Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. 20 మంది మృత్యువాత

bomb blast
, సోమవారం, 5 సెప్టెంబరు 2022 (16:25 IST)
ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఇక్కడి రాయబార కార్యాలయం వద్ద జరిగిన ఈ దాడిలో ఇద్దరు రష్యా దౌత్య సిబ్బందితో సహా 20 మంది చనిపోయారు. 
 
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని తాలిబన్ పాలకులు స్వాధీనం చేసుకున్న తర్వాత వరుస బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు జరుగుతున్న విషయం తెల్సిందే. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కాబూల్‌లోని రష్యా దౌత్య కార్యాలయం వద్ద జరిగిన పేలుడులో భారీ ప్రాణనష్టం వాటిల్లింది. 

అలాగే, ఈ నెల 2న ఓ మసీదు వద్ద జరిగిన రెండు పేలుళ్ళలో 20 మంది చనిపోయారు.  వీరిలో ప్రముఖ మత నాయుకుడు మజిబ్ ఉల్ రహమాన్ అన్సారీ కూడా ఉన్నారు. మరో 200 మంది వరకు గాయపడ్డారు.

హెరాత్ నగరంలోని గుజర్గా మసీదులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం ప్రార్థనల నిమిత్తం పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో వారిని లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లు సంభవించాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైస్కూల్ స్టూడెంట్‌పై లైంగిక వేధింపులు.. మఠాధిపతి ఆత్మహత్య