Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డిసెంబర్ 31 అర్థరాత్రి వరకు మందు షాపులు తెరిచేవుంటాయ్

డిసెంబర్ 31 అర్థరాత్రి వరకు మందు షాపులు తెరిచేవుంటాయ్
, మంగళవారం, 28 డిశెంబరు 2021 (22:56 IST)
ఏపీలో డిసెంబర్‌ 31 వ తేదీన అర్థరాత్రి వరకు మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చింది సర్కార్‌. ఇదే తరహాలో తెలంగాణ రాష్ట్ర మందుబాబులకు గుడ్ న్యూస్. డిసెంబర్ 31న అర్థరాత్రి వరకు మందు షాపులు తెరిచి వుంచేలా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
 
ఈ మేరకు మద్యం షాపులతో సహ, ఈవెంట్లు, బార్లు, రెస్టారెంట్లకు డిసెంబర్‌ 31 న అర్థరాత్రి వరకు ఓపెన్‌ చేసుకునేలా అనుమతులు ఇస్తూ.. కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది.
 
డిసెంబర్‌ 31 వ తేదీన వైన్స్‌ రాత్రి 12 గంటలకు ఓపెన్‌ ఉన్నప్పటికీ.. డ్రంకన్‌ డ్రైవ్‌ ఉంటుందని పేర్కొంది తెలంగాణ సర్కార్‌. ఏదీ ఏమైనా.. అర్థరాత్రి వరకు వైన్స్‌ ఒపెన్‌ ఉంటాయని కేసీఆర్‌ సర్కార్‌ ప్రకటన చేయడంతో.. మందు బాబులు సంబరాలు చేసుకుంటున్నారు.
 
ఇక తెలంగాణ రాష్ట్రంలో జనవరి 2 వ తేదీ వరకు కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ఇటీవలే కేసీఆర్‌ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇవాళ మద్యం షాపులకు మాత్రం అనుమతులు ఇవ్వడం గమనార్హం.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2022లో భారతదేశపు గృహ రియల్‌ ఎస్టేట్‌ పునరుద్ధరణలో అత్యంత కీలకం కానున్న ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌