Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపం వినాయక్, చిరు షాక్ ఇచ్చారా?

chiru
Webdunia
శనివారం, 10 అక్టోబరు 2020 (13:41 IST)
ఆది సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన వినాయక్.. అనతి కాలంలోనే స్టార్ హీరోలను డైరెక్ట్ చేసి స్టార్ డైరెక్టర్ అయ్యారు. అయితే.. మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 సినిమాని డైరెక్ట్ చేసి సంచలన విజయం సాధించారు. ఆ తర్వాత కెరీర్లో గ్యాప్ వచ్చింది. దీంతో డైరెక్షన్ పక్కన పెట్టి యాక్టర్‌గా ఎంట్రీ ఇవ్వాలి అనుకున్నారు.
 
శీనయ్య అనే సినిమాలో మెయిన్ లీడ్‌గా నటించడానికి ఒప్పుకోవడం.. షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది కానీ.. కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ ఆగింది. ఇదిలా ఉంటే.. వినాయక్ చిరుతో లూసీఫర్ రీమేక్ చేయనున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులుచేర్పులు చేసారు. చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
 
అయితే... ఆచార్య తర్వాత చిరంజీవి వినాయక్‌తో లూసీఫర్ రీమేక్ స్టార్ట్ చేస్తారో..? మెహర్ రమేష్‌తో వేదాళం రీమేక్ చేస్తారా..? అనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఆచార్య షూటింగ్‌ని వచ్చే నెలలో స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాతే నెక్ట్స్ ఏ సినిమా చేయాలి అనేది ఫైనల్ చేస్తారని సమాచారం.
 
అయితే.. వినాయక్ పుట్టినరోజు సందర్భంగా చిరు తనతో చేయనున్న మూవీని ఎనౌన్స్ చేస్తారని వినాయక్ ఆశించారట. ఆచార్య తర్వాత ఎవరితో సినిమా చేయాలో ఇంకా కన్ఫర్మ్ కాలేదు కనుక ఇప్పుడు ప్రకటించలేదు. వినాయక్ మాత్రం తన పుట్టినరోజు కానుకగా ఎనౌన్స్ చేస్తారనుకున్నారట. అలా... జరగకపోవడంతో ఫీలయ్యాడని టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments