Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవిశ్వాస తీర్మానం.. నేడు ఎంతో ముఖ్యమైన రోజు.. ఎంపీలు జాగ్రత్త- మోదీ

శుక్రవారం కేంద్రంపై అవిశ్వాస తీర్మానం జరుగనుంది. లోక్‌సభలో సమరానికి అధికార, విపక్షాలు సిద్ధమయ్యాయి. విభజన చట్టపరంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ అమలులో విఫలమైన కేంద్ర ప్రభుత్వ వైఖరిని దేశవ

Webdunia
శుక్రవారం, 20 జులై 2018 (09:58 IST)
శుక్రవారం కేంద్రంపై అవిశ్వాస తీర్మానం జరుగనుంది. లోక్‌సభలో సమరానికి అధికార, విపక్షాలు సిద్ధమయ్యాయి. విభజన చట్టపరంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ అమలులో విఫలమైన కేంద్ర ప్రభుత్వ వైఖరిని దేశవ్యాప్తంగా అందరికీ తెలియజెప్పాలన్న ఉద్దేశంతో తెదేపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం లోక్‌సభలో చర్చ జరగనుంది. 
 
శుక్రవారం ఉదయం 11 గంటలకు గల్లా జయదేవ్‌ ప్రసంగంతో చర్చ మొదలై సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది. ఆ తర్వాత ప్రధాని మోదీ ఇచ్చే సమాధానంపై సభ్యులు వివరణ కోరవచ్చు. ఈ చర్చ సందర్భంగా సభ్యుల సంఖ్యను బట్టి ఆయా పార్టీలకు మాట్లాడే సమయాన్ని స్పీకర్‌ కేటాయించారు. 
 
ఈ నేపథ్యంలో కేంద్రంపై జరుగనున్న అవిశ్వాస తీర్మానాన్ని దేశ ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారని, ఎంపీలు జాగ్రత్తగా వుండాలని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఉదయం ఓ ట్వీట్ పెట్టిన మోదీ, "ప్రజాస్వామ్య వ్యవస్థలో నేడు ఎంతో ముఖ్యమైన రోజు. నిర్మాణాత్మకంగా, సమగ్రంగా, అవాంతరాలు లేకుండా చర్చ సాగాలని, అందుకు సహచర ఎంపీలంతా సహకరిస్తారని భావిస్తున్నాను. ప్రజలంతా మనల్ని చూస్తున్నారని గుర్తుంచుకోండి" అన్నారు. కాగా, అన్నాడీఎంకే, బిజూ జనతాదళ్, టీఆర్ఎస్ వంటి పార్టీలు ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించడంతో ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోనుండటం ఖాయంగా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments