Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త సైన్యంలో-భార్య ప్రియుడితో చాటింగ్.. అత్త వార్నింగ్.. పాము కాటుకు?

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (14:45 IST)
వివాహేతర సంబంధానికి అడ్డున్న భర్తలనే కొందరు మహిళలు హతమార్చుతున్న సంఘటనలు పోయి.. ప్రస్తుతం తన అక్రమ సంబంధానికి అడ్డుగా వుందనే కారణంగా అత్తను తెలివిగా తొలగించుకోవాలనుంది కోడలు. ఆ తెలివి తేటల కారణంగా అత్తను హత్య చేసింది. కానీ ఆ కోడలు ప్రస్తుతం కటకటాలు లెక్కపెడుతోంది. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన అల్పన, సచిన్ భార్యభర్తలు. సచిన్ సైన్యంలో పనిచేస్తుండడంతో అల్పన.. అత్త సుబోధ్ దేవితో కలిసి ఉంటోంది. సుబోధ్ దేవి భర్త రాజేశ్ ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతంలో ఉంటున్నారు.
 
ఈ క్రమంలో జైపూర్‌కు చెందిన మనీష్ అనే వ్యక్తితో అల్పనకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకోవడం, చాటింగ్‌లు మితిమీరడంతో గమనించిన సుబోధ్ దేవి కోడల్ని మందలించింది. దీంతో అత్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది కోడలు. ప్రియుడు మనీష్‌తో కలిసి ఎవరికీ అనుమానం రాకుండా పాముతో కాటు వేయించి అత్తను హత్య చేసింది. గతేడాది జూన్ 2న ఈ ఘటన జరిగింది.
 
సుబోధ్ దేవి మరణించిన నెలన్నర తర్వాత అల్పన ప్రవర్తనను చూసి సుబోధ్ దేవి బంధువులు అనుమానించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసుపై దర్యాప్తు చేపట్టి.. నిందితురాలు అల్పనను అరెస్ట్ చేశారు. ఆపై అల్పన, మనీష్, కృష్ణ కుమార్‌లను రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments