Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం : అంబటి రాంబాబు

ambati
, బుధవారం, 1 జూన్ 2022 (14:33 IST)
విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. నిజం చెప్పాలంటే ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు గడువంటూ ఏదీ లేదన్నారు. పైగా, ఏ ప్రాజెక్టు అయినా దశలవారీగానే పూర్తవుతుందని మంత్రివర్యులు సెలవిచ్చారు. 
 
ఆయన బుధవారం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో టీడీపీ హయాంలో జరిగిన చారిత్రాత్మక తప్పిదం కారణంగానే డయాఫ్రం వాల్ దెబ్బతిందని మంత్రి తేల్చిపారేశారు. పైగా, ఈ డయాఫ్రం వాల్ ఎవరివల్ల దెబ్బతిందో చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
ఇదే అంశంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, గత ప్రభుత్వంలో జలవనరుల శాఖామంత్రిగా పని చేసిన దేవినేని ఉమామహేశ్వర రావులు బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు. ఇంజనీర్లు, మేథావులు, మీడియా  సమక్షంలో ఈ చర్చ జరగాల్సివుందన్నారు. కాపర్ డ్యాం కట్టడం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందని మంత్రి అంబటి రాంబాబు పునరుద్ఘాటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేపు నామినేషన్ దాఖలు చేయనున్న మేకపాటి విక్రమ్ రెడ్డి