Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంత్ - రాధిక సంగీత్‌‍ వేడుకలు : టీ20 వరల్డ్ కప్ హీరోలకు అపూర్వ స్వాగతం

సెల్వి
శనివారం, 6 జులై 2024 (19:21 IST)
దేశ పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్ అంబానీ - నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తాజాగా సంగీత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌ విజేతలకు అరుదైన గౌరవం, అపూర్వ స్వాగతం లభించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, సూర్య కుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యను వేదికపై సాదరంగా ఆహ్వానించి అభినందించారు. అక్కడున్న వారంతా చప్పట్లతో ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ప్రాంగణమంతా మార్మోగిపోయింది. ఈ ముగ్గురూ ముంబై ఇండియన్స్‌ జట్టులో సభ్యులు కావడం విశేషం.
 
ఇకపోతే, సంగీత్‌ వేడుకల్లో భాగంగా నీతా అంబానీ ఈ ముగ్గురు క్రికెటర్లను వేదికపైకి పిలిచారు. తొలుత రోహిత్‌ శర్మను, తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ను నీతా వేదికపైకి వరుసగా ఆహ్వానించారు. వారికి స్వాగతం పలికేటప్పుడు టీ20 ప్రపంచకప్‌లో వారి ఘనతలను ప్రస్తావించారు. వేదికపైకి వచ్చాక వారిని హత్తుకున్నారు. ఈ క్రమంలో ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. 
 
హార్దిక్ పాండ్య గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. 'కఠిన సమయాలు నిరంతరం ఉండవు. కానీ, వాటికి ఎదురు నిలిచినవారే ముందుకు సాగగలరు' అంటూ పాండ్యపై వచ్చిన విమర్శలను ఉద్దేశించి అన్నారు. వేదికపైకి వచ్చిన తర్వాత ముఖేశ్‌ అంబానీ సైతం క్రికెటర్లను అభినందించారు. 2011 తర్వాత ప్రపంచకప్‌ను దేశానికి అందించి దేశం గర్వపడేలా చేశారంటూ కితాబిచ్చారు. అంతకుముందు జరిగిన సంగీత్‌ కార్యక్రమంలో ముఖేశ్‌ అంబానీ కుటుంబ సభ్యులు ఆటాపాటలతో అలరించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్ చక్కర్లు కొడుతున్నాయి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Eina (@eina_isingh)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నారా లోకేష్‌కు టీడీపీ నాయకత్వ పగ్గాలు అప్పగిస్తారా? చంద్రబాబు యాన్సర్ ఏంటి?

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments