Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ రికార్డు సృష్టించిన రామానంద సాగర్ 'రామాయణం'

Webdunia
శనివారం, 2 మే 2020 (18:26 IST)
33 సంవత్సరాల తరువాత మళ్లీ ప్రసారం అయిన "రామాయణం" ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన వినోద కార్యక్రమంగా ప్రపంచ రికార్డు సృష్టించింది. కరోనా వైరస్ విజృంభణ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన వెంటనే మార్చిలో దూరదర్శన్ నేషనల్లో రామాయణం ప్రసారం ప్రారంభమైంది. ఏప్రిల్ 16 న ప్రపంచవ్యాప్తంగా 77 మిలియన్ల (7.7 కోట్లు) ప్రజలు ఈ ప్రదర్శనను చూశారని డిడి నేషనల్ ట్విట్టర్ ద్వారా తెలిపింది.
 
"దూరదర్శన్‌లో రామాయణం యొక్క పునఃప్రసారం ప్రపంచవ్యాప్తంగా వీక్షకుల రికార్డులను బద్దలు కొట్టింది, ఈ ప్రదర్శన ఏప్రిల్ 16న 7.7 కోట్ల మంది ప్రేక్షకులతో ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన షోగా నిలిచింది" అని డిడి నేషనల్ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
 
రామనంద్ సాగర్ రాసిన, నిర్మించిన మరియు దర్శకత్వం వహించిన "రామాయణం", 1987లో దూరదర్శన్‌లో మొదటిసారి ప్రసారం చేయబడింది. ఈ సీరియల్లో రాముడిగా అరుణ్ గోవిల్, సీతగా దీపిక చిఖ్లియా తోపివాలా, లక్ష్మణ్ పాత్రలో సునీల్ లాహ్రీ నటించారు. ఇందులో ప్రముఖ నటులు లలితా పవార్ మంతారా, అరవింద్ త్రివేది రావణ, దారా సింగ్ హనుమంతుడిగా నటించారు.
 
కాగా "ఉత్తర రామాయణం" చివరి ఎపిసోడ్ శనివారం ప్రసారం కానుంది. ఈ షో స్థానంలో సాగర్ యొక్క మరో ప్రసిద్ధ సిరీస్ "శ్రీ కృష్ణ" ఉంటుంది, ఇది ఆదివారం నుండి ప్రసారం కానుంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments