Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రామాయణ సీరియల్ 'సుగ్రీవుడు' ఇకలేరు

రామాయణ సీరియల్ 'సుగ్రీవుడు' ఇకలేరు
, గురువారం, 9 ఏప్రియల్ 2020 (19:08 IST)
ఒకపుడు బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్ "రామాయణం". ఈ సీరియల్ కొన్ని నెలల పాటు దూరదర్శన్‌లో ప్రదర్శితమైంది. ఇపుడు లాక్‌డౌన్ కారణంగా ఈ సీరియల్‌ను గత నెల 28వ తేదీ నుంచి ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, రాత్రి 9 నుంచి 10 గంటలవరకు ప్రదర్శిస్తున్నారు. ఈ రామాయణ సీరియల్‌లో సుగ్రీవుడు, బాలి పాత్రల్లో నటించిన ప్రముఖ నటుడు శ్యామ్ సుందర్ కాళాని మృతి చెందారు. 
 
ఈ విషయాన్ని ఇదే సీరియల్‌లో రాముడి పాత్రను పోషించిన అరుణ్ గోవిల్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడిస్తూ, శ్యామ్ మృతికి సంతాపం కూడా తెలిపారు. 'రామాయణం' చిత్రంలో సుగ్రీవుడు, బాలిగా ద్విపాత్రాభినయం చేసి ఎంతో పాపుల‌ర్ అయిన‌ శ్యామ్‌సుందర్ కాలానీ కొద్ది కాలంగా క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతూ వచ్చిన ఈయన ఈ నెల 7వ తేదీన కల్కాలో తుదిశ్వాస విడిచారు.
 
కాగా, రామాయణం సీరియ‌ల్‌లో లక్ష్మణ్ పాత్ర పోషించిన నటుడు సునీల్ లాహ్రీ, శ్యామ్‌సుందర్ కాలానీ మరణానికి సంతాపం తెలిపారు. 'మా తోటి న‌టుడు శ్యామ్ కలాని ఆకస్మిక మరణం చెందార‌నే వార్త న‌న్ను ఎంత‌గానో బాధించింది. వారి ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను' అని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీవీ యాంకర్ విశ్వశాంతి అనుమానాస్పద మృతి