Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐశ్వర్యా రాయ్ ఔట్... చిరంజీవి సరసన గోవా బ్యూటీ....?

Webdunia
గురువారం, 5 సెప్టెంబరు 2019 (12:23 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". వచ్చే నెల 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకురానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హీరో రామ్ చరణ్ తన సొంత నిర్మాణ సంస్థపై నిర్మిస్తున్నారు. నయనతార, అమితాబ్, జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి వంటి అగ్ర తారాగాణం నటించారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. 
 
ఇదిలావుంటే, చిరంజీవి తన 152వ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివతో చేయనున్నారు. సామాజిక ఇతివృత్తంతో నిర్మించే ఈ చిత్రంలో హీరోయిన్ల కోసం వేట సాగించారు. ఈ వేటలో అనుష్క, శృతిహాసన్, ఐశ్వర్యా రాయ్ ఇలా అనేక మంది పేర్లను పరిశీలించారు. అయితే, ఇపుడు తాజాగా గోవా బ్యూటీ ఇలియానా పేరు తెరపైకి వచ్చింది. 
 
మెగా కాంపౌండ్‌లోకి ఇల్లీ బేబీ ప్రవేశిస్తుందని, చిరంజీవితో కలిసి కాలు కదుపుతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. అయితే, మెగా కాంపౌండ్ నుంచి దీనిపై క్లారిటీ రావాల్సి వుంది. ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో వ‌రుస చిత్రాలు చేసిన ఇలియానా కొన్నాళ్లు గ్యాప్ తీసుకుంది. ర‌వితేజ చిత్రం "అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని"తో తెలుగు తెర‌కి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. అలాగే, తన ఇంగ్లీష్ ప్రియుడుతో విడిపోయింది. 

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments