Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఆగని రాజకీయ రక్త చరిత్ర... వెన్నా బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (21:54 IST)
ఏపీలో రాజకీయ రక్త చరిత్ర ఆగట్లేదు. పల్నాడు జిల్లాలో టీడీపీ మండల అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఉదయం పూట వాకింగ్‌కు వెళ్ళినప్పుడు.. గొడ్డళ్లతో దాడి చేసిన దుండగులు.. వెన్న బాలకొటిరెడ్డి చనిపోయాడని వదలివెల్లినట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన వెన్న బాలకోటి రెడ్డిని గుర్తించిన ఆయన బంధువులు హుటాహుటిన నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. 
 
వెన్న బాలకోటిరెడ్డి మాజీ రొంపిచర్ల అధ్యక్షుడుగా పనిచేశారు. ఆయనపై దాడి చేసింది ఎవరు? దాడికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలు తెలియాల్సి ఉంది. టీడీపీ శ్రేణులు మాత్రం ఈ దాడికి పాల్పడింది వైసీపీ నేతలే అని ఆరోపిస్తున్నారు. 
 
ఈ దాడి నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముఖ్యంగా ఈ దాడిలో వైసీపీ ఎంపీపీ భర్తే పాల్గొన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే హత్యకు కుట్ర చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
అయితే సీఎం జగన్ ప్రోత్సాహంతోనే హత్యా రాజకీయాలు అని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. కోటిరెడ్డిపై అలవల గ్రామంలో వైసీపీ రౌడీలు చేసిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆగ్రహించారు. ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లిన వ్యక్తిపై గొడ్డళ్ళతో దాడి చేశారంటే ఏపీలో శాంతి భద్రతల రక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? నిద్రపోతున్నాయా? అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments