Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేప్‌కు మరణదండన... బిల్లుపెట్టనున్న కేంద్రం

ఇకపై 12 యేళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారిని ఉరితీసేలా కేంద్ర ప్రభుత్వం ఓ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అదేసమయంలో కేం

రేప్‌కు మరణదండన... బిల్లుపెట్టనున్న కేంద్రం
, గురువారం, 19 జులై 2018 (09:33 IST)
ఇకపై 12 యేళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారిని ఉరితీసేలా కేంద్ర ప్రభుత్వం ఓ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అదేసమయంలో కేంద్ర హోం శాఖ రూపొందించిన ముసాయిదా బిల్లుకు అమోదముద్ర కూడా వేశారు. తాజా ముసాయిదా బిల్లును పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించాక, దాన్ని రాష్ట్రపతికి పంపించి చట్టంగా రూపొందించనున్నారు. ఈ బిల్లులో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే...
 
*  12 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న బాలికపై రేప్ చేసి దోషిగా తేలితే కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష లేదా మరణదండన. 
* మహిళలపై అత్యాచారానికి పాల్పడితే కనీసం పదేళ్ల కఠిన కారాగార శిక్ష  లేదా జీవిత ఖైదుగా పొడిగించవచ్చు.
* 16 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న బాలికలపై అత్యాచారం చేస్తే కనీస జైలు శిక్షను 10 ఏళ్ల నుంచి 20 ఏళ్లకు పెంచారు. 
 
* అత్యాచారాలకు సంబంధించిన అన్ని కేసుల విచారణను 2 నెలల్లో పూర్తిచేస్తారు. అప్పీళ్లను 6 నెలల్లో పరిష్కరిస్తారు.
* 16 ఏళ్ల లోపు బాలికపై రేప్, సామూహిక అత్యాచారం జరిపిన నిందితులకు బెయిల్ మంజూరిపై నిర్ణయం తీసుకోవాల్సి వస్తే 15 రోజుల ముందే బాధితురాలి తరపు లాయర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు కోర్టు నోటీసులు. ఇలాంటి అనేక నిబంధనలను ముసాయిదా బిల్లులో పొందుపరిచారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నై చెవిటి బాలికపై తొలిగా రేప్‌ చేసిన 66ఏళ్ల వృద్ధుడు