Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా నుంచి కోలుకున్న మంత్రి కేటీఆర్.. నేటి నుంచి అసెంబ్లీకి...

Advertiesment
ktrktr
, మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (12:34 IST)
కరోనా వైరస్ బారినపడిన తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆ వైరస్ నుంచి కోలుకున్నారు. ఆయనకు సోమవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ ఫలితం వచ్చింది. ఈ విషయాన్ని తెరాస పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. 
 
ఇటీవలే కరోనా వైరస్ బారినపడిన మంత్రి కేటీఆర్‌కు సోమవారం వైద్యులు పరీక్షలు చేయగా, కోవిడ్ నెగెటివ్‌గా ఫలితం వచ్చిందని తెలిపారు. ఈ ఫలితంలో కరోనా నుంచి ఆయన పూర్తిగా కోలుకున్నట్టు వైద్యులు ధృవీకరించారు. 
 
దీంతో మంగళవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ ప్రారంభమయ్యే సమావేశాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొంటారని చెప్పారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరువుతారని తెరాస ప్రకటించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : తెలంగాణాలో ఈడీ సోదాలు