Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏప్రిల్ 26 నుంచి 29 వరకు పూర్తిగా లాక్ డౌన్.. సీఎం ఎడప్పాడి

Advertiesment
ఏప్రిల్ 26 నుంచి 29 వరకు పూర్తిగా లాక్ డౌన్.. సీఎం ఎడప్పాడి
, శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (19:55 IST)
కరోనా వైరస్ మరింత విస్తరించకుండా అడ్డుకట్ట వేసేందుకు తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం నుంచి మరో ఐదు నగరాల్లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రకటించారు. కరోనా భారీగా విస్తరిస్తున్న నేపథ్యంలో కొన్ని కఠిన చర్యలు తీసుకోక తప్పడం లేదని అన్నారు. చెన్నైతో పాటు కోయంబత్తూర్, మదురై, సేలం, తిరుప్పూర్‌లలో పూర్తిగా లాక్‌డౌన్ విధించనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.
 
 
చెన్నై, కోయింబత్తూరు, మదురైలను ఈ నెల 26 నుంచి 29 వరకు పూర్తిగా లాక్ డౌన్ చేయనున్నట్టు సీఎం ప్రకటించారు. కరోనాను తరిమికొట్టే దిశ ఈ చర్యలు తప్పట్లేదని.. ప్రజలు సహకరించాలని పిలుపు నిచ్చారు. ఆ రోజుల్లో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందన్నారు. ఆదివారం నుంచి 28 వరకు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని వివరించారు. 
 
అయితే, అన్ని అవసరమైన సేవలు కొనసాగుతూనే ఉంటాయని సీఎ స్పష్టం చేశారు. ఆస్పత్రులు, క్లినికల్ ల్యాబ్‌లు, అంబులెన్సులు, అనుబంధ సేవలు, ఆరోగ్యం, పోలీసు, రెవెన్యూ, విద్యుత్ విభాగాలు, ఆవిన్, స్థానిక పరిపాలన, తాగునీటి సరఫరా కొనసాగుతూనే ఉంటుందన్నారు. కోయంబేడులో ఉన్న హోల్‌సేల్ కూరగాయల మార్కెట్లు తగిన నిబంధనలలో పనిచేస్తాయని.. అదేవిధంగా, కూరగాయలు, పండ్లను మొబైల్ బండ్లలో మాత్రమే అమ్మడానికి అనుమతి ఉంటుంది. ఈ రోజుల్లో ఇతర షాపులు పనిచేయడానికి ఎటువంటి అనుమతి లేదని సీఎం తెలిపారు.
 
కాగా.. భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో రోజురోజుకూ ఈ కేసుల తీవ్రత పెరుగుతోంది. కోయంబత్తూర్‌లో ఏడుగురు పోలీసు సిబ్బందికి కరోనా సోకింది. ముగ్గురు మహిళా సిబ్బందితో పాటు మొత్తం ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు పోలీసు శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్యం కోసం నాలుక పీకుతోంది, తాళం పగులగొట్టి బీర్ సీసాలతో పరార్...