Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి - 23 మంది చిన్నారుల మృతి

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (19:13 IST)
తాలిబన్ల పాలనలో ఉన్న ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 23 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఓ విద్యా సంస్థను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. దీంతో 23 మంది చనిపోగా, వీరిలో అత్యధికులు విద్యార్థినులే ఉన్నారు. మరో 30 మంది గాయపడ్డారు. 
 
ఈ బాంబు దాడి వెస్ట్ కాబూల్ దాష్త్ ఏ బర్చీ అనే ఏరియాలోని కాజ్ ఎడ్యుకేషనల్ సెంటరులో భారీ విస్పోటనంతో ఈ పేలుడు సంభవించింది. ఆ సమయంలో విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. 
 
ఈ పేలుడు ధాటికి చనిపోయిన వారిలో అత్యధికులు మైనారిటీకి చెందిన హజారాకు తెగకు చెందిన వారిగా గుర్తించారు. ఆప్ఘనిస్థాన్‌లో హాజారాలు(షియా తెగ ప్రజలు) మైనార్టీలుగా పరిగణిస్తారు. తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత వీరిని లక్ష్యంగా చేసుకుని ఈ బాంబు దాడులు జరుగుతున్నాయి. 
 
అయితే, తాజాగా జరిగిన బాంబు దాడికి ఏ సంస్థా కూడా నైతిక బాధ్యత వహించలేదు. దాడి జరిగిన సమయంలో విద్యా సంస్థలో దాదాపు 500 మందికిపైగా చిన్నారులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments