Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో ఉన్న వ్యక్తిపై స్నేహితుడి మూత్ర విసర్జన

Webdunia
శుక్రవారం, 14 జులై 2023 (17:34 IST)
మొన్నటికిమొన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ గిరిజన వ్యక్తిపై బీజేపీ నేత ఒకరు మూత్ర విసర్జన చేశాడు. ఇపుడు అలాంటి ఘటనపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిపై స్నేహితుడు మూత్రం పోశాడు. ఇక్కడ బాధితుడితో పాటు నిందితుడు కూడా మంచి స్నేహితులే కావడం గమనార్హం. ఈ కేసులో ఇద్దరిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 11వ తేదీన ఈ ఘటన జరుగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
రాష్ట్రంలోని సౌన్‌భద్ర జిల్లాలోని జుగైల్ ప్రాంతంలో స్నేహితులైన బాధితుడు, నిందితుడు కలిసి పీకల వరకు మద్యం సేవించారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. దీంతో రెచ్చిపోయిన జవహర్ పటేల్... స్నేహితుడు గులాబ్‌ కోల్‌పై దాడి చేసి, ఆ తర్వాత మూత్ర విసర్జన చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
బాధితుడు మద్యం మత్తులో ఉండటంతో ఏ జరిగిందో గుర్తించలేక పోయాడు. అయితే, ఈ ఘటనను ఓ వ్యక్తి తన మొబైల్ ఫోనులో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడితో పాటు అతని స్నేహితుడిని కూడా అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్; ఐటంసాంగ్ వద్దన్నారు : ఎం.ఎం. కీరవాణి

ఎ.ఆర్. రెహమాన్ లా గాయకులతో హరి హర వీరమల్లు పాటను పాడించిన కీరవాణి

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments