య చిత్రపటానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి హైదరాబాద్ నగరానికి తిరిగివస్తారు. 
 
ఇదిలావుంటే, సీఎం కేసీఆర్ నల్గొండ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టరులో బయలుదేరి నల్గొండ ఎన్జీ కాలేజీ మైదానానికి ఆయన మధ్యాహ్నం 12 గంటల సమయంలో చేరుకుంటారు. 
 
అక్కడ నుంచి రోడ్డు మార్గంలో గాదరి కిషోర్ ఇంటికి చేరుకుంటారు. ఈ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రాజేశ్వరిలు దగ్గరుండి పర్యవేక్షించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. హెలిప్యాడ్‌ను కూడా వారు తనిఖీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments