Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ ప్రమాదంలో మరణించారా?

Webdunia
శుక్రవారం, 15 నవంబరు 2019 (18:55 IST)
'పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ ప్రమాదంలో మరణించారు'.. ఈ విషయాన్ని ఒడిశా విద్యాశాఖ ప్రచురించిన ఓ రెండు పేజీల బుక్‌లెట్‌ పేర్కొన్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు ప్రారంభమయ్యాయి.

బుక్‌ లెట్‌లో ప్రమాదం కారణంగానే గాంధీ చనిపోయారని మాత్రమే కాకుండా ఆ ప్రమాదం ఎలా జరిగిందో కూడా విశధీకరించారు.. గాంధీజీ హత్యను ప్రమాదంగా చెప్పడాన్ని పలువురు మేధావులే కాకుండా వివిధ వర్గాల ప్రజలు తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.

దీంతో ఒడిశా ప్రభుత్వ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ వ్యవహారంపై ఒడిశా ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ విషయంపై ఒడిశా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సమీర్‌ రంజన్‌ దాస్‌ మాట్లాడుతూ..’ఆమా బాపూజీ : ఏక్‌ ఝలకా’  లో వివాదాస్పదానికి దారితీసిన అంశం ఎలా ప్రచురితమైందనే విషయంపై విచారణకు ఆదేశించామని చెప్పారు.

అలాగే ప్రచురితమైన బుక్ లెట్ ను ఉపసంహరించామని తెలిపారు.. కాగా,  గాడ్సే సానుభూతిపరులు ఉద్దేశపూర్వకంగా ఈ బుక్‌ను ప్రచురించారని సామాజిక  కార్యకర్త ప్రఫుల్లా సమంత్ర విమర్శించారు. గాడ్సే వంటి ఉన్మాది చేతిలో గాంధీ మహాత్ముడు చనిపోయారని చెప్పకుండా భావితరాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

ఓ వైపు గాంధీజీ 150వ జయంత్యుత్సవాలు ఘనంగా చేస్తూ మరోవైపు ఇలా అవమానించడం తగదని హితవు పలికారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం