Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ప్రయాణికులకు శుభవార్త... టీపై సర్వీసు చార్జి ఎత్తివేత.. కానీ...

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (20:05 IST)
రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. అదేసమయంలో మరో బ్యాడ్ న్యూస్ కూడా చెప్పింది. రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లలో కప్పు టీకి వసూలు చేసే సర్వీస్ చార్జీని రద్దు చేసింది. ఈ రైళ్లలో ఒక కప్పు టీ రూ.20 కాగా, దీనికి వసూలు చేసే సర్వీస్ చార్జి రూ.50గా వుంది. ఇది సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయింది. దీంతో ఐఆర్‌టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
అన్ని రకాల ప్రీమియం రైళ్లలో టీ, కాఫీలపై సర్వీసు ఛార్జీని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో టికెట్‌తో పాటు బుక్‌ చేసుకోకపోయినా.. ఇకపై టీ, కాఫీకి ఎటువంటి సర్వీసు ఛార్జీ, కన్వీనియెన్స్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, చిరుతిళ్లు, భోజనంపై మాత్రం రూ.50 సర్వీసు ఛార్జీని యథావిధిగా కొనసాగించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఐఆర్‌సీటీసీకి ఆదేశాలు జారీ చేసింది.
 
రెండువారాల క్రితం ఓ రైలు ప్రయాణికుడు తాను కప్పు టీ కోసం ఏకంగా రూ.70 వెచ్చించినట్లు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇందులో కప్‌ టీ ధర రూ.20 మాత్రమే. దీనికి సర్వీస్‌ ఛార్జీ రూ.50 చెల్లించాల్సి వచ్చింది. అతడు చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఐఆర్‌సీటీసీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9- ఓటింగ్ ట్రెండ్స్- డేంజర్ జోన్‌లో ఎవరు?

శివకార్తికేయన్‌పై రజనీకాంత్ ప్రశంసలు.. యాక్షన్ హీరో అయిపోయావంటూ కితాబు

Thaman: తెలుగు ఇండియన్ ఐడల్ షో గల్లీ టు గ్లోబల్ అయింది : అల్లు అరవింద్

కానిస్టేబుల్ ట్రైలర్ విశేష స్పందనతో సినిమాపై నమ్మకం వచ్చింది : వరుణ్ సందేశ్

Pooja Hegde: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే మ్యాజికల్ కెమిస్ట్రీ తో వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments