Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌదీ అరేబియా జైలులో జగిత్యాల వాసి గుండెపోటుతో మృతి

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2022 (10:23 IST)
సౌదీ అరేబియా జైలులో జగిత్యాలకు చెందిన ఓ ఖైదీ మృతి చెందాడు. ఉపాధి కోసం వెళ్లిన ఆయన వీసా గడువు ముగియడంతో అక్కడే ఉండి పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. ఈయన్ను జైల్లో బంధించారు. అయితే, ఆయన జైల్లో గుండెపోటుతో మరణించినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను పరిశీలిస్తే, జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం, మన్నేగూడేనికి చెందిన రాజయ్య అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం జీవనోపాధి కోసం సౌదీకి వెళ్లాడు. అయితే, ఆయన వీసా గడువు ముగిసిపోయింది. 
 
అయినప్పటికీ  ఆయన అక్కడే ఉంటూ వచ్చాడు. ఆ తర్వాత కరోనా మహమ్మారి సమయంలో ఆయన పరిస్థితులు మరింత కఠినంగా తయారయ్యాయి. దీంతో ఆయన స్వదేశానికి వచ్చేందుకు ప్రయత్నించాడు. 
 
ఆ సమయంలోనే రాజయ్య పోలీసులకు చిక్కాడు. వీసా గడువు ముగిసినా దేశంలో అక్రమంగా ఉంటున్నందుకు సౌదీ పోలీసులు అరెస్టు చేసి రియాద్‌లోని డిపోర్టేషన్ సెంటరుకు తరలించారు. ఈ క్రమంలోనే ఆయన అనారోగ్యంబారినపడ్డారు. 
 
దీంతో గత నెల 15వ తేదీన జైలు నుంచి ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో గుండెపోటుకుగురై ప్రాణాలు విడిచాడు. ఈయన మృతి విషయం సౌదీలోని భారత రాయబార కార్యాలయం నుంచి మంగళవారం జగిత్యాలలోని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Fish Venkat: ఫిష్​ వెంకట్​ మళ్ళీ అనారోగ్యంతో వెంటిలేటర్ పై చికిత్స !

HariHara : పులుల్ని వేటాడే బెబ్బులిగా హరిహరవీరమల్లు ట్రైలర్ ఆకట్టుకుంది

Uday Kiran: దిల్ రాజు సోదరుడే క్షమాపణ చెప్పారు.. మెగా ఫ్యామిలీకి ఉదయ్ కిరణ్ ఓ లెక్కా? (Video)

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments