Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రోగి అంత్యక్రియలను అడ్డుకుంటే మూడేళ్ల జైలు

Webdunia
ఆదివారం, 26 ఏప్రియల్ 2020 (18:34 IST)
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ఇలా చనిపోతున్న రోగుల మృతదేహాలకు అంత్యక్రియల నిర్వహణ పెను సవాల్‌గా మారింది. అనేక ప్రాంతాల్లో కరోనా రోగుల అంత్యక్రియలను స్థానికులు అడ్డుకుంటున్నారు. అటు తమిళనాడుతో పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం స్పందించి, అత్యవసర ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. 
 
ఈ ఆర్డినెన్స్ మేరకు.. కరోనా రోగుల అంత్యక్రియలను ఎవరైనా అడ్డుకుంటే దాన్ని నేరంగా పరిగణిస్తారు. అలాగే, మూడేళ్ళ జైలు లేదా అపరాధం లేదా రెండింటిని విధించేలా ఆర్డినెన్స్ రూపకల్పన చేశారు. ఈ ఆర్డినెన్స్‌ను తమిళనాడు ప్రజా ఆరోగ్య చట్టం (తమిళనాడు పబ్లిక్ హెల్త్ యాక్ట్) ప్రకారం తెచ్చారు. ఈ చట్టం మేరకు కరోనా సోకి మరణించిన వ్యక్తి అంత్యక్రియలను, దహన లేదా అంత్యక్రియల ప్రక్రియను అడ్డుకుంటే నేరంగా పరిగణిస్తారు. జరిమానాతో పాటు ఒకటి నుంచి మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. 
 
ఇటీవల నెల్లూరుకు చెందిన ఓ వైద్యుడుతో పాటు.. మరో వైద్యుడు ఈ కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. వీరి అంత్యక్రియలను స్థానికులు తీవ్రంగా అడ్డుకున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments