Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 40 అనుమానిత ఒమిక్రాన్ కేసులు - 10 మంది ముంబైకర్లకు పాజిటివ్

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (14:41 IST)
దేశంలో ఒమిక్రాన్ వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఇప్పటికే బెంగుళూరులో ఒక వైద్యుడితో పాటు ఇద్దరికి ఈ వైరస్ సోకింది. దీంతో దేశంలోకి ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించినట్టు నిర్ధారణ అయింది. ఇపుడు దేశ వ్యాప్తంగా 40కిపైగా అనుమానితి ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు ఉన్నట్టు సమాచారం. ఈ కేసుల్లో మహారాష్ట్రలో 28, ఢిల్లీలో 12 చొప్పున ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాల సమాచారం. 
 
మహారాష్ట్రలో అనుమానిస్తున్న 28 ఒమిక్రాన్ కేసుల్లో ఏకంగా 10 మంది రోగులు రాజధాని ముంబైకు చెందిన వారే కావడం గమనార్హం. అలాగే, ఢిల్లీలో 12 అనుమానిత కేసులను గుర్తించారు. వీరందరినీ లోక్ నాయక్, జై ప్రకాష్ నారాయణ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం ఎనిమిది అనుమానితులను ఆస్పత్రిలో చేర్చగా శుక్రవారం మరో నలుగురిని తరలించారు.
 
ఇదిలావుంటే, గురువారం ఒక్క రోజే వివిధ దేశాల నుంచి 861 మంది ప్రయాణికులు దేశంలోకి వచ్చారు. వీరిందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా, ఇందులో 28 మందికి ఒమిక్రాన్ వైరస్ సోకినట్టు అనుమానిస్తున్నారు. ఈ 28 మందిలో 25 మంది అంతర్జాతీయ ప్రయాణికులు కాగా, మరో ముగ్గురు వారి కాంటాక్ట్‌లని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

ఫస్ట్ టైమ్ హరుడు తో మాస్ చిత్రం చేశా : హీరో వెంకట్

నేను గ్యాప్ తీసుకుంది దాని కోసమే : దర్శకుడు శ్రీను వైట్ల

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments