Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్జికల్ స్ట్రైక్స్‌పై బాలీవుడ్ స్పందన...

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (11:40 IST)
ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో మొత్తం 43 మంది సీఆర్పీఎఫ్ జవానులు అమరులయ్యారు. మొదట ఈ ఘటనకు మేము బాధ్యులం కాదు.. భారత్ మాపై నిరాధార ఆరోపణలు చేస్తోందంటూ ప్రకటించేసి హడావుడి చేసేసిన పాక్, తమ సొంతగూటి ఉగ్రవాద సంస్థ జైషే -ఎ- మొహమ్మద్ తమదే బాధ్యత అని ప్రకటించడంతో తేలు కుట్టిన దొంగలా ఏమీ మాట్లాడలేకపోయింది. 
 
అయితే... ఈ ఉదంతం నేపధ్యంలో భారత్‌లోని అన్ని వర్గాలలోనూ పాక్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అలాగే పాక్‌పై వెంటనే ప్రతీకార దాడి చేయాలనే డిమాండ్ కూడా గట్టిగానే వినిపించింది. తాజాగా మంగళవారం వేకువజామున భారత వాయుసేన పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహిస్తూండడంతో ఈ వార్త తెలుసుకున్న దేశ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖులు దీనిపై వెంటనే స్పందించి మోడీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నటుడు అనుపమ్‌ఖేర్ ట్విట్టర్ వేదికగా ‘భారత్ మాతాకీ జై’ అని పేర్కొనగా, మరో నటుడు పరేష్ రావల్ ‘నరేంద్ర మోదీగారూ ధన్యవాదాలు... మన సేనా నాయకులకు జయహో’ అని కామెంట్ చేసారు. అలాగే అజయ్ దేవగన్ ‘భారతీయ వాయుసేనకు సలామ్’ అని పేర్కొనగా, అభిషేక్ బచ్చన్ ‘భారతమాతకు వందనాలు’ అని రాయడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments