Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైఖేల్ జాక్సన్‌ ఎస్టేట్ అమ్ముడుపోయింది.. ఆయన కెరీర్‌లో ఓ మచ్చగా...?

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (13:10 IST)
దివంగత పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్‌కు చెందిన నెవర్‌ల్యాండ్ ఎస్టేట్ అమ్ముడుపోయింది. కాలిఫోర్నియాలో ఉన్న ఆ ఎస్టేట్‌ను అమెరికాకు చెందిన బిలియనీర్ రాబ్ బర్క్లే ఖరీదు చేశారు. సుమారు 2.2 కోట్ల డాలర్లుకు నెవర్‌ల్యాండ్ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. 2009లో మూన్‌వాకర్‌, కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ అనుమానాస్పద రీతిలో మృతిచెందిన సంగతి తెలిసిందే. 
 
2700 ఎకరాలు ఉన్న నెవర్‌ల్యాండ్ ఎస్టేట్‌ను మైఖేల్ అత్యంత అద్భుతం తీర్చదిద్దారు. కానీ నెవర్‌ల్యాండ్ ఎస్టేట్ మైఖేల్ కెరీర్‌లో ఓ మచ్చగా కూడా మిగిలింది. చిన్న పిల్లలపై లైంగిక వేధింపులకు మైఖేల్ ఇక్కడే పాల్పడినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. మైఖేల్ జాక్సన్ మరణించిన తర్వాత నెవర్‌ల్యాండ్ ఎస్టేట్‌ను సైకామోర్ వాలీ రాంచ్‌గా పేరు మార్చారు.
 
మోంటానాకు చెందిన వ్యాపారవేత్త బర్క్లే.. జాక్సన్ ఎస్టేట్‌ను కొనుగోలు చేశారు. నిజానికి చాలా తక్కువ ధరకే జాక్సన్ స్థలం అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. 2015లో ఈ ఎస్టేట్‌ను వంద మిలియన్ల డాలర్లకు అమ్మేందుకు ప్రయత్నాలు జరిగాయి. 
 
కానీ వ్యాపారవేత్త బర్క్లే కేవలం 22 మిలియన్ల డాలర్లకే ఆ ఎస్టేట్‌ను సొంతం చేసుకున్నట్లు ఆయన తరపు ప్రతినిధి వెల్లడించారు. నెవర్‌ల్యాండ్ ఎస్టేట్‌ను మైఖేల్ జాక్సన్ 1980 దశకంలో 20 మిలియన్ల డాలర్లకు ఖరీదు చేశాడు. అయితే మైఖేల్ మరణానికి ఏడాది ముందే ఆ ఎస్టేట్‌ను థామస్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ 23 మిలియన్ల డాలర్లకు సొంతం చేసుకుంది.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం