Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్ర‌ల‌హ‌రి చిత్ర యూనిట్‌ని అభినందించిన ప‌వ‌న్ కళ్యాణ్‌

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (12:56 IST)
మెగాహీరోల్లో ఒకరైన సాయిధరమ్ తేజ్ గత కొంత కాలంగా సరైన హిట్‌లు లేక డీలా పడ్డాడు. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న తేజ్‌కి చిత్రలహరి చిత్రం కాస్త ఊరటనిచ్చింది. ఫీల్‌గుడ్ ప్రేమకథా చిత్రాల దర్శకుడుగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. విజయ్ అనే పాత్రలో సాయిధరమ్ తేజ్ మంచి నటనను కనబరిచాడు. 
 
గత చిత్రాలతో పోల్చితే ఈ చిత్రంలో పూర్తిభిన్నంగా సెటిల్డ్ పర్‌ఫార్మెన్స్‌ను కనబరిచాడు. సంఘర్షణతో కూడుకున్న స్ఫూర్తివంతమైన పాత్రలో ప్రేక్షకులను మెప్పించాడు. మరోవైపు కథానాయికలు కల్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్ తన పాత్రలకు న్యాయం చేశారు. పోసాని, రావురమేష్, వెన్నెల కిషోర్, సునీల్ తదితరులు తమదైన శైలిలో మెప్పించారు. దేవిశ్రీప్రసాద్ సమకూర్చిన సంగీతం బాగుంది.
 
మొత్తానికి ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాని చూసిన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఈ చిత్రాన్ని తాను చాలా ఎంజాయ్ చేసానని పవన్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవారికి మాత్రమే కాదు.. దుర్గమ్మ, శ్రీశైలం, కాణిపాకానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా...

ఆరుసార్లు వాయిదాపడింది.. ఇపుడు ఏడోసారి కూడా... ఆక్సియమ్ మిషన్-4 వాయిదా

పెళ్లయిన ఆరు నెలలకే వేధింపులు - కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య

బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి నీతా అంబానీ రూ.కోటి విరాళం

Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments