తిరుమల తిరుపతి దేవస్థానానికి 30మంది సభ్యులతో కొత్త పాలక మండలిని ప్రభుత్వం నియమించింది. వీరిలో నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులు ఉంటారు.
ఈ మేరకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గత బోర్డుల నియామకం సమయంలోనూ ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్య పరిమితంగా ఉండగా ఈసారి మాత్రం ఏకంగా 50మందిని నియమించింది. దీంతో మొత్తం బోర్డు సభ్యులు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తో కలుపుకుని 81 మంది అయ్యారు.
1. దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, 2. దేవదాయ శాఖ కమిషనర్, 3. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, 4. టీటీడీ ఈవో
ప్రత్యేక ఆహ్వానితులు:
1. భూమన కరుణాకర్ రెడ్డి
2. సుధాకర్ (బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్)
ప్రత్యేక ఆహ్వానితులుగా మరో 50 మంది
50 మందిని టీటీడీ ఆలయ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. టీటీడీ పాలక మండలి సభ్యుల పదవీ కాలం కొనసాగినంత కాలం ఆలయ ప్రత్యేక ఆహ్వానితుల పదవీ ఉంటుందని, పాలక మండలి సభ్యులకు వర్తించే ప్రొటోకాల్ వీరికీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఓటు హక్కు మాత్రం ఉండదు.