Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ 'మన్మథుడు'తో 'గుంటూరు టాకీస్' బ్యూటీ

Webdunia
గురువారం, 27 మే 2021 (12:23 IST)
బుల్లితెర బ్యూటీ రష్మీ యాంకర్. పలు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా, 'గుంటూరు టాకీస్' చిత్రంలో ఈ అమ్మడు రెచ్చిపోయింది. ఈమెకు అటు బుల్లితెరపైనా, ఇటు వెండితెరపైనా మంచి క్రేజ్ ఉంది. యువతలో మంచి ఫాలోయింగ్ వుంది. 
 
ఆ క్రేజ్ ఆమెకి సినిమాల్లో అవకాశాలు కూడా తెచ్చిపెట్టింది. నాయిక ప్రధానమైన హారర్ .. సస్పెన్స్ థ్రిల్లర్లు కూడా చేసింది. అయితే ఆ సినిమాల్లో ఒకటి రెండు మాత్రమే ఆమెకి స్సక్సెస్‌ను తెచ్చిపెట్టాయి.. మిగతా సినిమాలు పరాజయం పాలయ్యాయి. 
 
దీంతో ఆమెకు సినీ అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అయినప్పటికీ సినిమాలపై దృష్టి పెడుతూనే, బుల్లితెరపై ఆమె తన జోరును కొనసాగిస్తూనే ఉంది. సినీమా ఛాన్సుల కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తూనే వుంది. 
 
ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జున సినిమాలో ఒక అవకాశాన్ని దక్కించుకున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించే ఈ యాక్షన్ సినిమా 'గోవా'లో మొదటి షెడ్యూల్ షూటింగు జరుపుకుంది. తదుపరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్లాన్ చేశారు. 
 
ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం రష్మీని తీసుకున్నారట. గతంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రష్మీ 'గుంటూరు టాకీస్' చేసింది. ఆ పరిచయం కారణంగానే ఆమెకి ఈ సినిమాలో ఛాన్స్ దక్కిందని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతో వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు - 8 మంది మృత్యువాత

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments