కాబూల్‌లో ఆత్మాహుతి దాడి - 23 మంది చిన్నారుల మృతి

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (19:13 IST)
తాలిబన్ల పాలనలో ఉన్న ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 23 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఓ విద్యా సంస్థను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. దీంతో 23 మంది చనిపోగా, వీరిలో అత్యధికులు విద్యార్థినులే ఉన్నారు. మరో 30 మంది గాయపడ్డారు. 
 
ఈ బాంబు దాడి వెస్ట్ కాబూల్ దాష్త్ ఏ బర్చీ అనే ఏరియాలోని కాజ్ ఎడ్యుకేషనల్ సెంటరులో భారీ విస్పోటనంతో ఈ పేలుడు సంభవించింది. ఆ సమయంలో విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. 
 
ఈ పేలుడు ధాటికి చనిపోయిన వారిలో అత్యధికులు మైనారిటీకి చెందిన హజారాకు తెగకు చెందిన వారిగా గుర్తించారు. ఆప్ఘనిస్థాన్‌లో హాజారాలు(షియా తెగ ప్రజలు) మైనార్టీలుగా పరిగణిస్తారు. తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత వీరిని లక్ష్యంగా చేసుకుని ఈ బాంబు దాడులు జరుగుతున్నాయి. 
 
అయితే, తాజాగా జరిగిన బాంబు దాడికి ఏ సంస్థా కూడా నైతిక బాధ్యత వహించలేదు. దాడి జరిగిన సమయంలో విద్యా సంస్థలో దాదాపు 500 మందికిపైగా చిన్నారులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments