Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్ర‌బాబు వ‌ల్లే ప్ర‌త్యేక హోదా రాకుండా పోయింది: ప‌వ‌న్ క‌ళ్యాణ్

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి చంద్ర‌బాబు పైన ఫైర్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ప‌వ‌న్ మాట్లాడుతూ... కిడ్నీ బాధితుల కోసం మండలానికో డయాలిసిస్ కేంద్రం పెట్టాలని, అందుకు చంద్రబాబు తన డబ్బులేమీ ఖర్చు పెట్టక్కర్లేదని, ప్రభుత్వం

Webdunia
మంగళవారం, 29 మే 2018 (13:42 IST)
జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి చంద్ర‌బాబు పైన ఫైర్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ప‌వ‌న్ మాట్లాడుతూ... కిడ్నీ బాధితుల కోసం మండలానికో డయాలిసిస్ కేంద్రం పెట్టాలని, అందుకు చంద్రబాబు తన డబ్బులేమీ ఖర్చు పెట్టక్కర్లేదని, ప్రభుత్వం డబ్బే కదా ఖర్చుపెట్టేదని  అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ పాలకొండ, రాజాం నియోజకవర్గ కేంద్రాల్లో కవాతు చేశారు.
 
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ... ‘50 గ్రామాల ప్రజలు ఆముదాలవలస - రాజాంల మధ్య బలశాల దగ్గర వంతెన కావాలని ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాజాంలో ప్రభుత్వ కాలేజీ లేదు. అభివృద్ధి అంటే అమరావతి మాత్రమే కాదు రాజాం అని కూడా గుర్తుపెట్టుకోండి. మీ అవినీతిని ప్రశ్నించినందుకు 15 మంది జనసేన సైనికుల్ని జైళ్లలో పెట్టారు. 
 
గత ఎన్నికల్లో మీకు మద్దతు ఇస్తే చేసేది ఇదా? మీ అవినీతిని చూస్తూ సహించం... చొక్కా పట్టుకొని నిలదీస్తాం. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తుడిచి పెట్టుకుపోతుంది. ముఖ్యమంత్రి రాజీపడటం వల్ల, ఆయన కాంట్రాక్టుల కోసం రాజీపడటంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండాపోయింది" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments