Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో అసభ్యంగా ప్రవర్తించిన జ్యోతిష్కుడు : హత్య చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టేశారు...

ఠాగూర్
శనివారం, 22 ఫిబ్రవరి 2025 (08:55 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్టణం జిల్లా భీమిలిలో దారుణం జరిగింది. జ్యోతిష్కుడుని భార్యాభర్తలు కలిసి దారుణంగా చంపేశారు. ఆ తర్వాత మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. భీమిలి మండలంలోని నేర్లవలస గ్రామానికి చెందిన ఊళ్ల చిన్నారావు, మౌనిక అనే దంపతులు... ఆనందపురం మండలం లొడగలవానిపాలెంలో వీరు నివాసం ఉంటున్నారు. 
 
జ్యోతిష్కుడు అప్పన్న (50)తో పూజలు చేయించుకోవడం కోసం మౌనిక ఈ నెల 7న ఆయనను ఇంటికి ఆహ్వానించింది. ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన అప్పన్న ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఈ విషయాన్ని మౌనిక తన భర్తకు చెప్పింది. ఇద్దరూ కలిసి అప్పన్నను హత్య చేయాలని నిర్ణయించి ప్రణాళిక రచించారు. 
 
ఈ నెల 9వ అప్పన్నను కలిసిన చిన్నారావు తన తల్లికి ఆరోగ్యం బాగా లేదని, పూజలు చేయాలంటూ బైకుపై ఎక్కించుకుని బయలుదేరాడు. బోయపాలెం - కాపులప్పాడ మార్గంలో కల్లివానిపాలేనికి చేరుకున్న తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో బైక్ ఆపి, చాకుతో అప్పన్నపై దాడిచేసి చంపేశాడు. 
 
ఈ క్రమంలో చేతికి గాయంతో కావడంతో తర్వాత రోజున కేజీహెచ్‌లో చికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత రోజు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి జ్యోతిష్కుడు మృతదేహం పడివున్న ప్రాంతానికి వెళ్లి పెట్రోల్ పోసి తలగబెట్టాడు. ఈ నెల 19వ తేదీన కల్లివానిపాలెం వద్ద ఆస్థిపంజరాన్ని గుర్తించిన స్థానికుల పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు చిన్నారావు దంపతులపై అనుమానం వచ్చి వారిని ప్రశ్నించగా, హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏప్రిల్ లో ఎర్రచీర - ది బిగినింగ్ డేట్ ఫిక్స్

తల్లి అంజనా దేవి ఆరోగ్యం పై మెగా స్టార్ చిరంజీవి వివరణ

లెవెన్ నుంచి ఆండ్రియా జర్మియా పాడిన ఇక్కడ రా సాంగ్ రిలీజ్

మజాకా నుంచి సొమ్మసిల్లి పోతున్నావే జానపద సాంగ్ రిలీజ్

కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల ఆడపులి : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

దుబాయ్-ప్రేరేపిత క్యాప్సూల్ కలెక్షన్‌ ప్రదర్శన: భారతీయ కోటూరియర్ గౌరవ్ గుప్తాతో విజిట్ దుబాయ్ భాగస్వామ్యం

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

తర్వాతి కథనం
Show comments