Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మద్యం కోసం నాలుక పీకుతోంది, తాళం పగులగొట్టి బీర్ సీసాలతో పరార్...

మద్యం కోసం నాలుక పీకుతోంది, తాళం పగులగొట్టి బీర్ సీసాలతో పరార్...
, శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (19:48 IST)
లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి యేదేచ్ఛగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు. బార్లు, వైన్ షాపులను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేసినప్పటికీ దాన్ని తొలగించి అక్రమంగా మద్యం తరలిస్తూ ఇప్పటికే నగర శివార్లలో చాలా చోట్ల పలువురు పట్టుబడ్డారు. తాజాగా ఉప్పల్ బస్సు డిపో వద్ద గల వెంకటేశ్వర బార్ అండ్ రెస్టారెంట్లో కొందరు వ్యక్తులు ఎక్సైజ్ ఆధికారులు సీజ్ చేసిన తాళాలు పగులగొట్టి అందులో ఉన్న బీరు బాటిల్స్ తీసుకొని వెళ్తుండగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
 
మరికొందరు మద్యం బాటిల్స్‌తో పరారైనట్లు వారు తెలిపారు. ఇదే తరహాలో ఘట్కేసర్ ఎక్సైజ్ కార్యాలయం పరిధిలో గత కొద్దిరోజులుగా భారీగా మద్యం పట్టుబడుతోంది. వైన్ షాపులు, బార్ల నుండి బయటకు తీసుకువచ్చి రహస్య ప్రాంతాలలో మద్యంను దాచి ఉంచి హైదరాబాదుతో పాటు నగర శివార్లకి మద్యం తరలించి అమ్ముతూ, అక్రమా దందాకు తెర లేపారు కొందరు బార్, వైన్స్ షాపు యాజమానులు. 
 
వైన్స్ షాపుల్లో తక్కువ ధర వెయ్యికే దొరికే మద్యం సుమారు నాలుగు నుండి అయిదు వేల వరకు విక్రయిస్తున్నారు. లాక్ డౌన్ కర్ప్యూ సందర్భంలో రోడ్డుపై రావాలంటే సామాన్య ప్రజలు జంకుతుంటే, ఇలాంటి మద్యం అక్రమా దందాకు పాల్పడుతున్న వారు మాత్రం ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ మద్యం రవాణ జరుపుతున్నారు. వీరికి పోలీసుల అండదండలు పుష్కలంగా ఉన్నట్లే కనిపిస్తుందని పలువురు స్థానికులు వాపోతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్‌ను కనిపెట్టే కొత్త సాఫ్ట్‌వేర్, 5 సెకన్లే చాలు