Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించిన టీడీపీ

chandrababu
, సోమవారం, 11 జులై 2022 (16:40 IST)
రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఈ నెల 18వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రపతి పదవి కోసం ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాలు పోటీ చేస్తున్నారు. 
 
అయితే, ద్రౌపది ముర్ము గెలుపు లాంఛనప్రాయంగా మారింది. ఈ నేపథ్యంలో పలు పార్టీలు ఆమెకు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ కోవలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆమెకే మద్దతు ప్రకటించారు. 
 
ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించి ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. సామాజిక న్యాయానికే తొలి నుంచి తెదేపా కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ద్రౌపది ముర్ముకు ఓట్లు వేస్తారని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాయి భక్తులకు శుభవార్త.. షిర్డీకి 4 రోజుల టూర్ ప్యాకేజీ