Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలో నారా లోకేష్‌పై సెటైర్లు.. ఎందుకని?

ఏపీ మంత్రి నారా లోకేష్ మళ్లీ వార్తల్లో నిలిచారు. దివంగత ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి సంతాప సందేశాన్ని కవిత్వంలో ప్రారంభించి.. చరిత్ర గురించి వివరిస్తూ చివరికి తన తండ్రి పాలన గురించి గొప్పలు చ

Webdunia
బుధవారం, 22 ఆగస్టు 2018 (11:02 IST)
ఏపీ మంత్రి నారా లోకేష్ మళ్లీ వార్తల్లో నిలిచారు. దివంగత ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి సంతాప సందేశాన్ని కవిత్వంలో ప్రారంభించి.. చరిత్ర గురించి వివరిస్తూ చివరికి తన తండ్రి పాలన గురించి గొప్పలు చెప్పుకోవడం పట్ల నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. నారా లోకేష్ ట్వీట్ ప్రస్తుతం విపరీతంగా వైరల్‌ అవుతోంది. నారో లోకేష్‌కు రాజకీయాల పట్ల ఇంకా అవగాహన రాలేదని ఎద్దేవా చేస్తున్నారు. 
 
ఇంతకీ విషయం ఏమిటంటే.. వాజ్‌పేయ్‌ కన్నుమూత సందర్భంగా లోకేష్‌ విడుదల చేసిన సంతాప సందేశంపై సోషల్‌ మీడియాలో మూడు రోజులుగా సెటైర్లు పేలుతున్నాయి. సంతాప సందేశంలో వాజ్‌పేయ్‌ కంటే తన తండ్రి చంద్రబాబు నాయుడినే లోకేష్‌ ఎక్కువగా ప్రస్తావించడంపై నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. 
 
గతంలో ప్రసంగంలో పొరపాట్లు చేసి నోరుజారి నారా లోకేష్ పరువు తీయించుకున్న సందర్భాలున్నాయి. అలాగే గతంలో అంబేద్కర్  జయంతి సభలో పాల్గొని వర్థంతి అంటూ తప్పుగా మాట్లాడడంతో సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఏపీ మంత్రి హోదాలు వుండి వర్థంతికి, జయంతికి తేడా తెలియక నారా లోకేష్ మాట్లాడటంపై జోకులు పేలిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments