Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి ఆడపడుచులకు పృథ్వీ క్షమాపణలు చెప్పాల్సిందే: పోసాని

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (13:13 IST)
రైతులను పెయిడ్ ఆర్టిస్టులనడం సినీనటుడు పృథ్వీకి తగదని పోసాని అన్నారు. పృథ్వీలాంటి వారివల్లే జగన్ ప్రభుత్వానికి నష్టం కలుగుతోందని పోసానీ చెప్పారు. పృథ్వీ వెంటనే మీడియా సమావేశం పెట్టి.. రైతులకు క్షమాపణ చెప్పాలని పోసాని డిమాండ్ చేశారు. రైతులను కించపరిచేలా ఎవరు మాట్లాడినా తాను సహించనని చెప్పుకొచ్చారు. 
 
రైతులకు కార్లు ఉంటే తప్పేంటి? అలాగే పంటను పండించే మహిళల చేతులకు బంగారు గాజులు ఉండకూడదా అంటూ.. పృథ్వీని పోసాని ప్రశ్నించారు. అలాగే.. జగన్ రైతులకు అన్యాయం చేయరని.. రైతులు శాంతించాలని ఆయన కోరారు. జగన్ తప్పక రైతులకు న్యాయం చేస్తారు. ఇప్పటివరకూ ప్రజల గురించి జగన్ ఒక్క మాట కూడా జారలేదన్నారు. కాగా.. అమరావతిలో రైతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జగన్‌కు ఇది తన విజ్ఞప్తి అంటూ పేర్కొన్నారు.
 
 ఏటా మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం ఇచ్చేసిన రైతులను పెయిడ్ ఆర్టిస్టులని వ్యాఖ్యానించినందుకు పృథ్వీ సిగ్గుపడాలని అన్నారు. పృథ్వీలాంటి వాళ్ల కారణంగానే రాష్ట్రంలోని ఆడవాళ్లు జగన్ మోహన్ రెడ్డి గాడు అని తిడుతున్నారని తెలిపారు.

వైసీపీలో తాను కూడా ఉన్నానని, తనతో పాటు రోజా కూడా పదేళ్లుగా పార్టీలోనే ఉన్నారని, తాము ఎప్పుడూ ఇలా మాట్లాడలేదని అన్నారు. కానీ, పృథ్వీలాంటి వాళ్లు ఈ మూడ్నాలుగేళ్లలో వచ్చి చేరారని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిష్ వెంకట్ కుటుంబానికి నేనున్నా.. రూ.1.5 లక్షలు ఇచ్చిన సోనూ సూద్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments