Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోలవరం ప్రాజెక్టు గడువును పెంచిన కేంద్రం

polavaram dam
, మంగళవారం, 19 జులై 2022 (17:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ గడువును కేంద్ర ప్రభుత్వం మరోమారు పొడగించింది. నిజానికి ఈ ప్రాజెక్టు నిర్మాణం గత యేడాదే పూర్తికావాల్సివుంది. కానీ, ఈ గడువును వచ్చే 2024కు పొడగించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంతో టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ మంగళవారం రాతపూర్వక సమాధానమిచ్చింది. ఈ యేడాది ఏప్రిల్ నాటికే పోలవరం పూర్తి కావాల్సివుందని ఆ ప్రకటన పేర్కొంది. 
 
ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై కేంద్ర జలశక్తి శాఖ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థ చర్యల వల్లే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం చోటుచేసుకుందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వహణలోనూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి లోపభూయిష్టంగా ఉందని తెలిపారు. ఈ కారణంగానే నిర్మాణంలో తీవ్ర జాప్యానికి కారణమైందని తెలిపారు. అందుకే పోలవరం నిర్మాణ గడవును మరోమారు పొడగించక తప్పలేదని పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Kerala: NEET పరీక్ష రాయాలంటే అమ్మాయిలు లోదుస్తులు తొలగించాల్సిందేనన్న నిర్వాహకులు.. పోలీసులకు ఓ తండ్రి ఫిర్యాదు