Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్... ఒక్క నిమిషం అలా ఉండండి... వేడుకున్న జూ.ఎన్టీఆర్

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (11:29 IST)
ఏ సినిమా ఫంక్షన్‌కి హాజరైనా చివరన 'మీ కోసం వేచి చూసే వారు ఉంటారు. జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి. ఈ సంతోషాన్ని వారితో కూడా పంచుకోండి..' అంటూ అభిమానులకు చెబుతూ ఉండే నందమూరి యువ హీరో ఎన్టీఆర్... ఈసారి ప్రసంగం ప్రారంభంతోనే ఆకట్టుకునేసాడు...
 
వివరాలలోకి వెళ్తే... నందమూరి కల్యాణ్ రామ్ - షాలిని పాండేలు జంటగా నటించిన చిత్రం ‘118’. ఈ సినిమా ప్రీ రిలీజ్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో మాట్లాడేందుకు మైక్ అందుకున్న తారక్ ‘‘ముందుగా మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. ఈ మధ్య జరిగిన ఓ ఘోరమైన సంఘటన గురించి మీ అందరికీ తెలిసిందే. 
 
మన దేశ భద్రత కోసం, మన భద్రత కోసం పని చేస్తున్న వారికి జరిగినటువంటి ఘోర సంఘటనకు గానూ.. మన దేశం కోసం అహర్నిశలూ కుటుంబాలను వదిలేసి పహారా కాస్తున్నటువంటి ఆ వీర జవాన్ల కోసం.. అలాగే ఈ మధ్య మా సినిమా ఇండస్ట్రీలో మేము కోల్పోయిన కొంత మంది దిగ్గజాల కోసం.. వీళ్లందరి ఆత్మకు శాంతి చేకూరాలని ఒక్క నిమిషం మౌనం పాటించాలని మిమ్మల్నందరినీ వేడుకుంటున్నాను’’ అని కోరాడు. 
 
ఈ మాటతో అక్కడ ఉన్న వారంతా నిలబడి మౌనం పాటించారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ.. అతని అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా తారక్‌పై ప్రశంసల వర్షం కురిపించడానికి కారణం అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో బిస్ట్రోలో డ్రగ్ పార్టీ జరిగిందా?

తండ్రి ఫిర్యాదు ఎఫెక్ట్.. ఠాణాలో తనయుడు ... నిరసన తెలిపిన హీరో (Video)

Delhi: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు? మహిళను ముఖ్యమంత్రి చేయనున్నారా?

అమెరికాకు పాకిన బర్డ్ ఫ్లూ.. డజను కోడిగుడ్ల ధర రూ.800పైనే.. చికెన్ ధరలకు రెక్కలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments