Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ చానెల్‌లో భాగస్వామికానున్న 'బాహుబలి' ప్రభాస్

Webdunia
మంగళవారం, 14 మే 2019 (13:19 IST)
టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ ప్రభాస్. "బాహుబలి" చిత్రం తర్వాత ఈ హీరో రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం "సాహో" చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మరోవైపు, ప్రభాస్ వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నాడు. 
 
ఇందులోభాగంగా, ఆయన సొంతంగా ఓ టీవీ చానెల్‌లో భాగస్వామికానున్నట్టు ఫిల్మ్ నగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్ర‌భాస్ స్నేహితులు వంశీ కృష్ణా రెడ్డి, ఉప్ప‌ల‌పాటి ప్ర‌మోద్‌లు కలిసి త్వరలో ఓ టీవీ చానెల్‌ను ప్రారంభించనున్నారు. ఇందులో ప్ర‌భాస్ కూడా భాగ‌స్వామి కానున్నారన్నది టాక్. అయితే, ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాల్సివుంది. 
 
ఏదేమైన మ‌న స్టార్స్ ఓ వైపు న‌ట‌న‌ని కొన‌సాగిస్తూనే మ‌రోవైపు బిజినెస్ రంగాలపై దృష్టి పెట్ట‌డం విశేషం. ఇటీవ‌లి కాలంలో మ‌హేష్ బాబు ఏఎమ్‌బీ అనే మ‌ల్టీ ప్లెక్స్‌తో బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన విష‌యం విదిత‌మే. బ‌న్నీ కూడా త్వర‌లోనే ఓ మ‌ల్టీప్లెక్స్ నిర్మించ‌నున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది. గతంలో చిరంజీవి, నాగార్జున కూడా మా టీవీలో భాగస్వాములుగా ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments