Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ కామాంధుడిని ప్రతిఘటించలేక మిన్నకుండిపోయా...

సాయం చేస్తానని చెప్పి హోటల్ వెనుక వైపునకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడనీ, ఆ సమయంలో ఆ కామాంధుడిని ప్రతిఘటించలేక మిన్నకుండిపోయానని ఓ అత్యాచార బాధితురాలు బోరున విలపిస్తూ చెప్పుకొచ్చింది.

ఆ కామాంధుడిని ప్రతిఘటించలేక మిన్నకుండిపోయా...
, మంగళవారం, 29 మే 2018 (13:29 IST)
సాయం చేస్తానని చెప్పి హోటల్ వెనుక వైపునకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడనీ, ఆ సమయంలో ఆ కామాంధుడిని ప్రతిఘటించలేక మిన్నకుండిపోయానని ఓ అత్యాచార బాధితురాలు బోరున విలపిస్తూ చెప్పుకొచ్చింది. ఈ అత్యాచారం హైదరాబాద్, బాచుపల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఈ అత్యాచార ఘటన వివరాలను పరిశీలిస్తే..
 
బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌కు చెందిన ఓ యువతి (20), తన తల్లికి కావాల్సిన మందుల కోసం సోమవారం రాత్రి మెడికల్ షాపుకు వెళ్లేందుకు ఇంటికి సమీపంలో ఉన్న రోడ్డుపైకి వచ్చి నిలబడింది. 
 
ఆ సమయంలో ఇందిరమ్మ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ ఎస్.పరశురామ్ అటుగా వెళుతూ, ఆ యువతి వద్ద ఆటోను ఆపి.. ఎక్కడికి వెళ్లాలి అని అడిగాడు. దానికి మెడికల్ షాపుకు వెళ్లాలని ఆమె చెప్పింది. సరే.. మెడికల్ షాపు వద్ద దించుతానని ఆటో డ్రైవర్ ఆ యువతిని నమ్మించాడు. దీంతో ఆమె ఆటో ఎక్కింది. వెంటనే ఆటో డ్రైవర్ నిర్మానుష్యంగా ఉండే ఓ హోటల్ వెనుక ప్రదేశానికి తీసుకెళ్లి ఆటోలోనే అత్యారానికి పాల్పడ్డాడు. 
 
దాహంతో మంచినీళ్ల కోసం ప్రాధేయపడటంతో, అదే ఆటోలో ఓ టీ స్టాల్ వద్దకు తీసుకువచ్చాడు. ఆ సమయంలో అటుగా వెళుతున్న పెట్రోలింగ్ వ్యాన్‌ను చూసి యువతి కేకలు వేయడంతో ఆమెను వదిలి ఆటోలో పారిపోయాడు. ఏదో జరిగిందని తెలుసుకున్న పోలీసులు, తమ వాహనంలో ఆటోను ఛేజ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. 
 
జరిగిన ఘటనపై బాధితురాలు స్పందిస్తూ, అనారోగ్యంతో ఉన్న తన తల్లికి అవసరమైన అత్యవసర మందుల కోసం అర్ధరాత్రి రోడ్డుపైకి వచ్చి నిలపడగా, అటుగా వచ్చిన పరశురామ్ తనను నమ్మించి మోసం చేశాడనీ వాపోయింది. పైగా, అత్యాచారం చేసే సమయంలో ఆ కామాంధుడిని ప్రతిఘటించలేక మిన్నకుండిపోయినట్టు తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాది రెండు కళ్ల సిద్ధాంతం కాదు.. రాజీనామాలపై వెనక్కి తగ్గం : వైకాపా ఎంపీలు